-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్సిఎల్ఎటి)లో ఉద్వాసనకు గురైన టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్ర్తికి చుక్కెదురైంది. డైరెక్టర్గా తన తొలగింపునకు టాటా సన్స్ సోమవారం భాగస్వామ్య సమావేశానికి పిలుపునివ్వగా, దీన్ని వ్యతిరేకిస్తూ మిస్ర్తి ఎన్సిఎల్ఎటిని ఆశ్రయించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గింది. 2015లో 857.2 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండగా, 2016లో 675.5 టన్నులకు తగ్గింది. ఈ వివరాలను ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) శుక్రవారం ప్రకటించింది. బంగారు ఆభరణాల డిమాండ్ కూడా 2015తో పోల్చితే 2016లో 22.4 శాతానికి తగ్గింది. 662.3 టన్నుల నుంచి 514 టన్నులకు ఆభరణాల డిమాండ్ తగ్గిందని మండలి పేర్కొంది.
ముంబయి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఇ).. ఈక్విటీ మార్కెట్ ప్రవేశం అదిరింది. ఆసియా ఖండంలోనే ప్రాచీనమైన, 140 ఏళ్ల చరిత్ర కలిగిన బిఎస్ఇని.. శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఇ)లో లిస్టింగ్ చేశారు. దీంతో ఈ ఒక్కరోజే సంస్థ షేర్ విలువ 33 శాతం మేర పెరిగింది.
శుక్రవారం న్యూఢిల్లీలో జెడ్టిఇ బ్లేడ్ ఎ2 ప్లస్ స్మార్ట్ఫోన్ను ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి దేశీయ మార్కెట్కు పరిచయం చేస్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. 11,999 రూపాయల ధర కలిగిన ఈ మొబైల్.. సోమవారం నుంచి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉండనుంది.
భీమవరం, ఫిబ్రవరి 3: ఆక్వా ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాతో ఆంధ్రప్రదేశ్ మత్య్స శాఖ ఒప్పందాలు చేసుకోనుంది. ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీలో ‘ఫ్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్’ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సు ఒప్పందాలకు వేదిక కానుంది.
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2: భారత చమురు, సహజవాయు సంస్థ (ఒఎన్జిసి) రాతి పొరల నుంచి లభించే షేల్ గ్యాస్ను వెలికితీసే సాంకేతికతను అనుసంధానం చేసుకుంది. ఇప్పటివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఒఎన్జిసి సొంతం చేసుకుంది.
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఆదాయ పన్ను శాఖ.. ఆపరేషన్ క్లీన్మనీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జరిగిన నగదు డిపాజిట్లలో సుమారు 4.17 లక్షల కోట్ల రూపాయల విలువైన అనుమానిత లావాదేవీలను ఆదాయ పన్ను శాఖ గుర్తించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్తో ఇంతకాలం పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపనివారిపై కొరఢా ఝుళిపించినట్లుగా ప్రతిపాదనలు ఉన్నాయని, నల్లధనం నిర్మూలన దిశగా బడ్జెట్ ఉందని పెగా సిస్టమ్స్ ఎండి సుమన్ రెడ్డి అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన స్వాగతించారు.
ముంబయి, ఫిబ్రవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బుధవారం నాటి బడ్జెట్ ర్యాలీని కొనసాగిస్తూ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 84.97 పాయింట్లు పెరిగి 28,226.61 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 17.85 పాయింట్లు అందుకుని 8,734.25 వద్ద నిలిచింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, ఐటి, టెక్నాలజీ షేర్లు లాభాలను అందుకున్నాయ.
హైదరాబాద్, ఫిబ్రవరి 2: గ్రీన్ ఎనర్జీని పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు ష్నీడర్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇంధన పొదుపు పరికరాలను ఆవిష్కరించింది. స్విచ్, కంట్రోల్ అప్లికేషన్స్, లో-వోల్టేజిని నిరోధించే పరికరాలను రూపొందించామని ష్నీడర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెబ్బి తెలిపారు.