S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/26/2016 - 07:16

న్యూఢిల్లీ, మే 25: క్యాపిటల్ గూడ్స్ పాలసీని బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. తద్వారా 2025 నాటికి 21 మిలియన్లకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జాతీయ పాలసీ అందుకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయ. ఈ పాలసీతో క్యాపిటల్ గూడ్స్ రంగంలో ప్రస్తుతమున్న ఉత్పత్తి సామర్థ్యం 2.3 లక్షల కోట్ల రూపాయల నుంచి 7.5 లక్షల కోట్ల రూపాయలకు పెరగనుంది.

05/26/2016 - 06:41

ముంబయి, మే 25: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంస్కరణాత్మక నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాల మధ్య మదుపరులు పెట్టుబడులకు అమితాసక్తిని కనబరిచారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 576 పాయింట్లు ఎగిసి 25,881.17 వద్ద ముగియగా, దాదాపు 3 నెలల గరిష్ఠాన్ని తాకింది.

05/26/2016 - 06:40

సత్యవేడు, మే 25: డైరెక్టర్ జనరల్ ఆఫ్ జపాన్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ, ట్రేడ్ ఇండస్ట్రీ సిజె టక్కాగీ సారథ్యంలో 50 మంది పారిశ్రామిక వేత్తల బృందం బుధవారం చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌ను సందర్శించింది. ఈ బృందానికి శ్రీసిటీ అధ్యక్షుడు రమేష్ సుబ్రహ్మణ్యం సాదర స్వాగతం పలికారు.

05/26/2016 - 06:40

న్యూఢిల్లీ, మే 25: ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలున్న నేపథ్యంలో వ్యవసాయోత్పత్తి బాగుంటుందని, ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండగలదని బ్యాంక్ ఆఫ్ అమెరికా చెబుతోంది. ఆగస్టు 9న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు కూడా తగ్గే వీలుందని తెలిపింది.

05/26/2016 - 06:39

ముంబయ, మే 25: లార్సెన్ అండ్ టర్బో (ఎల్‌అండ్‌టి) ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 18.55 శాతం పెరిగి 2,453.64 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 2,069.64 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలిపింది.

05/26/2016 - 06:37

గ్వాంగ్జూ, మే 25: ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగస్వాములు కావాలని చైనా మదుపరులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. వివిధ కీలక రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన వారికి వివరించారు. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి భారత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రాష్టప్రతి చైనాలో పర్యటిస్తున్నది తెలిసిందే.

05/25/2016 - 06:49

ముంబయి, మే 24: పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి అనుమతి పొందిన సంస్థల్లో ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ నేతృత్వంలోని జాయింట్ వెంచర్.. తాము పేమెంట్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయదలుచుకోలేదని ఇటీవల ప్రకటించినది తెలిసిందే.

05/25/2016 - 06:47

విజయవాడ, మే 24: వౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా అన్ని రంగాల్లోనూ రాష్ట్భ్రావృద్ధి సాధించే విధంగా కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

05/25/2016 - 06:46

విజయవాడ, మే 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో చేపట్టనున్న ప్రాజెక్టులు, వౌలిక వసతుల కోసం అవసరమైన రుణం మంజూరుకు ఎపి సిఆర్‌డిఏ ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం మంగళవారం విజయవాడ సిఆర్‌డిఎ కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది.

05/25/2016 - 06:44

ముంబయి, మే 24: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. తాజాగా మరో ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 3,587 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 56.14 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకున్న బ్యాంక్..

Pages