S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/22/2016 - 04:21

హైదరాబాద్: తక్కువ రుణాలకు కూడా డిపాజిట్లు, ష్యూరిటీలు అడిగి రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను అవస్థలకు గురిచేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు. సోమవారం సచివాలయం లో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష నుండి మూడు లక్షల లోపు రుణాలకు డిపాజిట్లు అంటూ ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.

03/22/2016 - 04:20

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో రుణాల వసూళ్లపై బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఇక్కడ సమీక్ష నిర్వహించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిల వ్యవహారాన్ని ఆరా తీసింది.

03/22/2016 - 04:19

హైదరాబాద్: దళితుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. శాసన మండలిలో 70 వ నిబంధన కింద సోమవారం సభ్యులు బాబూ రాజేంద్రప్రసాద్ తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానం చెబుతూ, వచ్చే 2016-17 ఆర్థిక సంవత్సరంలో సాంఘిక సంక్షేమానికి 3,236 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు.

03/22/2016 - 04:17

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేల నుండి 25 వేల ఉద్యోగాల భర్తీని చేపట్టాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఉపాధి కల్పన, కార్మిక మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనమండలిలో సోమవారం 311 నిబంధన కింద ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన నోటీసుకు మంత్రి సమాధానం చెబుతూ, రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటోందన్నారు.

03/22/2016 - 04:16

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ఒకే ఒక ప్రశ్నతో ముగిసింది. సాధారణంగా రోజూ పది ప్రశ్నలను చేపడతారు. మండలి సమావేశం కాగానే చైర్మన్ ఎ చక్రపాణి అజెండా ప్రకారం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నలు వేసిన నలుగురు సభ్యులు, సమాధానం ఇవ్వాల్సిన ఐదుగురు మంత్రులు సభకు హాజరు కాకపోవడంతో తొమ్మిది ప్రశ్నలను వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.

03/22/2016 - 04:14

హైదరాబాద్: హైదరాబాద్‌లో సరళ్ రోజ్‌గార్ పథకంలో భాగంగా సోమవారం టెక్ మహీంద్ర మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించింది. ఈ మెగా జాబ్ ఫెయిర్‌లో ఆటోమోటివ్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఎఫ్‌ఎంసిడి రంగాల నుంచి 15 సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ఉద్యోగాల కోసం సుమారు 300 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

03/22/2016 - 04:12

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్ వ్యాప్తంగా విస్తరించడంతో సూచీలు లాభాల్లో కదలాడాయి.

03/22/2016 - 03:59

న్యూఢిల్లీ: కీలక వడ్డీరేట్లను తగ్గించాలంటూ వస్తున్న డిమాండ్లను రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పరిశీలించే అవకాశాలున్నాయని, దీంతో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు పావు శాతం చొప్పున దిగివచ్చే వీలుందని డ్యూషే బ్యాంక్ సోమవారం ఓ నివేదికలో అంచనా వేసింది.

03/22/2016 - 03:59

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను నిల్వచేసి, వాటిని తగిన ధర లభించినప్పుడు అమ్ముకునేలా రూ. 1,024 కోట్ల వ్యయంతో 335 గోడౌన్లను నిర్మించనున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

03/21/2016 - 06:00

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష ప్రభావం కూడా ట్రేడింగ్‌పై కనిపిస్తుందని పేర్కొంటున్నారు.

Pages