S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/01/2016 - 07:15

విజయవాడ, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎపిఇడిబి), కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు (టిడిబి)ల మధ్య శుక్రవారం ఎంఒయు కుదిరింది. విశాఖలో శంకుస్థాపన జరిగిన మెడ్‌టెక్ పార్కులో ఏర్పాటు చేయనున్న వివిధ మెడికల్ క్లస్టర్స్ తయారీ కోసమే ఈ ఎంఒయు జరిగింది.

10/01/2016 - 07:14

హైదరాబాద్, సెప్టెంబర్ 30: దేశీయంగా వచ్చే పండగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా 25 వేల కోట్ల రూపాయల వాణిజ్య లావాదేవీలు జరుగుతాయని పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. ఈ అంశంపై నిర్వహించిన సర్వే వివరాలను అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పండగ పర్వదినాల వల్ల ఈ కామర్స్ జోరందుకుంటుందన్నారు.

10/01/2016 - 07:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పాకిస్తాన్ దుశ్చర్యలపై భారత సైన్యం ధీటుగా స్పందించడంపట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ సర్జికల్ దాడులను సమర్థించారు. పాక్ వక్ర బుద్ధికి భారత సాయుధ బలగాలు గుణపాఠం చెప్పాయని కొనియాడారు.

10/01/2016 - 07:12

ముంబయి, సెప్టెంబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే గురువారం వాటిల్లిన భారీ నష్టాల నేపథ్యంలో చివరకు స్వల్ప లాభాలను అందుకోగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 38.43 పాయింట్ల లాభంతో 27,865.96 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.90 పాయింట్లు పెరిగి 8,611.15 వద్ద నిలిచింది.

09/30/2016 - 05:31

ముంబయి, సెప్టెంబర్ 29: నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసినట్లు సైన్యం చేసిన ప్రకటన గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. మొదట్లో లాభాల్లో ట్రేడ్ అయినప్పటికీ దాడులు జరిపినట్లు సైన్యం ప్రకటించిన తర్వాత దేశీయ సూచీలు ఒక్కసారిగా భారీగా పతనమైనాయి.

09/30/2016 - 05:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) పెట్టుబడులపై కార్మిక సంఘాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను కేంద్ర కార్మిక శాఖ తోసిపుచ్చింది. ఇంతకుముందు 5 శాతంగా ఉన్న ఈ పెట్టుబడుల పరిమితిని రెట్టింపు చేసి 10 శాతానికి పెంచింది.

09/30/2016 - 05:22

విశాఖపట్నం, సెప్టెంబర్ 29: ఉక్కు ఉత్పత్తుల ధరలు చారిత్రాత్మకంగా తగ్గిపోవడంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 14 వందల 21 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఉక్కు సిఎండి పి.మధుసూదనరావు పేర్కొన్నారు. ఉక్కు తయారీ దిగ్గజం విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ 34వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) గురువారం ఉక్కు నగరంలో నిర్వహించారు.

09/30/2016 - 05:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: రుణాల ఎగవేత వ్యవహారంలో న్యాయస్థానాల ముందుకు రాకుండా లండన్‌లో ఉంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ హోల్టింగ్స్ లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్)కు ముఖ్య అధికారి (ప్రిన్సిపల్ ఆఫీసర్)గా నియమితులయ్యారు.

09/29/2016 - 08:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దేశంలోని సంపన్న నగరాల జాబితాలో వాణిజ్య రాజధాని ముంబయి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 820 బిలియన్ డాలర్ల సంపదను కలిగివున్న ముంబయిలో 28 మంది బిలియనీర్లు, మరో 45 వేల మంది మిలియనీర్లు ఉన్నట్లు ఒక నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో ముంబయి తర్వాత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వరుసగా రెండవ, మూడవ, నాలుగవ స్థానాలను దక్కించుకున్నాయి.

09/29/2016 - 08:23

విజయవాడ, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతుండటంతో హోటల్ పరిశ్రమ భారీ స్థాయిలో విస్తరిస్తోంది. ప్రభుత్వం రోడ్లు, రవాణా, విమానయానం వంటి వౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ వహించడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.

Pages