S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/09/2017 - 00:44

హైదరాబాద్, ఫిబ్రవరి 8: దేశంలోనే తెలంగాణ విజయ డెయిరీ పాలు, పాలపదార్థాలను ప్రైవేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పశుగణాభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. తెలంగాణ విజయ డెయిరీ క్యాలెండర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ డెయిరీలను విజయ డెయిరీ మించి పోయిందని, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కువగా వాడుకుంటున్నామన్నారు.

02/09/2017 - 00:43

తడ/సత్యవేడు, ఫిబ్రవరి 8: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటి పారిశ్రామిక వాడను బుధవారం ఇఎస్‌ఐ కార్పొరేషన్ స్టేట్ మెడికల్ కమిషనర్ డాక్టర్ ఇమ్మానియల్ సందర్శించారు. శ్రీసిటి పరిసరాల్లో ఇఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాన్ని చూసేందుకు ఇక్కడకు వచ్చారు. శ్రీసిటి వైస్‌ప్రెసిడెంట్ పి రమేష్‌కుమార్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.

02/09/2017 - 00:43

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 8: తూర్పు గోదావరి జిల్లాలో మరో రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఒకటి కొబ్బరి పార్కు, మరొకటి కొబ్బరి పరిశోధనా కేంద్రం. వీటి ఏర్పాటుకు అనువైన స్థలాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఐపిసిఆర్‌ఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రిసెర్చి) డైరెక్టర్ చౌడప్ప ఈ స్థలాలను పరిశీలించి కూడా వెళ్లారు.

02/08/2017 - 00:38

ముంబయి, ఫిబ్రవరి 7: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మందగించిన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీలతోపాటు నీరసించిన బ్యాంకింగ్ కార్యకలాపాలను తిరిగి ఉత్తేజపరిచేందుకు బుధవారం నిర్వహించే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి.

02/08/2017 - 00:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసిలో 2 శాతం వాటా విక్రయం ద్వారా 6,700 కోట్ల రూపాయల నిధులను మంగళవారం అందుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వరంగ సంస్థ స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యుయుటిఐ) ద్వారా ఈ వాటాను ప్రభుత్వం అమ్మేయగా, ఒక్కో షేర్‌ను 275.85 రూపాయల చొప్పున మొత్తం వాటాను ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి కొనుగోలు చేసింది.

02/08/2017 - 00:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్.. జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెల జనవరిలో 4 శాతం పెరిగాయి. ఈ జనవరిలో 47,693 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. జాగ్వార్ ఎఫ్-పేస్, ఎక్స్‌ఎఫ్, లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్లకు మార్కెట్‌లో విశేష ఆదరణ లభించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో జెఎల్‌ఆర్ వివరించింది.

02/08/2017 - 00:36

ముంబయి, ఫిబ్రవరి 7: వరుస నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 104.12 పాయింట్లు పడిపోయి 28,335.16 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 32.75 పాయింట్లు దిగజారి 8,768.30 వద్ద నిలిచింది.

02/08/2017 - 00:35

అమరావతి, ఫిబ్రవరి 7: దేశంలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రెండవ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంతం ఖజానాకు కాసుల వర్షం కురిపించనుంది. ఇక్కడి కోస్టల్ కారిడార్ అభివృద్ధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తును మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. దానికి తగ్గట్టుగానే తాజా సిఐఐ సమ్మిట్‌లో 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.

02/08/2017 - 00:33

హైదరాబాద్, ఫిబ్రవరి 7: పౌర సరఫరాల శాఖ గోదాముల్లో వృథాగా పడిఉన్న కోట్లాది రూపాయల నిల్వలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవసరం లేకుండా గోదాముల్లో ఉన్న ఆహార ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. వృథా నిల్వలతో గోదాముల్లో స్థలం సమస్యగా మారడంతోపాటు నిత్యావసరాల నాణ్యత దెబ్బతింటోంది. దీంతో వృథాగా ఉన్న నిల్వలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు.

02/08/2017 - 00:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,254.96 కోట్ల రూపాయల నికర నష్టాలను చవిచూసింది. పెరిగిన మొండి బకాయిలు (నికర నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ), తగ్గిన ఆదాయం దీనికి కారణమని మంగళవారం బ్యాంక్ తెలిపింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో బ్యాంక్ నష్టం 2,183.68 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages