-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, మే 10: పదేళ్లలో భారతీయుల సగటు సంపద ఏకంగా 400 శాతం పెరిగింది. 2005 నుంచి 2015 మధ్య భారత్తోసహా చైనా, వియత్నాం, శ్రీలంక, ఫిలిప్పిన్స్ దేశాల పౌరుల సంపద 400 శాతానికిపైగా పెరిగిందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ఒకటి స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఐరోపా వాసుల సంపద 5 శాతం క్షీణించిందని తెలిపింది. ప్రస్తుతం ఐరోపా పౌరుల సగటు సంపద దాదాపు 86,000 అమెరికన్ డాలర్లుగా ఉంది.
ముంబయి, మే 9: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు నాలుగు వారాల్లో గరిష్ఠ లాభాలను పొందింది. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్.. వచ్చే నెల సమీక్షలో వడ్డీరేట్లను పెంచబోదన్న సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లను పరుగులు పెట్టించాయి. ఇది భారతీయ సూచీలనూ ప్రభావితం చేసింది.
న్యూఢిల్లీ/ముంబయి, మే 9: ఎఫ్ఎమ్సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్యుఎల్) స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7.02 శాతం పెరిగింది. 1,089.59 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 1,018.08 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో హెచ్యుఎల్ స్పష్టం చేసింది.
హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 9: మలేషియాకు చెందిన అతిపెద్ద విద్యుత్ రంగ సంస్థ టెనగ నేషనల్ బెర్హాద్ (టిఎన్బి).. జిఎమ్ఆర్ ఎనర్జీకి చెందిన అసెట్స్ పోర్ట్ఫోలియోలో 30 శాతం వాటాను అందుకుంది. 300 మిలియన్ డాలర్ల (దాదాపు 2,000 కోట్ల రూపాయలు)కు ఈ వాటాను టెనగ కొనుగోలు చేస్తున్నట్లు సోమవారం జిఎమ్ఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథి తెలిపారు.
న్యూఢిల్లీ, మే 9: త్వరలో మార్కెట్లోకి రానున్న డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనానికి సంబంధించి బుకింగ్స్ను ఇసుజు మోటార్స్ ఇండియా సోమవారం ప్రారంభించింది. చెన్నై ఎక్స్షోరూం ప్రకారం ఈ యుటిలిటి వెహికిల్ ధర 12.49 లక్షల రూపాయలు. కాగా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ వద్దనున్న కొత్త ప్లాంట్లో ఈ వాహనాలు తయారవుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి వాహనాల పంపిణీ మొదలవనుంది.
రాజమహేంద్రవరం, మే 9: తునికాకు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ ఏడాది నుంచి స్థానిక ఆదివాసీల సంక్షేమానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంత నిర్వహణకు వచ్చిన తునికాకు సేకరణ, టెండర్ల ప్రక్రియ ఎపి ప్రభుత్వమే నిర్వహించి, ఆ వచ్చే ఆదాయాన్ని కూడా ఆయా స్థానిక ఆదివాసీలకే కేటాయించేలా మొదటిసారిగా శ్రీకారం చుట్టింది.
ముంబయి/న్యూఢిల్లీ, మే 9: ఈసారి అక్షయ తృతీయ అమ్మకాలు గతంతో పోల్చితే 10 శాతం పెరగవచ్చన్న ఆశాభావాన్ని నగల వర్తకులు వెలిబుచ్చారు. సోమవారం అక్షయ తృతీయ అవగా, ఈరోజు ఆభరణాల కొనుగోళ్లు శుభప్రదమనే సెంటిమెంట్ ఉన్నది తెలిసిందే. ఈ క్రమంలో ‘దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు బాగున్నాయన్న స్పందన వచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయని సమాచారం అందింది.
న్యూఢిల్లీ, మే 9: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్ఒ) ఖాతాదారుల కోసం చౌక ధరల గృహ పథకాన్ని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు తెలిపింది. ‘ఇపిఎఫ్ఒ ఖాతాదారులకు తగినట్లుగా ఓ చౌక ధరల హౌసింగ్ పథకాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది ఇంకా ప్రాథమిక దశ చర్చల్లోనే ఉంది.’ అని సోమవారం లోక్సభకు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.
గుంటూరు, మే 9: పొగాకు రైతుల సంక్షేమార్థం వివిధ పథకాల కింద అందించే వడ్డీలేని రుణాలను ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పొగాకు బోర్డు కార్యదర్శి సిఎస్ఎస్ పట్నాయక్ తెలిపారు. పొగాకు రైతుల కుమార్తెల వివాహాలకు ఇచ్చే 25 వేల రూపాయల రుణాన్ని 50 వేలకు, విద్యా రుణాలను 25 నుంచి 50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.
రామగుండం, మే 9: సింగరేణి పరిశ్రమ నుండి కోట్లాది రూపాయల బొగ్గు అక్రమంగా తరలి పోతుండటంతో తలలు పట్టుకుంటున్న యాజమన్యం.. బొగ్గు దందాను అరికట్టే పనిలో పడింది. బొగ్గు అక్రమ దందాతో సంస్థకు ఎదురవుతున్న నష్టాలు, వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అక్రమ బొగ్గు రవాణాను సాంకేతిక పరిజ్ఞానంతో కట్టడి చేసేందుకు సిద్ధమైంది.