-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, ఫిబ్రవరి 21: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ జియో ప్రకటనతో టెలికామ్ షేర్లు నష్టపోయినప్పటికీ గత మూడు రోజుల లాభాలను కొనసాగిస్తూ నాలుగో రోజైన మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ లాభపడ్డాయి. సెనె్సక్స్ 100.01 పాయింట్లు పెరిగి 28,761.59 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 28.65 పాయింట్లు అందుకుని 8,907.85 వద్ద నిలిచింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: రక్షిత అటవీ భూముల్లో ప్రత్యక్షంగా పనిచేస్తున్న అటవీ శాఖ సిబ్బందికి, స్థానికులకు వైద్య సహాయం అందించేందుకు డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన ఎంఒయు కాలపరిమితిని పొడిగించినట్లు హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి) మంగళవారం 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, డాక్టర్ రెడ్డీస్, వొడాఫోన్ తదితర సంస్థల ఎఫ్డిఐ ప్రతిపాదనలున్నాయి. కాగా, ఈ మొత్తం 15 ఎఫ్డిఐ ప్రతిపాదనల విలువ 12,200 కోట్ల రూపాయలు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికిగాను ప్రకటించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజి-్ధన్ వ్యాపార్ యోజనలో భాగంగా గడచిన 58 రోజుల్లో దాదాపు 10 లక్షల మందికి 153.5 కోట్ల రూపాయలను బహుమతులుగా ఇచ్చినట్లు నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ మంగళవారం ఇక్కడ తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: నిరుడు దాదాపు 82 వేల మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లిపోయారని ఓ నివేదిక చెబుతోంది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 64 వేలుగా ఉందని ఆ నివేదిక అంటోంది. గ్లోబల్ వెల్త్ అండ్ వెల్త్ ఇమ్మిగ్రేషన్పై న్యూ వరల్డ్ వెల్త్ తాజా నివేదిక ప్రకారం 2016లో ఆస్ట్రేలియాకు 11 వేల మిలియనీర్లు వలస వెళ్లారని అంచనా. అమెరికాకు 10 వేల మంది, బ్రిటన్కు 3 వేల మంది వలస వెళ్లారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: శానిటరీవేర్ సంస్థ హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్.. ప్లాస్టిక్ పైపులు, సెక్యురిటీ క్యాప్లు, క్లోజర్లను తయారు చేయడానికి తెలంగాణలో రెండు ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఈ ప్లాంట్లలో వాటర్ హీటర్లను ఉత్పత్తి చేసే యూనిట్ కూడా ఉండొచ్చని సంస్థ కన్జ్యూమర్ బిజినెస్ విభాగం అధ్యక్షుడు రాకేశ్ కౌల్ మంగళవారం ఇక్కడ పిటిఐకి తెలిపారు.
ముంబయి, ఫిబ్రవరి 21: టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్నకు సారథ్యం వహిస్తున్న టాటా సన్స్కు చైర్మన్గా అన్ని సంస్థలకు సమాన ప్రాధాన్యం ఇస్తానని, నిధుల కేటాయింపులు పద్ధతిగా జరుపుతామని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.
సోమవారం బెంగళూరులో డిజిటల్ ఇన్ఫర్మేషన్, ఇంటిలిజెంట్ క్లౌడ్-ఎఐ గురించి స్టార్టప్ స్టాల్వర్ట్స్ ఆఫ్ ఇండియాపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నందన్ నిలేఖని, సత్య నాదెళ్ల,
బిన్ని బన్సల్ (ఎడమ నుంచి కుడి)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 100 కోట్ల రూపాయల మార్కెట్ దెబ్బతిన్నదని ఎఫ్ఎమ్సిజి దిగ్గజం నెస్లే సోమవారం తెలిపింది. నోట్ల రద్దు ప్రభావం మరో ఆరు నెలలు ఉండవచ్చని అంచనా వేసింది. నవంబర్లో అధికంగా ప్రభావితమయ్యామని, ఇప్పటిదాకా చూసుకుంటే 100 కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గిపోవచ్చని నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ నారాయణన్ అన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: తన ప్రత్యర్థులు ఇన్ఫోసిస్ గురించి తప్పుడు వార్తలు, కల్పిత కథనాలు ప్రచారం చేసి తనను వేధిస్తున్నారని విశాల్ సిక్కా ఆవేదన వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకునే ఇదంతా చేస్తున్నారని సంస్థ ఉద్యోగులకు ఈ-మెయిల్ చేశారు సిక్కా. అమెరికా ఆధారిత సంస్థ పనయ కొనుగోలు విషయంలో వక్రీకరణలపట్ల సిక్కా పైవిధంగా స్పందించారు.