-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, మే 19: భారత్లో తమ శాఖలను దాదాపు సగానికి సగం కుదించనున్నట్లు బ్రిటన్కు చెందిన హెచ్ఎస్బిసి బ్యాంకు గురువారం ప్రకటించింది. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఖాతాదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు, ప్రత్యేకించి డిజిటల్ ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతుండటంతో స్థిరీకరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య చేపడుతున్నామని హెచ్ఎస్బిసి బ్యాంకు స్పష్టం చేసింది.
విజయవాడ, మే 19: కృష్ణానదీ పుష్కరాల సందర్భంగా ఇబ్రహీంపట్నం సమీపాన గోదావరి కృష్ణానదీ సంగమ ప్రదేశాన్ని అద్భుత పర్యాటక ప్రదేశంగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం రాత్రి సిఎంఓలో పదికిపైగా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పుష్కర ఏర్పాట్లను సమీక్షించారు. పుష్కర పనులు నత్తనకడన నడుస్తుండటంపై సమీక్ష ప్రారంభంలోనే ఇంజనీర్లపై సిఎం ఆగ్రహం చెందారు.
హైదరాబాద్, మే 19: రెండు రోజుల్లో మీతో ఒక పెద్ద వార్త పంచుకుంటాను అని రెండు రోజుల క్రితం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్లో పేర్కొనడం చర్చనియాంశంగా మారింది. మీడియాలో కొందరు బిగ్ న్యూస్ అనే పదాన్ని సంచలన వార్త అని అనువాదం చేయడంతో రాజకీయంగా ఏదైనా జరుగుతుందేమో అంటూ సామాజిక మాధ్యమాల్లో బోలెడు చర్చ జరిగింది. అయతే ఏమిటా బిగ్ న్యూస్? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో చెబుతారా?
రాజమహేంద్రవరం, మే 19: గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలో డిమాండ్ అధికంగా ఉందని, అయితే దానికి ఆస్థాయిలో ఉత్పత్తి మాత్రం లేదని, ఉత్పత్తి పెంచి కార్పొరేట్ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ వైస్-్ఛర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్పిఎస్ రవిప్రకాష్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.
న్యూఢిల్లీ, మే 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)కి చెందిన ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మె నిర్వహించనున్నారు. మాతృ సంస్థలో తమ బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్లు వారు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, మే 19: దేశంలో వస్తు వినిమయం క్రమేణా పెరుగుతుండటంతో ప్రస్తుత సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మూడీస్ ఇనె్వస్టర్ సర్వీస్ గురువారం వెల్లడించింది. అయితే ప్రైవేటు పెట్టుబడులు నిలకడగా పెరగడంపైనే ఇది ఆధారపడి ఉంటుందని మూడీస్ స్పష్టం చేసింది.
హైదరాబాద్, మే 19: ఆంధ్రప్రదేశ్లో డూన్ స్కూల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. డూన్ స్కూల్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. డూన్ స్కూల్ను విశాఖ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బావుంటుందనే అంశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు వారితో చర్చించారు.
ముత్తుకూరు, మే 19: నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఎపి జెన్కో థర్మల్ కేంద్రంలో రెండు యూనిట్లకు సంబంధించి గురువారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులోని బంకర్లోని 2ఎ వద్ద కనే్వయర్ బెల్టు తెగిపోయి పలు సాంకేతిక లోపాలు ఏర్పడటంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. బొగ్గు రవాణా ప్రక్రియకు ఆటంకం కలిగి ఈ పరిస్థితి నెలకొంది.
న్యూఢిల్లీ, మే 18: భారత బ్యాంకింగ్ వ్యవస్థకు ఏమైంది? ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి ఏమిటి? వేల కోట్ల రూపాయల్లో నష్టాలు ఎందుకు?.. ఆర్థిక మంత్రి నుంచి అరక దునే్నవారి వరకు, సాఫ్ట్వేర్ నుంచి సామాన్యుడి వరకు ఇప్పుడు అందరి మదిలో ఇవే ప్రశ్నలు. అవును మరి.. వరుసగా ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థే బలం.
హైదరాబాద్, మే 18: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇక్కడ ఏర్పాటుచేస్తున్న డెవలప్మెంట్ సెంటర్ను గురువారం ఆ సంస్థ సిఇఒ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ హాజరవుతున్నారు.