S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

,
06/03/2016 - 06:34

భీమవరం, జూన్ 2: విభజనానంతరం అభివృద్ధి పరుగులో ముందుండటానికి ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సాగును దినదినాభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఆ దిశగా అడుగులు కూడా వేగంగా ముందుకు వేస్తోంది. ప్రతీ నెల ఆక్వా రంగం పై సమీక్షలు చేస్తూ రొయ్య ఉత్పత్తి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటుంది.

06/03/2016 - 06:29

ఒసాకా, జూన్ 2: వృద్ధి రేటును వేగవంతం చేయడానికి ప్రభుత్వం తన సంస్కరణల అజెండాను వేగవంతం చేసిందని, ఫలితంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ అతి కొద్ది సంవత్సరాల్లోనే రెట్టింపు అయి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం అన్నారు.

06/03/2016 - 06:29

న్యూయార్క్, జూన్ 2: ఫోర్బ్స్ పత్రిక ఏటా ప్రచురించే అమెరికాలోని అత్యంత సంపన్నులైన, స్వయం శక్తితో ఎదిగిన 60 మంది మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు మహిళలు చోటు సంపాదించుకున్నారు.

06/03/2016 - 06:28

తిరుమల, జూన్ 2: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాలను ఈ-వేలం ద్వారా విక్రయిండంతో టిటిడికి రూ.7.62 కోట్లు ఆదాయం లభించింది. తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో గురువారం తలనీలాల ఈ-వేలం జరిగింది. ఇందులో మొదటిరం (31 అంగుళాలు) కిలో 25,563 రూపాయలు చొప్పున 3,100 కిలోలను ఈ-వేలంలో ఉంచగా అమ్ముడుపోలేదు.

06/03/2016 - 06:27

న్యూయార్క్, జూన్ 2: ఇప్పట్లో సొంతగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలన్న ఆలోచన తమ సంస్థకు లేదని, ప్రస్తుతానికి ఈ విషయంలో ఓఇఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్)లతో కలిసే ముందుకు సాగుతామని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘గూగుల్’ సిఇఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. గూగుల్ ప్రస్తుతం ఓఇఎంల సహకారంతో ‘నెక్సస్’ స్మార్ట్ఫోన్లను తయారు చేయించుకుంటున్న విషయం విదితమే.

06/03/2016 - 06:25

నెల్లూరు, జూన్ 2: ఏపిఎస్ ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగా సరకుల పార్శిల్ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రవీంద్రబాబు తెలిపారు. గురువారం నెల్లూరు ప్రధాన బస్టాండ్ ప్రాంగణంలో ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ పార్శిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

06/03/2016 - 05:09

న్యూఢిల్లీ, జూన్ 2: చెల్లింపులకు సంబంధించి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సహారా గ్రూపునకు చెందిన మొత్తం 10 ఆస్తులను వేలం వేయడానికి హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ, ఎస్‌బిఐ క్యాపిటల్ సిద్ధమవుతున్నాయి. సహారా ఆస్తుల వేలం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సెబిని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

06/03/2016 - 05:04

ఒసాకా (జపాన్), జూన్ 2: స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి గణాంకాలు అందజేస్తున్న ప్రోత్సాహంతో ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పేరును నిలబెట్టడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సంస్కరణల అజెండాను మరింత ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

06/02/2016 - 08:28

టోక్యో, జూన్ 1: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మరింత ముందుకు దూసుకెళ్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్న జైట్లీ.. మంగళవారం విడుదలైన స్థూల దేశీయోత్పత్తి (జిడిపి), వౌలికరంగాభివృద్ధి అంచనాలపై బుధవారం ఇక్కడ స్పందించారు. తాజా గణాంకాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎత్తుకు ఎదిగిందని పేర్కొన్నారు.

06/02/2016 - 08:26

ముంబయి, జూన్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం నష్టాలపాలైన నేపథ్యంలో టెలికామ్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, టెక్నాలజీ, రియల్టీ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు తిరిగి కోలుకోగలిగాయి.

Pages