S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

07/08/2018 - 01:33

ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా భావించిన విభిన్న వ్యక్తిత్వం గల నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సుమారుగా ఐదున్నరేళ్ల పదవీకాలంలో అన్ని వర్గాల సమున్నతికి పాటుపడినందునే ఆయన అందరివాడుగా నిలిచారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఆనాటి రాష్ట్రంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అభివృద్ధి కుంటుపడింది.. కరువు తాండవిస్తోంది..

07/07/2018 - 00:47

ఆధ్యాత్మిక సాధనను వ్యాపారంగా మార్చుతున్న అనేకమందిని నేడు మనచుట్టూ చూస్తున్నాము. అయితే కీర్తి ప్రతిష్టలు, సంపదల పట్ల ఎటువంటి ఆసక్తి కనబరచకుండా, ఆధ్యాత్మిక వికాసం పొందడానికి తాత్విక చింతనతో అతి సాధారణ జీవితం గడిపి, మహోన్నతమైన సాధన చేసిన ఎందరో కర్మజీవులు మనదేశానికి వనె్న తెచ్చారు. వారిలో చాలామంది నేడు చరిత్ర మరుగున పడిపోయారు.

07/05/2018 - 01:01

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, బలహీన వర్గాల సంక్షేమానికి, ఆదాయ వనరుల పరిపుష్టికి నిత్యం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేంద్రం లో, రాష్ట్రాల్లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నా పన్నుల విధానానికి ప్రాధాన్యత ఉంటుంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పరోక్ష పన్నుల సంస్కరణలను అమలు చేసిన ఘనత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది.

07/03/2018 - 23:39

న్యాయవ్యవస్థ అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, సహాయక సిబ్బంది కొరత, న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కానందున కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అన్ని కోర్టుల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం అనేక వ్యూహాలను అనుసరిస్తోంది.

07/02/2018 - 23:36

ఎవరూ పట్టించుకోరు.. ఈ దేశం గతి ఇంతే’ అన్న ఆందోళన నేడు ప్రజల్లో పెరుగుతోంది. వీరికి రాజకీయ నాయకులు సహకరించటం లేదు. కొందరు ముఖ్యమంత్రులే దేశద్రోహులైతే ఇక దేశాన్ని ఎవరు కాపాడగలరు? ‘ఎర్ర గులాబీ’ ధరించిన నేత అలనాడు చేసిన తప్పుకు రక్తం ఏరులై పారింది. కుంకుమ పండే భూస్వర్గంలో కల్లోలాశ్రువులు.. షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, ముఫ్తీ మహమ్మద్ సరుూద్, మెహబూబా ముఫ్తీ..

06/30/2018 - 23:33

మీడియాలో కొన్ని వార్తలు మాత్రమే వస్తాయి. మరికొన్ని తెరవెనుక నడిచే ఘటనలకు సంబంధించినవి. జమ్మూ కశ్మీర్‌లో మన సైనిక వ్యూహాలకు సంబంధించిన వార్తలు ఏ రోజుకారోజు పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’కి ఎలా చేరుతున్నాయి? ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఆరా తీయగా భయంకరమైన సంగతి తెలిసింది. కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మెహబూబా ముఫ్తీ స్వయంగా మన సైనికుల కదలికలపై సమాచారాన్ని పాక్‌కు ఎప్పటికప్పుడు చేరవేసేవారట!

06/29/2018 - 23:28

ఎన్ని బలహీనతలు ఉన్నా, వ్యవస్థాగతమైన లోపాలున్నా, ఆశించిన విధంగా ప్రజలకు సామా జిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని అందిం చలేకపోతున్నా- ప్రపంచంలో అత్యుత్తమ పాలనా వ్యవ స్థగా ప్రజాస్వామ్యాన్ని పేర్కొంటుంటాము.

06/28/2018 - 00:26

చట్టసభలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిపించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ‘జమిలి ఎన్నికలం’టే అన్ని శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే. 16వ లోక్‌సభకు కాలపరిమితి వచ్చే ఏడాది మే నెల వరకు ఉం ది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను లోక్‌సభతో పాటు రద్దు చేసి ఒకేసారి ఎన్నికలు జరిపించే సాహసం ఏ పార్టీ కూడా చేయలేదు.

06/26/2018 - 23:18

‘ప్రపంచ వాణిజ్య చట్టం’ పేరుతో మార్కెట్ల సరళిని మార్చే కొత్త చట్టంలోని నిబంధనలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందికరమే. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు ఈ చట్టంలోని నిబంధనలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పోటీ పడుతున్నాయి. అమెరికా, చైనాలు కొత్త చట్టం బూచితో మిగిలిన దేశాలపై వాణిజ్య ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాయి.

06/24/2018 - 00:55

సంఖ్యాపరంగా ఉన్నత స్థాయి విద్యాసంస్థలు పె రిగినా, వాటి నిర్వహణ తీరుపై పాలకులు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలే ప్రబల నిదర్శనం. తెలంగాణలో 11 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 3 కేం ద్రీయ విశ్వవిద్యాలయాలు, 2 జాతీయస్థాయి విద్యా సంస్థలు, ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటీ, 1 డీమ్డ్ విశ్వవిద్యాలయం కలిపి మొత్తం 17 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

Pages