-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్ఓ) చందాదారులు తమ డిపాజిట్లపై 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం వడ్డీని పొందనున్నారు. ఇపిఎఫ్ ట్రస్టు బోర్డు సభ్యులు డిసెంబర్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం వెల్లడించారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 13: ప్రయాణికులు ఇక నుంచి పసందైన వంటకాలు రుచిచూడనున్నారు. ఇందుకు రైల్వే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఇప్పటికే 50 ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, భారతీయరైల్వేకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈస్ట్కోస్ట్రైల్వే వాల్తేరుడివిజన్ పరిధిలో త్వరలో ఇది అమలు కానుంది. ఇందుకోసం రైల్వే కసరత్తు ప్రారంభించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: భారత్లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు స్నాప్డీల్, పేటియమ్ లాంటి ప్రత్యర్థులతో విస్తృత స్థాయిలో పోటీపడుతున్న అంతర్జాతీయ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. దేశంలో ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పిపిఐ) లేదా మొబైల్ వ్యాలెట్ సేవలను ప్రారంభించేందుకు అమెజాన్ ఇండియా భారత రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) నుంచి లైసెన్సును పొందింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నాలుగు నెలల కనిష్టానికి పతనమైంది. 1.2 శాతానికే పరిమితమైంది. నిరుడు అక్టోబర్లో 1.87 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లో గణాంకాలున్నాయి. నవంబర్లో ఇది 5.59 శాతానికి పెరగడం విశేషం. అయితే కీలకమైన ఉత్పాదక రంగం పనితీరు పడిపోవడమే ఫిబ్రవరి ఐఐపి పతనానికి ప్రధాన కారణం.
ముంబయి, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 144.87 పాయింట్లు క్షీణించి 29,643.48 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 33.55 పాయింట్లు కోల్పోయి 9,203.45 వద్ద నిలిచింది. సిరియాపై అమెరికా క్షిపణి దాడుల మధ్య మధ్య ప్రాచ్య తదితర దేశాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు మదుపరులను అమ్మకాల ఒత్తిడికి లోనుచేశాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 12: భారతీయ ఔషధరంగ ఎగుమతుల ప్రోత్సాహక మండలి నిర్వహిస్తున్న మెగా ఫార్మా షో.. ఐఫెక్స్ ఐదో ఎడిషన్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ ఐఫెక్స్ 2017 ఫార్మా షో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. ‘ఐఫెక్స్ను హైదరాబాద్కు తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం.’ అని ఫార్మెక్సిల్ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి అన్నారు.
పినపాక, ఏప్రిల్ 12: ముందుగా అనుకున్న గడువు ప్రకారమే వచ్చే ఏడాది మార్చి నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, మణుగూరు మండలాల సరిహద్దులో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి తీరుతామని టిఎస్ జెన్కో సిఎండి ప్రభాకర్ వెల్లడించారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 12: సిమెంట్ ధరల పెరుగుదల నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత రెండు నెలల కాల వ్యవధిలో 50 శాతం మేర సిమెంట్ ధరలను పెంచుతూ ప్రధాన సిమెంట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోంది. దీంతో క్రెడాయ్ సహా పలు నిర్మాణ రంగ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారతీ ఎయిర్టెల్ డిటిహెచ్ విభాగమైన ఎయిర్టెల్ డిజిటల్ టివి.. బుధవారం ఓ ఆండ్రాయిడ్ ఆధారిత సెట్ టాప్ బాక్స్ (ఎస్టిబి)ను మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణంగా వచ్చే శాటిలైట్ చానళ్లతోపాటు ఈ ఎస్టిబి ద్వారా టెలివిజన్లో ఆన్లైన్ (ఇంటర్నెట్లోని) కార్యక్రమాలనూ చూడవచ్చు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: హైదరాబాద్లో ఉన్న జాతీయ చేపల పెంపకం బోర్డును ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు మార్చే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ మంగళవారం లోక్సభలో స్పష్టం చేశారు. టిఆర్ఎస్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన మూల ప్రశ్నపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ రాధామోహన్ సింగ్ ఈ ప్రకటన చేశారు.