S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/17/2016 - 02:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పెద్ద నోట్ల రద్దు కారణంగా కొనుగోళ్లు తగ్గిపోవడంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. శుక్రవారం బంగారం ధర పదిగ్రాములకు ఏకంగా 500 రూపాయలు తగ్గిపోయి రూ. 28 వేల దిగువకు పడిపోవడమే కాక పది నెలల కనిష్టస్థాయి అయిన రూ. 27,750స్థాయికి చేరుకుంది.

12/17/2016 - 02:51

ముంబయి, డిసెంబర్ 16: దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా మరోసారి తగ్గాయి. ఈ నెల 9వ తేదీతో ముగిసిన వారంలో ఈ నిల్వలు 887.2 మిలియన్ డాలర్లు తగ్గి 362.987 బిలియన్ డాలర్లకు పతనమయ్యాయని, విదేశ కరెన్సీ ఆస్తులు తగ్గడమే ఇందుకు కారణమని రిజర్వు బ్యాంకు శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 1.431 బిలియన్ డాలర్లు తగ్గి 363.874 బిలియన్ డాలర్లకు క్షీణించాయి.

12/17/2016 - 02:50

అమరావతి, డిసెంబర్ 16: పారిశ్రామికీకరణకు రాష్ట్రంలో వున్న అనుకూల పరిస్థితుల నేపథ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటిలో అతి భారీ, భారీ నుంచి మధ్యతరహా, చిన్న సూక్ష్మ పరిశ్రమల వరకు వున్నాయి.

12/17/2016 - 02:49

మచిలీపట్నం, డిసెంబర్ 16: కాసులు కురిపించాల్సిన ‘అపరాలు’ రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా పతనమైన మినుముల ధరలకు రైతులు కుదేలయ్యారు. దీంతో పెద్ద ఎత్తున నిల్వలు ఉంచిన రైతులకు పతనమైన ధరలు దిగాలుపడేలా చేశాయి. గత యేడాదితో పోలిస్తే మినుము ధర ఈ యేడాది పాతాళానికి పడిపోయింది. 50 శాతం పైబడి పడిపోయిన ధరలు రైతుల నడ్డి విరిచాయనే చెప్పవచ్చు.

12/16/2016 - 00:37

ముంబయి, డిసెంబర్ 15: అమెరికా ఫెడ్ రిజర్వ వడ్డీ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించిన అమెరికా ఫెడ్ రిజర్వ్ వచ్చే ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశముందన్న సంకేతాలను సైతం ఇవ్వడం తెలిసిందే.

12/16/2016 - 00:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న కొత్త 2000, 500 రూపాయల నోట్లను సరికొత్త భద్రతా ఫీచర్లతో దేశీయంగానే డిజైన్ చేయడం జరిగిందని, కనుక వీటికి నకిలీలను ముద్రించే అవశాకాలు చాలా తక్కువని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది.

12/16/2016 - 00:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు ఉపసంహరణల (విత్‌డ్రాయల్స్)పై విధించిన ఆంక్షలను సడలించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త కరెన్సీని 80 శాతం మేరకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత సహకార బ్యాంకులతో మొదలు పెట్టి ఈ ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు.

12/16/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆటుపోట్లకు గురయ్యే అవకాశం లేకపోలేదని, అయితే భారత్ మాత్రం ఈ ప్రభావాన్ని తట్టుకోగల స్థితిలో ఉందని కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ గురువారం ఇక్కడ అన్నారు.

12/16/2016 - 00:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ)లోని నాలుగు కోట్ల మందికిపైగా చందాదారుల ఇపిఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుతం చెల్లిస్తున్న 8.8 శాతం వడ్డీని ప్రస్తుత (2016-17) ఆర్థిక సంవత్సరంలో కూడా అలాగే కొనసాగించాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఈ విషయమై ఆర్థిక శాఖను ఒప్పించేందుకు కార్మిక శాఖ ప్రయత్నిస్తోంది.

12/16/2016 - 00:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా వసూలయ్యే పన్నులు, ఇతర ప్రభుత్వ రాబడులపై బ్యాంకులకు ఎండిఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను తిరిగి చెల్లించేందుకు (రీయింబర్స్‌మెంట్‌కు) బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Pages