-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి, రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాను భారత్కు తిప్పి పంపాలని కేంద్ర ప్రభుత్వం గురువారం లాంఛనంగా బ్రిటన్కు విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ధరలతో పాటు ఉత్పత్తిలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే విధంగా రైతులకు చేయూతనిచ్చేందుకు తేయాకు, కాఫీ, రబ్బరు తదితర ఉద్యాన పంటలకు మార్కెట్ ఆధారిత బీమా పథకాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ముంబయి, ఏప్రిల్ 28: గత రెండు రోజులుగా లాభాల బాటలో సాగిన స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలు చవి చూశాయి. దీంతో బిఎస్ఇ సెనె్సక్స్ 461 పాయింట్లకు పైగా నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. గత మూడు వారాల్లో సెనె్సక్స్ఒక్క రోజులో ఇంత నారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని, 2017-18లో అది మరింత వేగవంతమై 7.8 శాతానికి చేరుకోవచ్చని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది.
నిజామాబాద్, ఏప్రిల్ 28: ఈ నెల 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూతబడ్డ బీడీ కార్ఖానాలు శుక్రవారం నుండి మళ్లీ తెరుచుకోనున్నాయి. బీడీ కంపెనీల యాజమాన్య సంఘంతో కార్మిక శాఖ అధికారుల సమక్షంలో బీడీ కార్మిక సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనతో లక్షలాది మంది బీడీ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలోకి చౌకగా వచ్చిపడుతున్న ఉక్కు దిగుమతులను నియంత్రించేందుకు వీలుగా మరిన్ని చర్యలు చేపట్టేందుకు తమ శాఖ సుముఖంగా లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్కుపై తాము కనీస దిగుమతి ధర (ఎంఐపి)ను విధించామని, ఈ దిగుమతులను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టే విషయం గురించి తాను ఆలోచించడం లేదని ఆమె విలేఖర్లకు తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణలో ఆర్ధిక కార్యకలాపాలు అందించేందుకు ఏర్పాటైన సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. గురువారం నాడిక్కడ ఒక హాటల్లో సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జయేష్ రంజన్ హాజరయ్యారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 27: నార్వేకు చెందిన టెలికామ్ రంగ దిగ్గజం టెలినార్.. భారత్ నుంచి తమ టెలికామ్ కార్యకలాపాలను ఎత్తివేస్తామన్న సంకేతాలిచ్చింది. అయితే సరసమైన ధరలలో మరింత స్పెక్ట్రమ్ను సమకూర్చుకోలేకపోతేనేనని స్పష్టం చేసింది. త్వరలో స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ సిఫార్సు చేసిన నేపథ్యంలో టెలినార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
భీమవరం, ఏప్రిల్ 26: ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో మేటిగా నిలుస్తున్న ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం పట్టణాలను ‘ఎక్స్పోర్ట్ ఎక్స్లెన్సీ’ పథకానికి ఎంపికచేసిన కేంద్రం.. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఇందుకు సంబంధించిన నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఇలా ఎంపికైన ప్రాంతాల్లో ఆక్వా రంగ అభివృద్ధికి అవసరమైన వౌలిక సదుపాయాలు మెరుగుపర్చడానికి కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 11.7 శాతం పడిపోయి 1,133.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 1,284.2 కోట్ల రూపాయలుగా ఉంది. గడచిన రెండేళ్ళలో మారుతి త్రైమాసిక లాభం పతనమవడం ఇదే తొలిసారి.