S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/19/2017 - 00:38

న్యూఢిల్లీ, మార్చి 18: పన్ను ఎగవేతదారుల పేర్లను వెల్లడించి, తద్వారా వారి పరువు పోగొట్టి బుద్ధి చెప్పాలనే లక్ష్యంలో భాగంగా ఆదాయ పన్ను శాఖ శనివారం 29 సంస్థల వివరాలను బహీర్గతం చేసింది. వీటి పన్ను బకాయిలు 448.02 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ప్రముఖ జాతీయ దినపత్రికల్లో ఈ వివరాలకు సంబంధించిన ప్రకటనలను ఐటి శాఖ వేస్తోంది.

03/19/2017 - 00:37

ముంబయి, మార్చి 18: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించేది లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయానికి కేంద్రం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందన్న ఆయన ఎయిరిండియా ప్రైవేటీకరణను మాత్రం తోసిపుచ్చారు. ప్రతీ దేశానికి ఓ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అవసరమన్నారు.

03/19/2017 - 00:37

జర్మనీలోని బడెన్-బాడెన్ పట్టణంలో జరిగిన జి20 ఆర్థిక సదస్సుకు హాజరైనవారు కలిసి దిగిన బృంద చిత్రమిది. శనివారం ముగిసిన ఈ సదస్సులో స్వేచ్ఛా వాణిజ్యం, పన్నుల ఎగవేత, ఆర్థిక మార్కెట్ల నియంత్రణ వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉన్నాయ.

03/18/2017 - 00:45

భీమవరం, మార్చి 17: గత కొంతకాలంగా తెరమరుగైన స్కాంపీ రకం రొయ్యల సాగుకు మళ్లీ తెరలేస్తోంది. స్కాంపీనే ‘జెయింట్ ప్రాన్’ అంటారు. వైరస్ భయంతో స్కాంపీని పక్కనపెట్టిన రైతులు.. వనామీ రకం సాగుకు మొగ్గుచూపారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా వనామీదే పైచేయి అయ్యింది. తాజాగా వనామీకి వైరస్ ఎక్కువగా సోకుతుండటంతో మళ్లీ స్కాంపీ వైపు రైతుల దృష్టి మళ్లుతోంది.

03/18/2017 - 00:43

న్యూఢిల్లీ, మార్చి 17: గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 11 శాతం వృద్ధితో దాదాపు 12,940 కోట్ల రూపాయల ఆదాయాన్ని తపాలా శాఖ అందుకున్నట్లు శుక్రవారం పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల విషయానికొస్తే 2014-15లో 11,635.98 కోట్ల రూపాయలుగా, 2013-14లో 10,730.42 కోట్ల రూపాయలుగా ఉందని రాజ్యసభకు కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.

03/18/2017 - 00:42

హైదరాబాద్, మార్చి 17: ఎస్‌బిఐలో దాని అనుబంధ బ్యాంకులు విలీనం అవుతున్న క్రమంలో ఉద్యోగ సంఘాలు శుక్రవారం స్వచ్చంధ పదవీ విరమణ (విఆర్‌ఎస్) పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎస్‌బిఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏప్రిల్ 1న విలీనం అవుతున్నది తెలిసిందే.

03/18/2017 - 00:42

న్యూఢిల్లీ, మార్చి 17: దేశీయ టెలికామ్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రాక ఈ మార్పులకు నాంది పలకగా, మిగతా సంస్థలు వాటిని కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఇన్‌కమింగ్ కాల్స్‌పై నేషనల్ రోమింగ్‌ను ఎత్తివేసిన ప్రముఖ టెలికామ్ సంస్థలు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాల్స్, డేటా చార్జీలనూ గణనీయంగా తగ్గించినది తెలిసిందే.

03/18/2017 - 00:47

కాకినాడ, మార్చి 17: ఎరువుల ఉత్పత్తిలో పేరొందిన నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫిసిఎల్) కాకినాడ కర్మాగారాన్ని విక్రయించే ఉద్దేశం ఎంతమాత్రం లేదని, దీనిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఆ సంస్థ యాజమాన్యం శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. కంపెనీకిగాని, మెజారిటీ వాటాదారులకు (ప్రమోటర్స్)గాని సంస్థను అమ్మే ఉద్దేశం లేదని యాజమాన్యం పేర్కొంది.

03/18/2017 - 00:39

ముంబయి, మార్చి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.35 పాయింట్లే పెరిగినా.. మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త స్థాయిలో 9,160.05 వద్ద నిలిచింది. ఒక దశలో ఇంట్రా-డే ట్రేడింగ్‌లో 9,200 మార్కును దాటిన నిఫ్టీ.. గరిష్ఠంగా 9,218.40 స్థాయిని చేరింది.

03/18/2017 - 00:38

విశాఖపట్నం, మార్చి 17: ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం పెరుగుతోందని అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ అన్నారు. సిఐఐ వార్షిక సమావేశంలో భాగంగా రియలైజింగ్ విజన్ ఆఫ్ సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్న అంశంపై శుక్రవారం విశాఖలో సదస్సు జరిగింది.

Pages