S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/23/2017 - 00:16

న్యూఢిల్లీ, జూన్ 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో 250 బిలియన్ యూనిట్ల (బియు) విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న దిగ్గజ విద్యుత్ సంస్థ ఎన్‌టిపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర విద్యుత్ శాఖతో కుదుర్చుకున్న పనితీరు ఒప్పందం (పెర్ఫార్మెన్స్ ప్యాక్ట్)లో ఎన్‌టిపిసి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

06/23/2017 - 00:16

హైదరాబాద్, జూన్ 22: నెదర్లాండ్‌కు చెందిన వాణిజ్య ప్రతినిధి బృందం నగరంలోని బయోలాజికల్ ఈ.లిమిటెడ్ (బిఈ)ను సందర్శించింది. గురువారం బిఈ మేనేజింగ్ డైరక్టర్ మహిత దాట్ల, ఆ కంపెనీలోని ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కలిసింది. నెదర్లాండ్‌కు చెందిన ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖ డైరక్టర్ జనరల్, వైస్ మినిస్టర్ మార్టెన్ వన్ డెన్ బెర్గ్, భారత్‌లోని నెదర్లాండ్ రాయబారి అల్‌ఫోన్సస్ స్టోయిలింగా బిఈను సందర్శించారు.

06/23/2017 - 00:15

హైదరాబాద్, జూన్ 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో దేశ ఐటి ఎగుమతులు 7 నుంచి 8 శాతం పెరిగే అవకాశం ఉందని నాస్కామ్ వెల్లడించింది. అలాగే దేశీయ ఐటి మార్కెట్ 10 నుంచి 11 వృద్ధి చెందుతుందని, ఐటి రంగంలో ఈ ఏడాది కొత్తగా 1.3 లక్షల నుంచి 1.5 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నామని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ గురువారం హైదరాబాద్‌లో విలేఖరులకు తెలిపారు.

06/23/2017 - 00:14

న్యూఢిల్లీ, జూన్ 22: కేబుల్ టీవీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే జిటిపిఎల్ హాత్‌వే పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ)కు గురువారం రెండో రోజు ముగిసే సమయానికి 41 శాతం సబ్‌స్క్రిప్షన్ అందింది. మొత్తం ఇష్యూ సైజు 2,02,15,966 షేర్లు కాగా ఇప్పటివరకు 83,22,072 షేర్లకు బిడ్లు అందాయని ఎన్‌ఎస్‌ఇకి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

06/23/2017 - 00:14

న్యూఢిల్లీ, జూన్ 22: నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన తన ముంద్రా పవర్ ప్రాజెక్టులో 51 శాతం వాటాను దానినుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న గుజరాత్ లాంటి రాష్ట్రాలకు 1 రూపాయికే విక్రయిస్తామని టాటా పవర్ ప్రతిపాదించింది. రుణభారంతో పాటుగా నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం టాటా పవర్ ఈ ప్రతిపాదన చేసింది.

06/23/2017 - 00:13

న్యూఢిల్లీ, జూన్ 22: భద్రతా ఏజన్సీల మధ్య టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం ఏర్పాటయిన నేషనల్ ఇంటెలిజన్స్ గ్రిడ్(నాట్‌గ్రిడ్) నెట్‌వర్క్ ఇకపై ఆదాయం పన్ను శాఖకు చెందిన పాన్ రికార్డులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన వివరాలను కూడా పొందబోతోంది. యుపిఏ-2 పాలనలో అప్పటి హోం మంత్రి పి.చిదంబరం ఆలోచనతో ఈ బృహత్తర ప్రాజెక్టుకు రూపుదిద్దుకొంది.

06/22/2017 - 02:51

న్యూఢిల్లీ, జూన్ 21: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్ వివరాల ప్రకారం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూప్ హస్తగతం చేసుకునే వీలుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఎయిరిండియా.. తిరిగి తన సొంత యజమాని వద్దకే చేరినట్లవుతుంది.

06/22/2017 - 02:50

న్యూఢిల్లీ, జూన్ 21: రద్దయిన పాత పెద్ద నోట్ల డిపాజిట్ కోసం జిల్లా సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే.

06/22/2017 - 02:50

ముంబయి, జూన్ 21: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పి-నోట్ నిబంధనలను కఠినతరం చేసిన సెబీ.. ఎఫ్‌పిఐ రిజిస్ట్రేషన్ నియమాలను సరళతరం చేసింది. అలాగే డిస్‌స్ట్రెస్‌డ్ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి నిబంధనలను సడలించింది. ఇక ఎన్‌ఎస్‌ఇ కో-లొకేషన్ కేసులో ఫొరెన్సిక్ ఆడిటర్‌ను ఏర్పాటు చేస్తోంది.

06/22/2017 - 02:50

న్యూఢిల్లీ, జూన్ 21: ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాల మధ్య భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో 7.6 శాతంగా ఉండొచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్) చెప్పింది. ఇంతకుముందు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో జిడిపి కూడా పెరుగుతుందని ఎన్‌సిఎఇఆర్ అభిప్రాయపడింది.

Pages