S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/08/2016 - 04:13

న్యూఢిల్లీ, మే 7: స్పెక్ట్రమ్ వినియోగ చార్జీ (ఎస్‌యుసి)పై టెలికామ్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడా టెలికామ్ సంస్థలు ఒకే తరహా స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ (ఎస్‌యుసి)కి మద్దతు పలుకుతుండగా, ఇలా చేస్తే తమకు నష్టం వాటిల్లుతుందని చిన్న సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.

05/08/2016 - 04:09

ముంబయి, మే 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం నష్టాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చికిగాను ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

05/08/2016 - 04:08

న్యూఢిల్లీ, మే 7: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్‌లో రెండేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 225 రూపాయలు పెరిగి 30,350 రూపాయల వద్ద నిలిచింది. 2014 మే 10 తర్వాత పుత్తడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

05/08/2016 - 04:06

హైదరాబాద్/శ్రీరాంపూర్ రూరల్, మే 7: ఒడిశాలోని అంగూల్ జిల్లాలోగల నైనీ బొగ్గు బ్లాకులో ఉత్పత్తి 36 నెలల్లో ప్రారంభిస్తామని సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ తెలిపారు. 450 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న నైనీ బొగ్గు గని సింగరేణికి వందలాది మైళ్ల దూరంలో ఉన్నందున దీన్ని ఎండిఓ పద్దతిలో నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు చెప్పారు.

05/08/2016 - 04:04

డెట్రాయిట్, మే 7: సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు (స్వయం చోదక వాహనాలు) త్వరలో వచ్చేస్తున్నాయి. ఇవి ఇక రోడ్లపై తిరగడానికి ఎంతో కాలం పట్టదని అంతర్జాతీయ ఆటోరంగ సంస్థ ఫియట్ చెబుతోంది. నిజానికి డ్రైవర్ లేకుండానే నడిచే ఈ కార్లు అందుబాటులోకి రాబోతున్నాయనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది.

05/08/2016 - 04:01

హైదరాబాద్, మే 7: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 3,10,673 కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2014-15లో 2,84,588 కోట్ల రూపాయలుగా ఉందని శనివారం బ్యాంక్ ప్రకటించింది.

05/07/2016 - 07:02

న్యూయార్క్, మే 6: ఐటి సేవల దిగ్గజం కాగ్నిజెంట్ నికర లాభం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 15.2 శాతం పెరిగి 441.2 మిలియన్ డాలర్లుగా నమోదైంది. నిరుడు జనవరి-మార్చిలో 382.9 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే అమెరికాకు చెందిన ఈ సంస్థ ఆదాయం వృద్ధి మాత్రం 14 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. 10 శాతం పెరుగుదలతో ఈసారి 3.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, పోయినసారి 2.91 బిలియన్ డాలర్లుగా ఉంది.

05/07/2016 - 06:59

హైదరాబాద్, మే 6: అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, హెలికాప్టర్లు, చిన్న విమానాలు దిగేందుకు వీలుగా ఒక హెలిప్యాడ్‌ను కూడా నిర్మించాలని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపి సీడ్ ఫార్మ్‌లో 120 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, అక్కడ హెలిప్యాడ్ నిర్మించాలని సూచించారు.

05/07/2016 - 06:57

మదనపల్లె, మే 6: చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నెల రోజులుగా భారీగా పతనమైన టమోటా ధరలు మూడు రోజులుగా ఆశాజనకంగా కనిపిస్తుండటంతో రైతుల ముఖాల్లో మళ్లీ ఆనందం కనబడుతోంది. గత పదహేను రోజులుగా ఆరు నుంచి పది రూపాయల వరకు టమోటా ధర పలికింది. అయతే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుండడంతో ధరలు క్రమేణా పుంజుంటున్నాయి.

05/07/2016 - 06:57

హైదరాబాద్, మే 6: తెలంగాణలో రిటైల్ మార్కెట్‌ను ప్రోత్సహించే విధంగా సరికొత్త చిల్లర వాణిజ్య విధానం (రిటైల్ ట్రేడ్ పాలసీ)ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ముసాయిదా రూపొందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ శుక్రవారం పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమావేశమై ముసాయిదా రూపొందించారు.

Pages