S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/15/2016 - 02:07

హైదరాబాద్, ఫిబ్రవరి 14: నైపుణ్యం, లక్ష్యసాధన సంకల్పం, నూతన ఆవిష్కరణల సామర్థ్యం ఉన్నప్పుడే ఏ సంస్థ అయినా విజయపథంలో దూసుకెళ్లగలదని పలువురు వాణిజ్యరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఇక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘్భరత్‌లో స్టార్టప్ సంస్థలకున్న అవకాశాలు-నిలదొక్కుకునే సమర్ధత’ అంశంపై సదస్సు జరిగింది.

02/15/2016 - 02:06

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నెల 23న నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ప్రతిపాదనలను పరిశీలించనుంది. ఇందులో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సెజ్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ అప్రూవల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలు పరిశీలనకు రానున్నాయి.

02/14/2016 - 05:28

న్యూఢిల్లీ: బంగారం ధరలు శనివారం ఒక్కరోజే భారీగా పడిపోయాయి. 21 నెలల గరిష్ఠ స్థాయిని కోల్పోతూ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 600 రూపాయలు దిగజారి 29,050 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా 28,900 రూపాయలకు దిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాలు, దేశీయంగా జ్యుయెల్లర్ల నుంచి తగ్గిన డిమాండ్ ధరల పతనానికి దారితీసింది.

02/14/2016 - 05:25

న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవాన్ని (వాలెంటైన్ డే) చాలామంది రొమాంటిక్ డిన్నర్లు, హెలికాప్టర్ రైడ్‌లతోనే జరుపుకోవాలని భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యనే తమ బడ్జెట్ ఉండాలని చాలామంది అనుకుంటున్నట్లు కూడా ఆ సర్వే పేర్కొంది.

02/14/2016 - 05:04

నెల్లూరు: రైతుల ఆశలను, మార్కెట్‌లోని అవకాశాన్ని అందిపుచ్చుకుని అక్రమంగా పుట్టుకొచ్చిన కొన్ని హేచరీలు నకిలీ సీడ్‌తో ఆక్వా రైతులను నిలువునా ముంచాయి. నాలుగేళ్లుగా సిరులు కురిపిస్తున్న వెనామీ రొయ్యను నమ్ముకుని ఎందరో ఔత్సాహికులు ఆక్వా సాగుకు ముందుకు వచ్చారు. అయతే మార్కెట్‌లో ఉన్న గిరాకీని ఆసరా చేసుకున్న కొంతమంది వ్యాపారులు వారికి నకిలీ సీడ్ అంటగట్టారు.

02/14/2016 - 05:02

గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీకి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా అవార్డును ఎన్టీపీసీ ఇడి అందుకున్నట్లు స్థానిక అధికార ప్రతినిధి తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

02/14/2016 - 05:02

ముంబయి: భారత్‌ను ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రమోషన్ సెషనైన ‘మేక్ ఇన్ ఇండియా వీక్’ తొలిరోజే 22,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి.

02/14/2016 - 05:01

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం భారీ స్థాయిలో నష్టపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,630.85 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 508.15 పాయింట్లు క్షీణించాయి. అంతకుముందు వారం కూడా సూచీలు పతనమవగా, ఈ రెండు వారాల్లో సెనె్సక్స్ 1,884.57 పాయింట్లు, నిఫ్టీ 582.60 పాయింట్లు దిగజారాయి.

02/14/2016 - 04:59

చెన్నై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్.. వాలెంటైన్ డే (ప్రేమికుల దినోత్సవం) వేడుకల సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ ఎల్‌వైఎఫ్-4జి మొబైల్స్‌ను పరిచయం చేసింది.

02/13/2016 - 03:09

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: స్టాక్, కరెన్సీ మార్కెట్లు క్రమేణా డీలా పడుతున్న నేపథ్యంలో ఆందోళన అక్కర్లేదంటూ మదుపరులకు ధైర్యం చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం ఉంచండి అంటూ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని అన్నారు.

Pages