S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/24/2016 - 01:32

హైదరరాబాద్, డిసెంబర్ 23: పేద దేశాలకు తక్కువ ధరతో అందించడానికి తయారు చేసిన వాక్సిన్లు తెలంగాణ నుంచి ఎగుమతి కావడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. శాంతా బయోటెక్నిక్స్ తయారు చేసిన శాంతా ఫైన్ వాక్సిన్ మొదటి ఎగుమతి ప్యాక్‌ను ప్రగతి భవన్ నుంచి శుక్రవారం ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా ఆఫ్రికా దేశాలకు పంపించారు.

12/24/2016 - 01:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లపై దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఇన్ఫోకామ్.. తమ కస్టమర్లకు ఉచిత కాల్స్, డేటా ఆఫర్‌ను ఇచ్చినది తెలిసిందే. అయితే తొలుత ఈ నెల 31 వరకే ఈ ఆఫర్‌ను ప్రకటించిన జియో.. ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి 31దాకా ఈ ఆఫర్‌ను పొడిగించింది.

12/24/2016 - 01:23

శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో పర్యావరణ పరిరక్షణకు దోహదపడే సోలార్, ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శన జరిగింది.
ఈ సందర్భంగా సోలార్ ఆధారిత ఈ-రిక్షాతో లోహియా ఆటో ఇండస్ట్రీస్ సిఇఒ ఆయుష్ లోహియా

12/24/2016 - 01:19

ముంబయి, డిసెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను అందుకున్నాయి. వరుసగా ఏడు రోజులు నష్టాలను చవిచూసిన సూచీలు.. శుక్రవారం కోలుకున్నాయి. ఔషధ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.

12/24/2016 - 01:17

విశాఖపట్నం, డిసెంబర్ 23: విశాఖ కేంద్రంగా గీతం విశ్వవిద్యాలయంలో బయెటెక్ సెంటర్ ఏర్పాటు కానుంది. సుమారు 2.5 మిలియన్ డాలర్ల ఖర్చుతో బయోటెక్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ సహకారంతో గీతం యూనివర్శిటీ ఏర్పాటు చేయనుంది.

12/24/2016 - 01:15

కొత్తగూడెం, డిసెంబర్ 23: తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందించాల్సిన బాధ్యత సింగరేణి సంస్థపై ఉందని సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్ అన్నారు. శుక్రవారం ‘సింగరేణి డే’ సందర్భంగా ఇక్కడి ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

12/23/2016 - 01:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నల్లధనం వెలుగుచూస్తున్నది తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత నిత్యం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తునే ఉండగా, ఆ దాడుల్లో రద్దయిన పాత నోట్లతోపాటు కొత్త నోట్లూ బయటపడుతున్నాయి. అయితే ఈ దాడుల్లో ఇప్పటిదాకా పట్టుబడిన నల్లధనం విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 3,300 కోట్ల రూపాయలు. అవును.. నిజం.

12/23/2016 - 00:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఎస్సార్ ఆయిల్.. వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాబోయే 18 నెలల్లో పెట్రోల్ బంకుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. ఇప్పుడున్న 2,800 పెట్రోల్ పంపులకు మరో 2,800 పెట్రోల్ పంపులను తీసుకురావాలని చూస్తోంది. ఈ మేరకు సంస్థ చైర్మన్ ప్రశాంత్ రుయా తెలిపారు. చమురు ధరలపై నియంత్రణాధికారాన్ని కేంద్రం..

12/23/2016 - 00:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్.. ఆర్డర్‌పై క్యాష్‌ను అందజేస్తోంది. ‘క్యాష్ బ హోమ్’ సేవలను గురువారం ప్రకటించిన స్నాప్‌డీల్.. కస్టమర్లకు 2,000 రూపాయలను ఇంటికి తెచ్చిస్తోంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల కేంద్రం పాత పెద్ద నోట్ల చలామణిని రద్దు చేసినది తెలిసిందే.

12/23/2016 - 00:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: టెలికామ్ రంగంలో సంచలనాలకు మారు పేరైన రిలయన్స్ జియో.. ఇక 3జి స్మార్ట్ఫోన్ల వినియోగదారులకూ తమ సేవలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4జి స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు ఉచిత కాల్స్, డేటా సౌకర్యాన్ని కల్పించిన ఈ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఇన్ఫోకామ్.. ప్రత్యర్థి సంస్థలకు గుబులు పుట్టిస్తున్నది తెలిసిందే. 5 కోట్లకుపైగా వినియోగదారులతో దూసుకెళ్తున్న జియో..

Pages