-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, నేవీ విన్యాసాలు, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ను వీక్షించి, ఆనందించే అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. ఆర్కే బీచ్లో లక్షన్నర మంది విన్యాసాలు చూసేందుకు ఏర్పాట్లు చేసినట్టు నేవీ, రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. 7న విన్యాసాలు వీక్షించేందుకు ఇప్పటికే లక్షన్నర పాస్లు జారీ చేశారు.
కొత్తగూడెం, ఫిబ్రవరి 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2015-16లో సింగరేణి సంస్థ అంతర్గతంగా నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 60.03 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించా లని నిర్దేశించుకుంది. ప్రభుత్వపరంగా 55 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి లక్ష్యం. అయతే జనవరి మాసం ముగిసేనాటికి గడచిన 10 మాసాల్లో 100 శాతం ఉత్పాదక రేటును సంస్థ నమోదు చేసుకుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ రంగంలో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు చైనాకు చెందిన అంతర్జాతీయ సంస్థ జెడ్టిఇ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి జెడ్టిఇ-ఎపి ప్రభుత్వాల మధ్య సోమవారం రాత్రి అంగీకారం (లెటర్ ఆఫ్ ఇంటెంట్-ఎల్ఓఐ) కుదిరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 140 స్మార్ట్ సిటీల్లో జెడ్టిఇ భాగస్వామిగా ఉంది.
న్యూఢిల్లీ, జనవరి 31: ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్న సంకేతాలుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మంగళవారం జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 31: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్రవ్యసమీక్ష, కార్పొరేట్, ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక ఫలితాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 31: విదేశీ మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్లకు క్రమేణా దూరమవుతున్నారా? తమ పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లే కాస్తో కూస్తో ఉత్తమమని భావిస్తున్నారా? జనవరి నెలలో విదేశీ మదుపరుల తీరును చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయ మరి. జనవరిలో రుణ మార్కెట్లలోకి 2,313 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్పిఐ)లు..
ఒంగోలు, జనవరి 31: ప్రకాశం జిల్లా ప్రకృతి ప్రకోపానికి గురవుతూనే ఉంది. అతివృష్టి లేక అనావృష్టి కారణంగా రైతులు అన్నివిధాలా ఆర్థికంగా క్రుంగిపోతున్న పరిస్థితి. వర్షాభావ పరిస్థితుల మధ్య పొగాకు, మిర్చి సాగు ప్రమాదంలో పడింది. పంటలకు సరిపడా నీరు దొరక్క నానా కష్టాలు పడుతున్న రైతన్నను తెగుళ్లు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయ. ముఖ్యంగా పొగాకు సాగును నీటి కొరత వేధిస్తోంది.
న్యూఢిల్లీ, జనవరి 30: రాయితీలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే రాయితీలనేవి అవసరంగా భావించాలేతప్ప, వాటిని ఆదాయ మార్గాలుగా చూడకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 30: రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరానికి త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో శనివారం కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్పై రూపాయి, డీజిల్పై రూపాయి 50 పైసలు పెంచింది.
ఈ నెలలో ఇలా పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కాగా, తాజా పెంపుతో ప్రభుత్వ ఖజానాకు అదనంగా 3,200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది.
నల్లగొండ, జనవరి 30: నల్లగొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని మిల్లర్ల నుండి ప్రభుత్వం సకాలంలో రాబట్టలేకపోతోంది. కస్టమ్ మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ముందుగా బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు ప్రభుత్వానికి మాత్రం సిఎంఆర్ బియ్యం ఆలస్యంగా అందించడం రివాజుగా మారింది.