S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

08/16/2019 - 22:06

కేవలం తాత్కాలిక ప్రాతిపదికన రాజ్యాంగంలో ప్రవేశ పెట్టిన ఆర్టికల్ 370ని ఏడు దశాబ్దాలపాటు కొనసాగించిన అనంతరం, ఇప్పుడు రద్దు చేస్తే దే శంలో అనూహ్యంగా మద్దతు లభిస్తున్నది. వామపక్షాలను మినహాయించి దాదాపు అన్ని పార్టీలలో ఈ చర్య పట్ల మద్దతు వ్యక్తం అవుతున్నది. చివరకు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు సహితం రాజ్యాంగంలో ఈ అధికరణ కొనసాగాలని పేర్కొన కపోవడం గమనార్హం.

08/15/2019 - 05:51

మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా జాతీయవాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ ‘రద్దు’ను వ్యతిరేకించి, జాతీయవాదుల దృష్టిలో దోషిగా నిలబడింది. కాంగ్రెస్ వలే మరికొన్ని పార్టీలు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినా వాటి ప్రభావం తక్కువ.

08/14/2019 - 05:13

అయోధ్యలో చిరకాలంగా కొనసాగుతున్న ‘రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాని’కి భరతవాక్యం పలికేందుకు సర్వోన్నత న్యాయస్థానం సిద్ధపడింది. వచ్చే నవంబర్ 17న ఈ వివాదంపై తుది తీర్పు ఇస్తామని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృతస్థాయి సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 1,480 గజాల స్థలం కోసం శతాబ్దాలుగా ‘మందిర్-మసీదు వివాదం’ కొనసాగుతోంది. ఈ వివాదాస్పద స్థలానికి సంబంధించి విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

08/10/2019 - 22:55

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలబడుతోంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఇటీవల జీఎస్‌ఎల్‌వీ మార్క్-3-ఎం-1 వాహక నౌక దూసుకెళ్ళగా.. చంద్రయాన్-2 కల సాకారమవుతుండగా కోట్లాది భారతీయుల గుండెలు ఉప్పొంగాయి. దేశ ప్రజలంతా గర్వంతో కరతాళ ధ్వనులు చేశారు.

08/09/2019 - 22:48

నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తీసు కున్న సాహసోపేతమైన చర్యల కారణంగా చట్టపరంగా జమ్మూ కశ్మీర్ ను జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు అందుకు ప్రధాన అడ్డంకులుగా ఉంటున్న రాజ్యాంగ అధికారణలకు అనూహ్యమైన రీతిలో సరికొత్త భాష్యం చెప్పడం ద్వారా ఎవరూ ఊహించనంత సులభంగా వాటి పరిధిని తొలగించి సంచలనాత్మకమైన మార్పు తీసుకు రాగలిగారు.

08/07/2019 - 23:10

మన దేశచరిత్రలో మూడు సంఘటనలు ప్రధానమైనవి. ఒకటి స్వాతంత్య్రం వచ్చిన రోజు- 1947 ఆగస్టు 15. రెండవది 1950 జనవరి 26- గణతంత్ర దినోత్సవం. మూడవది 2019 ఆగస్టు 5వ తేదీ- జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణం రద్దయిన రోజు. కశ్మీర్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని కల్పించే ఈ అధికరణం దేశం 72 ఏళ్ల పాటు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

08/07/2019 - 02:16

సమాచార హక్కు చట్టానికి సవరణల రూపంలో తూట్లుపొడిచిన కేంద్రం అదే సమయంలో మరో కఠిన చట్టాన్ని తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఏదైనా చట్టం చేసినపుడు విపక్షాల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. కానీ కేంద్రం ‘పోక్సో’ చట్టానికి సవరణలు చేసినపుడు ఒకరిద్దరు మినహా మిగిలిన సభ్యులంతా ఆమోదం తెలపడం చూ స్తుంటే- ఆ చట్టంలో సవరణల అవసరాన్నీ ఆవశ్యకతనూ తెలుపుతూనే ఉంది.

08/04/2019 - 02:05

నేడు ‘ఫ్రెండ్‌షిప్ డే’
*
ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం- స్నేహం
యవ్వన దశలో కలిగే మానసిక ఒత్తిళ్లకు పరిష్కారం- స్నేహం
నేనున్నానే స్నేహితుడి మాటతో ప్రపంచానే్న జయించవచ్చు
స్నేహంతో మానసిక సమస్యలు మటుమాయం
అల్లరితో ఆనందం పెనవేసుకున్నదే- స్నేహబంధం

08/02/2019 - 22:11

కుటుంబ వారసత్వంగా వస్తున్న కాఫీ తోటలలో కాలం గడపకుండా ఉన్నత చదువులకు వెళ్లి, స్టాక్ మార్కెట్ వ్యాపార రహస్యాలను ఛేదించి, టీ ని ఎక్కువగా ప్రేమించే భారత్‌లో కాఫీకి ఒక హోదా కల్పించి, అంతర్జాతీయ మార్కెట్ సృష్టించి, బహు ముఖంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కార్పొరేట్ రంగంలో ఆదర్శంగా నిలిచిన వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం.

08/01/2019 - 04:54

కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓటమి చెందినా, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సంక్షోభం పూర్తిగా సమసిపోలేదు. కర్నాటక అసెంబ్లీలో మొత్తం సీట్లు 229కాగా, బీజేపీకి 105, జేడీఎస్‌కు 37, కాంగ్రెస్‌కు 78 సీట్లు, రెండు చోట్ల ఇండిపెండెంట్లు, బీఎస్పీకి ఒక సీటు ఉన్నాయి. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లను సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది.

Pages