S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/20/2016 - 07:45

విజయవాడ, జూలై 19: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధి తగ్గుదల కారణంగా, భారత ప్రభుత్వం 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రాష్ట్రాలకు సహాయం చేసేందుకు, వ్యవసాయ, తత్సంబంధ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధి సాధించటానికి దీన్ని ఏర్పాటు చేశారు.

07/19/2016 - 00:33

న్యూఢిల్లీ, జూలై 18: ఎక్స్‌చేంజ్ ట్రేడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పెట్టుబడులను పెంచే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఇటిఎఫ్‌లలో 5 శాతం పెట్టుబడులకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి), ఇపిఎఫ్ అనుమతించినట్లు లోక్‌సభకు సోమవారం ఓ లిఖితపూర్వక సమాధానంగా మంత్రి తెలిపారు.

07/19/2016 - 00:33

న్యూఢిల్లీ, జూలై 18: దేశీయ టెలికామ్ రంగంలో ధరల యుద్ధం మొదలైంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మొబైల్ సేవలను త్వరలో ప్రారంభించనున్న క్రమంలో భారతీ ఎయిర్‌టెల్‌తో పోటీపడి ఐడియా సెల్యులార్ 4జి, 3జి ఇంటర్నెట్ ధరలను భారీగా తగ్గించింది. దాదాపు 67 శాతం వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఆదివారం ఎయిర్‌టెల్..

07/19/2016 - 00:31

న్యూఢిల్లీ, జూలై 18: అరుదైన జంతువులు, వాటి శరీర భాగాల అమ్మకాలు క్వికర్, ఒఎల్‌ఎక్స్, ఈబే, అమెజాన్, యూట్యూబ్ తదితర ప్రముఖ వెబ్‌సైట్లలో జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. సైబర్ నేరాల అదుపులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరుదైన జంతువులు, వాటి శరీర భాగాల ఆన్‌లైన్ స్మగ్లింగ్‌పై నిఘా పెట్టాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే తెలిపారు.

07/19/2016 - 00:31

లండన్, జూలై 18: జపాన్‌కు చెందిన బహుళజాతి టెలీకమ్యూనికేషన్స్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్.. ఐఫోన్ చిప్ డిజైనర్ ఎఆర్‌ఎమ్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేస్తోంది. 32 బిలియన్ డాలర్ల (24.3 బిలియన్ పౌండ్లు లేదా 29 బిలియన్ యూరోలు)కు ఎఆర్‌ఎమ్‌ను కొనేందుకు సాఫ్ట్‌బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ మొత్తం లావాదేవీ కూడా నగదు రూపంలోనే జరుగుతుండటం గమనార్హం.

07/19/2016 - 00:27

ముంబయి, జూలై 18: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. టర్కీ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఐరోపా మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాల మధ్య సూచీలు క్షీణించాయి. నిజానికి ఉదయం లాభాలతోనే ఆరంభమైనప్పటికీ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. మదుపరులు లాభాల స్వీకరణ దిశగా వెళ్లడంతో ఆరంభంలో 150 పాయింట్ల వరకు పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్..

07/19/2016 - 00:26

కేసముద్రం, జూలై 18: ఊహించని ధర పత్తికి లభిస్తోంది. వరంగల్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం గరిష్ఠంగా 6,500 రూపాయలు పలికింది. నాలుగు రోజుల క్రితం వరకు రోజుకు కొంత పెరుగుతూ 6,300 రూపాయలకు చేరగా.. సోమవారం ఉన్నట్టుండి అమాంతం 200 రూపాయలు పెరిగి 6,500 రూపాయలను తాకింది. దీంతో పెరిగిన ధరలు అటు వ్యాపారులకు, ఇటు రైతులకు ఆనందాన్ని కలిగించాయ.

07/19/2016 - 00:25

న్యూఢిల్లీ, జూలై 18: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ (హెచ్‌యుఎల్) స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 9.79 శాతం పెరిగి 1,173.90 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్ వ్యవధిలో 1,069.16 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందింది.

07/19/2016 - 00:24

న్యూఢిల్లీ, జూలై 18: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ.. మధ్యప్రదేశ్‌లోని బినా వద్దగల జైప్రకాశ్ పవర్ వెంచర్స్‌కు చెందిన 500 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయనుంది. 2,700 కోట్ల రూపాయలకు ఈ ప్లాంట్‌ను జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ సొంతం చేసుకుంటోంది. 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు ఈ ప్లాంట్‌లో ఉన్నట్లు జెఎస్‌డబ్ల్యు చెప్పింది.

07/19/2016 - 00:23

విజయవాడ, జూలై 18: దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే కీలక పాత్ర. ఇప్పటికీ 60 శాతం జనాభా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. జాతీయాదాయంలో కూడా ఎక్కువగా వ్యవసాయం నుంచే ఆదాయం వస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా ఉంది. కానీ దేశంలో వ్యవసాయం ప్రకృతి కరుణపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. వర్షాలు పడితే దిగుబడులు ఎక్కువ ఉంటుండగా, వర్షాభావ కాలంలో తక్కువగా వస్తున్నాయి.

Pages