-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అన్ని రంగాలకు నిధులను సమకూర్చాలన్నదే ముందుగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలన్న ఆలోచనకు మూలమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము సక్రమంగా వినయోగమైతే సరైన రీతిలో పన్నులు చెల్లించేందుకు వారు వెనుకాడరని మంగళవారం ఇక్కడ జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పన్నులు చెల్లించేవారు తక్కువే అయినా.. కార్లు కొనేవారి సంఖ్య మాత్రం దేశంలో ఎక్కువే. 125 కోట్లకుపైగా జనాభా ఉంటే అందులో 10 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు కేవలం 24.4 లక్షల మంది. కానీ యేటా 25 లక్షల కొత్త కార్ల విక్రయాలు జరుగుతున్నాయని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. ఇందులో 35 వేలు లగ్జరీ కార్లే కావడం గమనార్హం.
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: టాటా సన్స్.. తమ మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తికి లీగల్ నోటీసును ఇచ్చింది. సంస్థకు సంబంధించిన రహస్య, విశ్వసనీయ సమాచారాన్ని బహీర్గతం చేస్తూ సంస్థను నిర్వీర్యపరుస్తున్నారంటూ ఈ లీగల్ నోటీసును మంగళవారం ఇచ్చింది. జరిగిన బోర్డు సమావేశాలు, ఆర్థికపరమైన సమాచారాన్ని, ఇతరత్రా కీలకమైన డేటాను, విలువైన డాక్యుమెంట్లను మిస్ర్తి బయటకు తెలియపరుస్తున్నారంటూ ఆక్షేపించింది.
కొత్తగూడెం, డిసెంబర్ 27: కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సీటీ ఏర్పాటు చేయడానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా పాలకమండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అన్నారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో మైనింగ్ పరిశ్రమ భవిష్యత్ అవసరాలపై హైదరాబాద్లోని విశే్వశ్వరయ్య భవన్లో సోమవారం రాత్రి సదస్సు నిర్వహించారు.
హైదరాబాద్, డిసెంబర్ 27: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీల విలువ మున్ముందు మరింత పెరుగుతుందని, ముఖ్యంగా 2022 నాటికి మొబైల్ ద్వారా చెల్లింపులు 57 శాతం పుంజు కుంటాయని అసోచామ్, ఆర్ఎ న్సిఒఎస్ సంయుక్తంగా ఎం-వాలెట్ కార్యకలాపాలపై నిర్వహించిన సర్వే చెబుతోంది.
ముంబయి, డిసెంబర్ 27: దేశీయ ప్రైవేట్రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ.. వ్యాపారుల కోసం మంగళవారం ‘ఈజీపే’ అనే ఓ యాప్ను పరిచయం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చేలా ఈ యాప్ను ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకొచ్చింది. దీని సాయంతో వివిధ డిజిటల్ వేదికల నుంచి మొబైల్స్పై చెల్లింపులను వ్యాపారులు, రిటైలర్లు, ప్రొఫెషనల్స్ తీసుకొచ్చని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.
కర్నూలు, డిసెంబర్ 27: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లపై ప్రస్తుతం విధిస్తున్న పన్నును తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాప్టాప్, డెస్క్టాప్, స్మార్ట్ఫోన్లపై ప్రస్తుతం విధిస్తున్న పన్నుల్లో 9 నుంచి 10 శాతం తగ్గించాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
ముంబయి, డిసెంబర్ 26: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. షేర్లలో పెట్టిన పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలపై ధీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్న అంచనాలు మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీశాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కోకాకోలా ఇండియా.. తమ థమ్సప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ను నియమించింది. ఇప్పటిదాకా థమ్సప్ ప్రచారాన్ని బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేస్తుండగా, ఆయనతో ఒప్పందం ముగియడంతో ఖాన్ స్థానంలో రణ్వీర్ను ఎంపిక చేసుకుంది కోకాకోలా. ఈ మేరకు సోమవారం సంస్థ తెలిపింది. కాగా, నాలుగు నెలల క్రితమే సల్మాన్ ఖాన్తో కోకాకోలా ఒప్పందం ముగిసింది.
ఫరీదాబాద్, డిసెంబర్ 26: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే పన్నుల విధానం భారత్కు అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఇది తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) అధికారుల ప్రొఫెషనల్ ట్రైనింగ్ను జైట్లీ ప్రారంభించారు.