-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జూన్ 17: దేశీయ ఎగుమతులు మందగమనంలో సాగుతున్న వేళ మే నెలలో మళ్లీ పుంజుకున్న సంకేతాలు వ్యక్తమయ్యాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో విదేశాలకు భారత ఎగుమతులు మరింతగా పెరిగేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నం, జూన్ 17: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపిడిసిఎల్) అత్యుత్తమమైన సంస్థ అని మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతినిధుల బృందం కితాబిచ్చింది. శుక్రవారం ఆ బృందం ఇక్కడకు వచ్చింది. ఏపీఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఈ బృందం సందర్శించింది.
న్యూఢిల్లీ, జూన్ 17: దేశీయ ప్రైవేట్ బీమా రంగంలో అతిపెద్ద ఏకీకరణకు తెర లేసింది. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్లోకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విలీనమవుతున్నాయి. ‘ఓ పథకం ప్రకారం హెచ్డిఎఫ్సి లైఫ్లోకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విలీనం జరుగుతోంది.
న్యూఢిల్లీ, జూన్ 17: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం 30,000 రూపాయలకుపైగా పలికిన 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి.. శుక్రవారం 29,650 రూపాయలకు దిగింది. ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఈ ఒక్కరోజే 600 రూపాయలు తగ్గింది. నాణేల తయారీదారులు, పరిశ్రమ నుంచి ఆదరణ కరువవడంతో కిలో వెండి ధర కూడా 950 రూపాయలు తగ్గి 41,100 రూపాయలను తాకింది.
ముంబయి, జూన్ 16: బుధవారం ఒకరోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాలతో ముగిశాయి.
హైదరాబాద్, జూన్ 16: స్పెయిన్లో ఈనెల 24న జరిగే ఫిక్కి-ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరం సమావేశానికి తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావును ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో జరిగే ప్యానల్ డిస్కషన్లో పాల్గొనాలని ఫిక్కీ నిర్వాహక బృందం కెటిఆర్ను కోరింది. ‘సినర్జీస్ ఇన్ ఐటి, స్మార్ట్సిటీ, టూరిజం ప్రమోషన్’ అనే అంశంపై ప్రసంగించాలని ఆయనను ఆహ్వానించారు.
న్యూఢిల్లీ, జూన్ 16: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న ఐరోపా కూటమినుంచి బ్రిటీష్ నిష్క్రమణ (బ్రెక్సిట్)పై రెఫరెండం, మధ్యప్రాచ్యంలో కల్లోలం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిణామాలపై ప్రభుత్వం కనే్నసి ఉంచిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం చెప్పారు.
ముంబయి, జూన్ 16: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత దేశ కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గింది. మూడో త్రైమాసికంలో ఈ లోటు 710 కోట్ల డాలర్లు ఉండగా నాలుగో త్రైమాసికంలో దాదాపు 30 లక్షల డాలర్ల మేరకు తగ్గిపోయింది. వాణిజ్య లోటు తగ్గడమే కరెంట్ ఖాతా లోటు తగ్గడానికి ప్రధాన కారణం.
ముంబయి, జూన్ 16: ఫార్చ్యూన్ ఇండియా నెక్స్ట్-500 సంస్థల జాబితాలో జస్ట్ డయల్, యుటిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఐఆర్సిటిసిలకు చోటు లభించింది. ఈ జాబితాలో డైనమాటిక్ టెక్నాలజీస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న కంపెనీల్లో చాలా సంస్థలు మధ్యస్థాయి పరిమాణం కలిగినవే. వీటిని ‘స్మాల్ వండర్స్’గా ఫార్చ్యూన్ పత్రిక అభివర్ణించింది.
న్యూఢిల్లీ, జూన్ 16: భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ భారతీ మిట్టల్ ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వాణిజ్య మండలి (ఐసిసి)కి అధిపతిగా ఎన్నికయ్యారు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఐసిసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వాణిజ్య సంస్థ. దీనికి అధిపతిగా ఎన్నికైన భారత వ్యాపారవేత్తల్లో సునీల్ మిట్టల్ మూడోవారు.