S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/02/2016 - 04:20

మెల్‌బోర్న్, ఏప్రిల్ 1: భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం కనిపిస్తున్న వృద్ధి రాబోయే రెండు దశాబ్దాలకుపైగా కాలంలోనూ ఇలాగే ఉండగలదన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. నాలుగు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైట్లీ.. చివరి రోజైన శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ఇనె్వస్ట్ ఇన్ ఇండియా’ రౌండ్ టేబుల్ సెషన్‌లో భాగంగా భారత, ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు, సిఇఒలతో సమావేశమయ్యారు.

04/02/2016 - 04:09

ముంబయి, ఏప్రిల్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నూతన ఆర్థిక సంవత్సరాని (2016-17)కి నష్టాలతో స్వాగతం పలికాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 72.22 పాయింట్లు కోల్పోయి 25,269.64 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 25.35 పాయింట్లు పడిపోయి 7,713.05 వద్ద నిలిచింది.

04/02/2016 - 04:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: నాన్-సబ్సిడీ వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య 14.2 కిలోల సిలిండర్ ధరను 4 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం తెలిపాయి. మరోవైపు జెట్ ఇంధనం ధర 8.7 శాతం పెంచుతున్నట్లు చమురు సంస్థలు స్పష్టం చేశాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్ విమాన ఇంధనం ధర 3,371.55 రూపాయలు ఎగిసి 42,157.01 రూపాయలను తాకింది.

04/02/2016 - 04:07

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఎన్టీపిసి గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రికార్డు స్థాయిలో 46,653 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు ఆ సంస్థ శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అలాగే 2015-16లో అదనంగా 2,225 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులు విద్యుదుత్పత్తిని ప్రారంభించాయ. మరోవైపు సౌర విద్యుదుత్పత్తి రంగంలో గరిష్ఠ స్థాయిలో 160.8 ఎంయు విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.

04/02/2016 - 04:06

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు వేల నెట్‌వర్క్ సైట్స్‌ను ఆధునీకరించినట్లు టెలినార్ ఇండియా తెలిపింది. అత్యాధునిక పరికరాలను వినియోగిస్తూ ఈ సర్కిల్‌లోని తమ వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్‌నెట్, వాయిస్‌లో మరింత స్పష్టత అందించడానికి నెట్‌వర్క్ సైట్స్‌ను ఆధునీకరించే కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొంది.

04/02/2016 - 04:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్ (విడబ్ల్యు).. భారత్‌లో వెంటో మోడల్‌కు చెందిన 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేగాక 3,877 యూనిట్లను రీకాల్ చేసింది. అలాగే విడబ్ల్యు గ్రూప్‌నకు చెందిన స్కోడా బ్రాండ్‌లోని ర్యాపిడ్ మోడల్ అమ్మకాలను ఆపేసింది.

04/02/2016 - 04:03

హైదరాబాద్/కొత్తగూడెం: ఏప్రిల్ 1: బొగ్గు ఉత్పాదనలో రికార్డు సృష్టించిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ. 16,000 కోట్ల టర్నోవర్ సాధించింది. గత ఏడాది బొగ్గు ఉత్పత్తిలో 525 లక్షల టన్నులపై 15 శాతం వృద్ధి సాధించి, 127 ఏళ్ల సింగరేణి చరిత్రలో 60.03 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించామని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీధర్ చెప్పారు.

04/01/2016 - 03:50

హైదరాబాద్, మార్చి 31: ఐటి రంగానికి దేశానికి, దశ, మార్గదర్శనం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, స్టార్టప్‌ల ప్రభంజనం ఇక్కడే నుంచి ప్రారంభమైందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటి విధానం, స్టార్టప్‌ల పాలసీ దేశ, విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని, అనేక పెద్ద కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నారన్నారు.

04/01/2016 - 03:47

విజయవాడ, మార్చి 31: ఎపిఎస్‌ఆర్‌టిసి కార్మికులకు శుభవార్త. ఈ సంస్థలో పనిచేస్తున్న 60వేల మంది ఉద్యోగ, కార్మికులకు 2016-17 సంవత్సరానికి గాను రూ.10 లక్షలు ప్రమాద బీమా ప్రవేశపెడుతున్నామని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ నండూరి సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు.

04/01/2016 - 03:46

ముంబయి, మార్చి 31: ఈ ఆర్థిక సంవత్సరంలో బిఎస్‌ఇ సెనె్సక్స్ గత ఏడాదితో పోలిస్తే 9.36 శాతం పతనమైంది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో సెనె్సక్స్ ఇంతగా పతనమవడం ఇదే మొదటిసారి. ఫలితంగా మదుపరులు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం లాంటి పరిణామాలు ఈ ఏడాది దేశీయ మార్కెట్లను దెబ్బ తీశాయి.

Pages