S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/22/2016 - 07:43

దేవరపల్లి, ఏప్రిల్ 21: పొగాకు, పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) ప్రజాస్వామ్యయుతంగా నిర ణయం తీసుకోవడంలేదని అంతర్జాతీయ పొగాకు ఉత్పత్తిదారుల సంఘం సిఇఒ అంటోనియో ఆబ్రూ న్ హోసా (పోర్చుగల్) అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల స్థితిగతులను పరిశీలించడంలో భాగంగా గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి వచ్చారు.

04/22/2016 - 07:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశీయంగా ఉద్యోగార్థుల్లో అత్యధికులు గూగుల్ సంస్థ వైపే చూస్తున్నారని మరోసారి తేలింది. రాండ్‌స్టడ్ అవార్డ్ 2016 6వ ఎడిషన్ ప్రకారం వరుసగా రెండో సంవత్సరం అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా గూగుల్ నిలిచింది. రెండో స్థానంలో మెర్సిడెస్ బెంజ్ ఉందని రాండ్‌స్టడ్ ఇండియా ఎండి, సిఇఒ మూర్తి కె ఉప్పలూరి చెప్పారు.

04/22/2016 - 07:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7.59 శాతం వృద్ధి చెంది 2,149.13 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఎన్నారై బిలియనీర్ అనీల్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 1,997.44 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.

04/22/2016 - 07:40

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 36.20 పాయింట్లు పుంజుకుని 25,880.38 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 2.70 పాయింట్లు కోల్పోయి 7,912.05 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభంలో భారీ లాభాల్లోనే కదలాడిన సూచీలు మార్కెట్లు ముగిసే సమయానికి మాత్రం డీలాపడ్డాయి.

04/22/2016 - 07:39

లండన్, ఏప్రిల్ 21: బ్రిటన్‌లోని టాటా స్టీల్ వ్యాపారంలో 25 శాతాన్ని కొనుగోలు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే టాటా స్టీల్.. నష్టాల ఊబిలో కూరుకుపోయినది తెలిసిందే. ఈ క్రమంలో టాటా స్టీల్ ప్లాంట్ల కొనుగోలుకు ముందుకొచ్చేవారికి చేయూతనిచ్చేలా 25 శాతం వాటాను కొనుగోలు చేస్తామని బ్రిటీష్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

04/22/2016 - 07:38

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 21: విదేశీ జీడిపప్పు స్వదేశీ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో స్వదేశీ అవసరాలకు విదేశాల నుండి పెద్దయెత్తున జీడిపప్పు దిగుమతి అవుతోంది. విదేశీ జీడిపప్పుతో అవసరాలు తీరుతున్నా స్వయం సమృద్ధికి మాత్రం విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో జీడిమామిడి తోటలు అంతరించిపోతున్నాయి. పంట భూములు కోస్తా జిల్లాల్లో రియల్ ఎస్టేట్లుగా రూపాంతరం చెందుతున్నాయి.

04/21/2016 - 10:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ టవర్ విభాగం ఇన్‌ఫ్రాటెల్‌లో 5 శాతం వాటాను ఓ బహిరంగ మార్కెట్ వాణిజ్య ఒప్పందం ద్వారా అమ్మాలని చూస్తోంది. ఈ మేరకు సంస్థ సన్నిహిత వర్గాల అందిస్తున్న సమాచారం. ఈ అమ్మకం ద్వారా ఎయిర్‌టెల్‌కు దాదాపు 3,500 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు నిధులు దక్కనున్నాయి. ఇన్‌ఫ్రాటెల్‌లో ఎయిర్‌టెల్‌కు 71.70 శాతం వాటా ఉంది.

04/21/2016 - 10:06

హోస్టన్, ఏప్రిల్ 20: మైక్రోప్రాసెసర్ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇంటెల్.. భారీగా ఉద్యోగులను తొలగించనుంది. దాదాపు 12,000 మంది ఉద్యోగులను తీసేసేందుకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ ఉద్యోగుల సంఖ్య 1,07,300గా ఉంది. కాగా, ఈ సంఖ్యలో సుమారు 11 శాతం మందిని 2017 మధ్య నాటికి తొలగించాలని ఇంటెల్ భావిస్తోంది.

04/21/2016 - 10:06

పుణె, ఏప్రిల్ 20: భారత ఆర్థిక వ్యవస్థ బలంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

04/21/2016 - 10:04

బెంగళూరు, ఏప్రిల్ 20: దేశీయ ఐటిరంగంలో మూడో అతిపెద్ద సంస్థ విప్రో ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 1.6 శాతం పడిపోయింది. 2,235 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 2,272 కోట్ల రూపాయల లాభాన్ని విప్రో అందుకుంది.

Pages