S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/26/2016 - 05:06

హైదరాబాద్, నవంబర్ 25: దేశంలోని దాదాపు 84 లక్షల మంది ఖాతాదారులకు నగదు ఉపసంహరణ కోసం వొడాఫోన్ ఇండియా వినూత్నమైన సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు తమ డిజిటల్ వాలెట్‌ను ఉపయోగించి దేశ వ్యాప్తంగా 1.20 లక్షల వొడాఫోన్ ఎం-పెసా ఔట్‌లెట్లలో లభ్యతను అనుసరించి నగదును విత్ డ్రా చేసుకోవచ్చని ఆ సంస్థ బిజినెస్ హెడ్ సురేష్ సేథీ తెలిపారు.

11/26/2016 - 05:05

న్యూఢిల్లీ, నవంబర్ 25: పెద్ద నోట్ల రద్దు వలన భారత దేశ వృద్ధి రేటుపై స్వల్పకాలికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) క్షీణత ఒక మోస్తరుగా ఉంటుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘్ఫచ్’ శుక్రవారం పేర్కొంది.

11/26/2016 - 05:05

ముంబయి, నవంబర్ 25: గత రెండు రోజులుగా వరస పతనంతో సతమతమైన స్టాక్ మార్కెట్ శుక్రవారం కొంతమేర నిలబడింది. ఐటి, ఫార్మా రంగాలు బలంగా నిలదొక్కుకున్న నేపథ్యంలో ఏకంగా 456 పాయింట్లు పెరిగి 26 వేల మార్కుకు చేరుకుంది. అదేవిధంగా అమెరికా డాలర్ విలువతో విలవిల్లాడుతూ వచ్చిన రూపాయి కూడా కొంతమేర పుంజుకోగలిగింది. అక్టోబర్ 18 తర్వాత సెనె్సక్స్ ఒకే రోజు 456 పాయింట్లు పెరగడం ఇదే మొదటిసారి.

11/25/2016 - 08:42

న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను ‘మిషన్ మోడ్’లో శరవేగంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం బ్యాంకులకు సూచించారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం భౌతికంగా నగదు వినియోగాన్ని తగ్గించడమేనని ఆయన స్పష్టం చేశారు.

11/25/2016 - 08:40

న్యూఢిల్లీ, నవంబర్ 24: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూపే డెబిట్ కార్డులపై గత వారమే ఎండిఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు)ను మాఫీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తాజాగా మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై కూడా ఎండిఆర్‌ను మాఫీ చేసింది.

11/25/2016 - 08:40

ముంబయి, నవంబర్ 24: వరసగా రెండు రోజులు లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున తరలివెళ్లిపోతుండడంతో డాలరుతో రూపాయి గతంలో ఎన్నడూ లేనంత కనిష్టస్థాయికి పడిపోయిన నేపథ్యంలో సెనె్సక్స్ 192 పాయింట్లు నష్టపోయి 26,000 పాయింట్ల దిగువకు పడిపోయింది.

11/25/2016 - 08:39

విజయవాడ, నవంబర్ 24: పరిశ్రమలు రాకుండా మోకాలడ్డుతున్న అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులు సహా అనేక సంస్థలు ముందుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాళ్లకుబలపాలు కట్టుకుని చేస్తున్న విదేశీ పర్యటనలకు స్పందన లభిస్తోంది.

11/25/2016 - 08:38

ముంబయి, నవంబర్ 24: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభావం, సమీప భవిష్యత్తులోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు పెరిగిన నేపథ్యంలో డాలరుతో రూపాయి గురువారం దారుణంగా పడిపోయింది. ఒక దశలో డాలరుకు 68రూపాయల 86 పైసల స్థాయికి పడిపోయింది. అయితే రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కాస్తకోలుకుని రూ. 68.73 స్థాయి వద్దముగిసింది. 39 నెలల కాలంలో డాలరుతో రూపాయి ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.

11/25/2016 - 08:38

హైదరాబాద్, నవంబర్ 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో సింగరేణి నుంచి మరో పది లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేయడానికి మహారాష్ట్ర జెన్కో తాజాగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర జెన్కో ఉన్నతాధికారి అరవింద్ కె.చంద్రగడే, సింగరేణి జనరల్ మేనేజర్ బి.కిషన్‌రావు ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.

11/24/2016 - 08:49

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో.. కొన్ని వెసులుబాట్లను కల్పిస్తున్నాయి ప్రభుత్వ, బ్యాంకింగ్ వర్గాలు. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేలా డెబిట్ కార్డు లావాదేవీల చార్జీలను రద్దు చేయాలని బుధవారం బ్యాంకులకు కేంద్రం సూచించింది.

Pages