-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, జూన్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 80.18 పాయింట్లు దిగజారి 31,075.73 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 40.10 పాయింట్లు పడిపోయి 9,578.05 వద్ద నిలిచింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది.
సిద్దిపేట, జూన్ 15: దేశంలోని పేదరికాన్ని రూపుమాపి, ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ అన్నారు. మోదీ తన మూడేళ్ల పాలనలో ఒక్కరోజు సెలవు తీసుకోకుండా నిర్విరామంగా శ్రమిస్తూ దేశాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారన్నారు.
ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్.. బుధవారం దేశీయ మార్కెట్లోకి నూతన స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. జె7 మ్యాక్స్, ప్రో పేరిట పరిచయమైన వీటి ధరలు చూస్తే..
జె7 మ్యాక్స్ ధర 17,900 రూపాయలుగా, జె7 ప్రో ధర 20,900 రూపాయలుగా ఉంది
ఇటలీకి చెందిన ఆటో రంగ దిగ్గజం పియాజియో.. బుధవారం భారతీయ మార్కెట్కు సరికొత్త చిన్నతరహా వాణిజ్య వాహనాన్ని పరిచయం చేసింది. పోర్టర్ 700 పేరిట వచ్చిన దీని ధర
మహారాష్ట్ర ఎక్స్షోరూం ప్రకారం 3.18 లక్షల రూపాయలుగా ఉంది
హైదరాబాద్, జూన్ 14: అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్ఎఫ్డిఎ).. తెలంగాణలోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియెంట్స్ (ఎపిఐ) యూనిట్కు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు (ఇఐఆర్)ను ఇచ్చింది. మిర్యాలగూడ వద్దనున్న ఈ ప్లాంట్ను ఈ ఏడాది మార్చిలో యుఎస్ఎఫ్డిఎ అధికారులు తనిఖీ చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 14: ఆంధ్రప్రదేశ్లో అజూర్ పవర్ 100 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తయ్యే సౌర విద్యుత్ను 25 ఏళ్లపాటు ప్రభుత్వరంగ సంస్థ ఎన్టిపిసి కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందం జరిగినట్లు అజూర్ పవర్ తెలిపింది. 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్కు వద్ద తమ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్న అజూర్ పవర్..
ముంబయి, జూన్ 14: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాపై బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) తమ తొలి చార్జీషీటును దాఖలు చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ-కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణం కేసులో మనీ లాండరింగ్ విచారణతో సంబంధమున్న మరికొందరిపైనా చార్జిషీటు నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద నిరుడు ఈడి క్రిమినల్ కేసును నమోదు చేసినది తెలిసిందే.
ముంబయి, జూన్ 14: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) చైర్మన్ అనిల్ అంబానీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో వేతనంగానీ కమీషన్గానీ తీసుకోబోనని ప్రకటించారు. సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం, క్రెడిట్ రేటింగ్ దిగజారిన నేపథ్యంలో అనిల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆర్కామ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. సంస్థ టాప్ మేనేజ్మెంట్ సైతం తమ వ్యక్తిగత జీతాన్ని తగ్గించుకుంటామని ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూన్ 14: మోటార్ సైకిళ్ల ధరలను తగ్గించింది దేశీయ ఆటో రంగ సంస్థ బజాజ్ ఆటో. వస్తు, సేవల పన్ను (జిఎస్టి) ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాలనే ఉద్దేశ్యంతో 4,500 రూపాయల వరకు ధరలను తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. జూలై 1 నుంచి జిఎస్టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో మోటార్సైకిళ్లపై పన్నులు దిగిరానున్నాయి. దీంతో ధరలనూ బజాజ్ ఆటో దించేస్తోంది.
తాళ్లపూడి, జూన్ 14: ప్రజల ఆరోగ్య పరిరక్షణతోపాటు ప్రభుత్వ ఆదాయ వనరులు పెరిగేలా కల్లు ఆధారిత పరిశ్రమలకు కొత్త పాలసీ తీసుకురానున్నట్టు ఏపి ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ వెల్లడించారు. కల్తీ కల్లును నిరోధించడానికి కల్లును కూడా మద్యం మాదిరిగానే టెట్రా ప్యాకింగ్ల ద్వారా విక్రయించాలని యోచిస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో బుధవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు.