S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/15/2016 - 04:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ 13 శాతం పెరిగి రూ. 3.45 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్ ఇనె్వస్టర్లు ఈ పథకాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడమే వీటి అసెట్ బేస్ ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం. 2015 మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ రూ. 3.05 లక్షల కోట్లు ఉండగా, అది ఈ ఏడాది మార్చి చివరికి రూ.

04/15/2016 - 04:10

వాషింగ్టన్, ఏప్రిల్ 14: దేశంలో ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయని, వర్షపాతం సాధారణ సగటు కంటే అధికంగా నమోదవుతుందని చెబుతున్న వాతావరణ నిపుణుల అంచనాలు నిజమైతే భారత ఆర్థికాభివృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని గత ఆర్థిక సంవత్సరం సాధించిన స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు (7.5 శాతం) కంటే మరింత మెరుగైన వృద్ధిరేటును సాధించడం ఖాయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

04/15/2016 - 04:19

ముంబయి, ఏప్రిల్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సాగరమాల’ ప్రాజెక్టు గడువును సగానికి కుదించుకోవాలని నిర్ణయించింది.

04/15/2016 - 04:06

హైదరాబాద్, ఏప్రిల్ 14: ప్లాటినం 3జి నెట్ వర్క్‌ను హైదరాబాద్‌లోని తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. త్వరలో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.

04/15/2016 - 04:05

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఓ) జాతీయ ఉపాధ్యక్షురాలిగా అపర్ణ పింకీరెడ్డి ఎంపికయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 32వ వార్షిక సమావేశంలో పింకీరెడ్డి ఈ పదవికి ఎంపికయ్యారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

04/15/2016 - 04:04

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్‌గా దిననాథ్ దుభాషి నియమితులయ్యారు. గురువారం నుంచి దుబాషి నియామకం అమల్లోకి వస్తుందని ఎల్‌అండ్‌టి వెల్లడించింది. ఫైనాన్సియల్ రంగంలో ఆయనకు 25 ఏళ్ల పాటు విశేష అనుభవం ఉందని, కార్పొరేట్ బ్యాంకింగ్, క్యాష్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ రేటింగ్స్, రిటైల్ లెండింగ్, రూరల్ ఫైనాన్సింగ్ విభాగాల్లో ఆయన పని చేశారు.

04/15/2016 - 04:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ‘పన్ను ఎగవేతకు స్వర్గ్ధామాలు’ (టాక్స్ హెవెన్స్) అనే ముద్ర వేయడంపై కొన్ని చిన్న దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది చాలా అవమానకరమైన పదమని భారత్‌లాంటి దేశాలకు ఆ దేశాలు నిరసన తెలియజేయడమే కాకుండా నల్లధనంపై ఆ దేశాలు జరుపుతున్న దర్యాప్తులకు సహకరించబోమని హెచ్చరికలు చేశాయి.

04/15/2016 - 04:02

హైదరాబాద్, ఏప్రిల్ 14:నగర శివార్లలోని మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్‌సిటీలో భగవతీ ప్రోడక్ట్స్, మైక్రోమాక్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు గురువారం ప్రారంభించారు.

04/14/2016 - 06:08

ముంబయి, ఏప్రిల్ 13: మదుపరుల కొనుగోళ్ల జోరు మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. దాదాపు మూడున్నర నెలల గరిష్ఠానికి సూచీలు చేరుకున్నాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మంగళవారం విడుదలైన పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) సూచీ 2 శాతానికి పెరగడం, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 6 నెలల కనిష్టానికి దిగిరావడం మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపించాయి.

04/14/2016 - 08:12

విజయవాడ, ఏప్రిల్ 13: నిపుణులు, శాస్తవ్రేత్తలు ఈ ఖరీఫ్ సీజన్‌లో జూన్ 5 నాటికల్లా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంత్రి పుల్లారావు బుధవారం నగరంలో 13 జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులు, శాస్తవ్రేత్తలు, నిపుణులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17 ఖరీఫ్ సీజన్ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు.

Pages