S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/11/2017 - 00:41

న్యూఢిల్లీ, మే 10: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 717.75 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 833.29 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. దీంతో ఈసారి 13.86 శాతం క్షీణించినట్లైంది.

05/11/2017 - 00:40

న్యూఢిల్లీ, మే 10: దేశీయ ఐటి రంగ సంస్థలు ఉద్యోగుల కోతకు క్యూ కడుతున్నాయి. మొన్న విప్రో, నిన్న ఇన్ఫోసిస్, నేడు టెక్ మహీంద్ర.. వందలాది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో అమెరికా ప్రాజెక్టులకు భారత్ నుంచి ఉద్యోగులను పంపించలేని పరిస్థితిని దేశీయ ఐటి సంస్థలు ఎదుర్కొంటున్నది తెలిసిందే.

05/11/2017 - 00:40

న్యూఢిల్లీ, మే 10: గుజరాత్‌కు చెందిన ఉన్నతి ఇన్‌ఆర్గానిక్స్‌లోని ఓ యూనిట్‌ను టాటా కెమికల్స్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. 34.20 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంటోంది. మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు బధవారం టాటా కెమికల్స్ తెలిపింది. మరోవైపు టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు నిరుడుతో పోల్చితే గత నెల ఏప్రిల్‌లో 9 శాతానికిపైగా దిగజారి 73,691 యూనిట్లకు పరిమితమయ్యాయి.

05/11/2017 - 00:39

న్యూఢిల్లీ, మే 10: స్నాప్‌డీల్, ఓలా సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ 9,000 కోట్ల రూపాయలకుపైగా నష్టాలను చవిచూసింది. స్నాప్‌డీల్‌లో పెట్టుబడులపై 6,500 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు సాఫ్ట్‌బ్యాంక్ తెలిపింది. ఆన్‌లైన్ మార్కెట్‌లో, క్యాబ్ సేవల్లో ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీవల్లే ఈ నష్టాలని పేర్కొంది. ఈ పెట్టుబడులు లాభదాయకంగా లేవంది.

05/11/2017 - 00:39

హైదరాబాద్, మే 10: హైదరాబాద్ శివారులోని ముచ్చెర్ల వద్ద ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం వచ్చే నెలలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయల సంస్థ (టిఎస్‌ఐఐసి) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఆ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతి పొందేందుకు ప్రయత్నించనుంది.

05/11/2017 - 00:38

అనకాపల్లి, మే 10: వరుస విపత్తులతో, నిరాశాజనక ధరలతో విలవిల్లాడిపోతున్న చెరకు రైతుకు ఈ ఏడాది బాగా ఊరట కలిగించింది. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పది కిలోల మంచి రంగు కలిగిన బెల్లానికి 480 రూపాయల వరకు ధర పలికింది. నాసిరకం నలుపు రంగు బెల్లానికి సైతం 350 రూపాయలు పైబడే ధర లభిస్తోంది. నిరుడుతో పోల్చితే ఈ ఏడాది బెల్లానికి రెట్టింపు ధరలు పలుకుతున్నాయ.

05/11/2017 - 00:36

భీమవరం, మే 10: దేశీయ ఆక్వా రంగంలో అత్యధిక మోతాదులో యాంటీ బయోటిక్స్ వినియోగం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని జర్మనీ దేశానికి చెందిన ఫుడ్ సేఫ్టీ, టెస్టింగ్ సర్ట్ఫికేషన్ సంస్థ టువ్ సుడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాన్ వాకర్ అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్పత్తులకు బ్యాక్టీరియల్ వ్యాధులు సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

05/11/2017 - 00:34

హైదరాబాద్, మే 10: హైదరాబాద్ నగర కేంద్రంగా పని చేస్తున్న బిజినెస్ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ ‘జిజికె టెక్’ వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరించే దిశగా వెళ్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ఆధునిక సౌకర్యాలతో కూడిన కార్యాలయాన్ని ఉప్పల్ సెజ్‌లో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సిటిఒ శ్యామ్ పాల్‌రెడ్డి తెలిపారు. విస్తరణను వేగవంతం చేస్తూ వెయ్యిమందిని నియమించుకోనున్నట్లు తెలిపారు.

05/11/2017 - 00:31

హైదరాబాద్, మే 10: భారతదేశపు అతిపెద్ద ఆతిథ్య కంపెనీ ఒయో.. హైదరాబాద్‌లో తమ తొలి టౌన్‌హౌస్‌ను ప్రారంభించింది. బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ఒయో వ్యవస్థాపకుడు, సిఇఒ రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి ప్రధాన ద్వారం వెనుక.. రోడ్ నెం. 55లో ఈ టౌన్‌హౌస్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పంజాగుట్ట వద్ద కూడా ప్రారంభిస్తామన్నారు.

05/11/2017 - 00:31

కొల్లాపూర్, మే 10: నోరూరించే మామిడి పండ్లకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ఎంతో ప్రసిద్ధి. బంగినపల్లి మామిడి పండ్లకు ఎంత పేరుందో కొల్లాపూర్ మామిడి పండ్లకు కూడా అంతే పేరుంది. తెలంగాణ వ్యాప్తంగా రెండు లక్షల హెక్టార్లలో పండ్ల సాగు జరుగుతుం డగా, యేటా 2.2 లక్షల టన్నుల మామిడి ఫలాలు ఉత్పత్తి అవుతున్నాయి.

Pages