-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కొన్ని టాటా గ్రూపు కంపెనీలకు స్వతంత్య్ర డైరెక్టర్గా ఉన్న పారిశ్రామిక వేత్త నస్లి వాడియా రతన్ టాటా, టాటాసన్స్ వాటి డైరెక్టర్లపై 3వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ముంబయి హైకోర్టులో గురువారం ఈ దావా పిటిషన్ దాఖలైనట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్ తదితర టాటా కంపెనీల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా వాడియా కొనసాగుతున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 15: స్టార్టప్ వాణిజ్యానికి ఊతం ఇచ్చే విధంగా నాస్కాం, ఐబిఎం సంస్ధలు గురువారం ఇక్కడ టెక్స్టార్టప్.ఇన్ అనే స్టార్టప్ను ప్రారంభించాయ. ఈ సందర్భంగా నాస్కాం ఉపాధ్యక్షుడు కెఎస్ విశ్వనాథం మాట్లాడుతూ, నగరంలోని అన్ని స్టార్టప్లతో అనుసంధానమై తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిభ, వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నరు.
హైదరాబాద్, డిసెంబర్ 14: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభమవగా, ఈ మేరకు బుధవారం సంస్థ ప్రకటించింది.
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 14: వార్ధా తుపాను ప్రభావం కారణంగా గత వారం రోజులుగా నెలకొన్న వాతావరణ మార్పులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆక్సిజన్ అందక రొయ్యలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయ. దీంతో గత్యంతరం లేక యుద్ధ ప్రాతిపదికన రైతులు పట్టుబడి చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రొయ్యలు కొద్ది సంఖ్యలోనే చనిపోయనప్పటికీ.. బుధవారం మాత్రం భారీగా మృత్యువాత పడ్డాయ.
విజయవాడ, డిసెంబర్ 14: నవ్యాంధ్రలో పాడి పరిశ్రమ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమను రైతులు, రైతు కూలీలు అనుబంధ వృత్తిగా కొనసాగిస్తున్నారు. దీన్ని గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం.. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రైతులకు పెద్ద ఎత్తున రాయతీలు అందిస్తోంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: తగ్గిన కూరగాయల ధరలు, ఇతరత్రా వంట సరకుల ధరలతో గత నెల టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) దిగివచ్చింది. నవంబర్లో 3.15 శాతంగానే నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది మూడో నెల. నిరుడు నవంబర్లో మైనస్ 2.04 శాతంగా ఉండగా, ఈ ఏడాది అక్టోబర్లో 3.39 శాతంగా ఉంది.
ముంబయి, డిసెంబర్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలను చవిచూశాయి. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్.. వడ్డీరేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న భయాలు మదుపరులను వెంటాడాయి. వడ్డీరేట్ల పెంపు అంచనాల మధ్య మంగళ, బుధవారాల్లో ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష జరిగింది. అయితే భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి పొద్దుపోయాక ఫలితాలు వెల్లడవగా, అయినప్పటికీ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: చిల్లర ద్రవ్యోల్బణం దిగివచ్చింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెల నవంబర్లో రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. 3.63 శాతంగానే నమోదైంది. 2014 నవంబర్లో 3.23 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లోకి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెళ్లాయి.
అమెరికాలోని పారిశ్రామికవేత్తల్లో 40 సంవత్సరాల్లోపు వయసున్నవారితో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికిగాను రూపొందించిన రెండో వార్షిక జాబితాలో ఇద్దరు యువ ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. 31 ఏళ్ల బయోటెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి 600 మిలియన్ డాలర్ల సంపదతో 24వ స్థానాన్ని సాధించగా, 30 ఏళ్ల ఇన్స్టాకార్ట్ సహవ్యవస్థాపకుడైన అపూర్వ మెహతా 360 మిలియన్ డాలర్లతో 31వ స్థానంలో నిలిచారు.
ముంబయి, డిసెంబర్ 13: దేశ జిడిపిలో కరెంట్ ఖాతా లోటు (సిఎడి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 0.6 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్లో ఇది 1.7 శాతంగా ఉంది. ఈ మేరకు మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తెలియజేసింది.