-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మధ్యశ్రేణి సాఫ్ట్వేర్ సర్వీసుల సంస్థ మైండ్ట్రీ ఏకీకృత నికర లాభం 21.2 శాతం పెరిగి గత ఆర్థిక సంవత్సరం (2015-16) నాలుగో త్రైమాసిక, ఈ ఏడాది జనవరి-మార్చిలో 156 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే త్రైమాసికంలో 128.7 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఏకీకృత ఆదాయం 44.2 శాతం ఎగిసి 1,324.2 కోట్ల రూపాయలుగా ఉంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 19.5 శాతం పెరిగి 1,667.70 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే వ్యవధిలో 1,395.61 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆర్థిక ఫలితాల ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భువనేశ్వర్, ఏప్రిల్ 17: ఆదివారం భువనేశ్వర్ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. స్మార్ట్ఫోన్ కలిగిన ప్రతి ప్రయాణికుడు ఈ ఉచిత వైఫై సేవలను పొందవచ్చు. దేశంలో ముంబయ సెంట్రల్ రైల్వేస్టేషన్ తర్వాత గూగు ల్ ఉచిత వైఫై ఉన్నది ఇప్పుడు భువనేశ్వర్ రైల్వేస్టేషన్లోనే.
లండన్/వాషింగ్టన్, ఏప్రిల్ 17: విజయ్ మాల్యా అమెరికాలోని తన బ్రూవరీ సంస్థ ఎంబిసి నుంచి గత సంవత్సరం రూ. 1.71 కోట్లకుపైగా వేతనాన్ని పొందారు. అయితే ఆ సంస్థ నిధుల కొరతను ఎదుర్కొంటూ రుణదాతల నుంచి డిఫాల్ట్ నోటీసులను అందుకోవడం విశేషం. 2015లో మాల్యా పొందిన మొత్తం వేతనంలో సగానికిపైగా వేతనాన్ని కాలిఫోర్నియాలోని మెండోసినో బ్రూవింగ్ కంపెనీ (ఎంబిసి)యే చెల్లించింది.
ముత్తుకూరు, ఏప్రిల్ 17: కృష్ణపట్నం ఓడరేవు నుంచి మొదటిసారిగా ఒమన్ దేశంలోని ఫలాల ఓడరేవుకు ఆదివారం మేయరస్ బెంటోన్ విల్లా అనే విదేశీ నౌక కంటైనర్లతో బయలుదేరింది. ఈ కంటైనర్ నౌకను తొమ్మిదవ బెర్తువద్ద పోర్టు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జితేంద్ర ప్రారంభించారు. నౌక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పోర్టు అధికారులు ఘనంగా జరిపారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల మధ్య కూడా దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడు లు పోటెత్తుతున్నాయ. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నా రు. గత నెల మార్చిలో షేర్ల కొనుగోళ్లకు విశేషంగా ఆసక్తి కనబరిచిన మదుపరులు..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ) గత ఏడాది 37 శాతం పెరిగి 39.32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది 28.78 బిలియన్ డాలర్లకే ఎఫ్డిఐ పరిమితమైనట్లు పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ (డిఐపిపి) తెలియజేసింది. కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగంలోకి అత్యధికంగా ఎఫ్డిఐ వచ్చింది.
వాషింగ్టన్, ఏప్రిల్ 16: భారత ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), దాని అమెరికా విభాగమైన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్పై అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది.
వాషింగ్టన్, ఏప్రిల్ 16: ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తరచూ భారత్ను ఓ వెలుగు రేఖగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఈ అభిప్రాయాలను ‘గుడ్డివాళ్ల రాజ్యానికి ఒంటి కన్ను రాజు’ చందంగా పేర్కొన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్. ఏదీ దొరకని చోట దొరికినదే మహా ప్రసాదం అన్న ధోరణిలో స్పందించారు రాజన్.