S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/06/2016 - 03:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్‌డీల్ కాంట్రాక్టును ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కోల్పోయారు. దేశంలో అసహనంపై ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ను కొనసాగించేందుకు స్నాప్‌డీల్ విముఖత చూపింది. ఖాన్ చేసిన వ్యాఖ్యలతో స్నాప్‌డీల్ కూడా చిక్కుల్లో పడినది తెలిసిందే.

02/06/2016 - 03:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: తమ అనుబంధ సంస్థ మహానంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎమ్‌సిఎల్) ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను 2,758.45 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించినట్లు శుక్రవారం ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.

02/06/2016 - 03:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కావచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్) శుక్రవారం ఓ నివేదికలో అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లోనూ ఇదే స్థాయిలో జిడిపి వృద్ధిరేటు ఉంటుందని పేర్కొంది.

02/06/2016 - 03:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ శుక్రవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో 6.6 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఈసారి మరొక శాతం పెరగొచ్చని ఇండియా రేటింగ్స్ చెప్పింది.

02/06/2016 - 03:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా శనివారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేకపోతున్నది తెలిసిందే.

02/06/2016 - 03:00

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మారిటైమ్ ఎగ్జిబిషన్ దేశ స్వావలంబనను ప్రతిబింబిస్తోంది. దేశ నౌకాదళ అవసరాలను తీర్చేదిశలో జరుగుతున్న కృషికి అద్దం పడుతోంది.

02/06/2016 - 02:59

హైదరాబాద్, ఫిబ్రవరి 5: సింగరేణివ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించిన ‘సింగరేణి ఆణిముత్యాలు-ఉద్యోగమేళా’లో ఎంపికైన వారంతా తమకు నిర్దేశించిన తేదీల్లో ఆయా సంస్థలలో వెంటనే చేరాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ మేళాలో పాల్గొన్న 7559 మంది యువత వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపింది.

02/06/2016 - 02:58

ముంబయి, ఫిబ్రవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు లాభాలను పొందగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 278.54 పాయింట్లు పుంజుకుని 24,616.97 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 85.10 పాయింట్లు అందిపుచ్చుకుని 7,489.10 వద్ద నిలిచింది.

02/06/2016 - 02:57

హైదరాబాద్, ఫిబ్రవరి 5: వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లోని హౌసింగ్ ప్రాజెక్టుల్లో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పురవంకర ప్రాజెక్టు సంస్థ ప్రకటించింది. తమ సంస్థ ప్రొవిడెంట్ హౌసింగ్ లిమిటెడ్ కింద 2,400 ఇండ్లను నిర్మించనున్నట్లు సంస్థ ఎండి ఆశిష్ పురవంకర శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. తొలిదశలో భాగంగా కెన్‌వర్త్ బై ప్రొవిడెంట్ పేరిట హౌసింగ్ కాలనీని ప్రారంభించినట్లు చెప్పారు.

02/06/2016 - 02:56

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ప్రపంచ దేశాలకు ధీటుగా, భారత నౌకాదళాన్ని శాస్త్ర, సాంకేతికంగా విస్తరించడానికి కేం ద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. భవిష్యత్‌లో కఠినమైన సవాళ్ళను అవలీలగా ఛేదించేందుకు నేవీ చేపట్టే వివిధ ఆపరేషన్స్‌ను మరింత మెరుగ్గా, సమర్థవంతంగా ఉండేలా డిజిటల్ నేవీగా రూపకల్పన చేయడానికి నిర్ణయించింది. ఆధునిక శాస్త్ర, సాంకేతికను అందిపుచ్చుకున్న భారత నావికా దళం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది.

Pages