S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

06/22/2018 - 23:33

భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మాయని మచ్చ ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ప్రకటించిన అంతర్గత అత్యవసర పరిస్థితి. ప్రజల ప్రాథ మిక హక్కులను హరిస్తూ, తన అధికారాన్ని ప్రశ్నించే వారిని జైళ్లకు పంపి, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా నిరంకుశ వ్యవస్థను ఆమె ఏర్పాటు చేశారు. అటువంటి పరిస్థితులకు శాశ్వత ప్రాతిపదిక కల్పించడానికి ఆమె 42వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు.

06/20/2018 - 23:56

విభజన’ అనంతరం గత నాలుగేళ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ఆలోచనా విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. విభజనకు ముందున్న ద్వేషభావాలు ఇప్పుడు లేవు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు జనం రావడం తగ్గలేదు. తెలంగాణ నుంచి తిరుపతి, అన్నవరం పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి తగ్గలేదు. రెండు రాష్ట్రాల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ గాయపడి మెల్లమెల్లగా కోలుకుంటోంది.

06/20/2018 - 00:09

వాయు, జల, శబ్ద కాలుష్యాలు విషమించినా, అంతర్జాతీయ ఒడంబడికల పుణ్యమాని ఇంతకాలం సురక్షితంగా ఉన్న భారతీయ కోస్తా తీరం పరిరక్షణ, అభివృద్ధికి కేంద్రం కొత్త ప్రతిపాదనలను చేస్తోంది. మన దేశంలో సుమారు 7,500 కిలోమీటర్ల మేర సమద్ర తీరం ఉంది. ఇందులో 5,420 కిలోమీటర్లు ద్వీపకల్ప భారతదేశం. తీరప్రాంతంలో దాదాపు 25 కోట్ల మంది (దేశ జనాభాలో 14 శాతం మంది) జీవిస్తున్నారు.

06/17/2018 - 01:43

రంజాన్ పవిత్రమాసం! ఉపవాస దీక్షలు- ఇఫ్తార్ విందులు- నేతల సందడి- ఆ సమయంలో జీహాదీ ఉగ్రవాదులు తెగబడ్డారు. ‘రైజింగ్ కాశ్మీర్’ సంపాదకుడు షుజత్ బుఖారీ రంజాన్ పవిత్ర మాసంలో ‘రోజా’ (ఉపవాసం) పాటించి గురువారం రాత్రి ఇఫ్తార్ ముగించుకున్నాడు. అప్పుడు ఉగ్రవాదులు ఆయనను అతి దగ్గరగా కాల్చి చంపారు. ఈయన జమ్మూ కాశ్మీర్ మంత్రి బాషత్ బుఖారీకి సోదరుడు.

06/15/2018 - 23:40

ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తమ తమ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీపై కాలుదువవుతూ ఉంటారు. కానీ, ఢిల్లీలో ఆ పార్టీతో సయోధ్య కోసం సిద్దపడుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటువంటి అనుమానాలు ఆ ఇద్దరినీ ఇరకాటంలో పడవేస్తున్నాయి. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలో ప్రభుత్వం ఏర్పడితే- ఆ పార్టీకి దూరంగా ఉండలేమని చంద్రులిద్దరూ ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

06/14/2018 - 01:43

రాజ్యాంగాన్ని ధిక్కరించే రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులను జనజీవన స్రవంతిలోకి తేవాలంటే చర్చలకు మించిన ప్రక్రియ మరొకటి లేదు. చర్చల వల్ల సమస్యల మూలాల గురించి ఆలోచించేందుకు అవకాశం లభిస్తుంది. బద్ధశత్రువులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా నియంత కిమ్ మధ్య తాజాగా సింగపూర్‌లో చర్చలు జరగంగా లేనిది- ‘దారి తప్పిన’ మన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఇక్కడి ప్రభుత్వాలకు ఉన్న అడ్డంకులేమిటి?

06/12/2018 - 23:38

ఎండలు పెరిగిపోయాయని ఒక రోజు, వరదలు కుమ్మరిస్తున్నాయని మరో రోజు, విపరీతమైన చలి అని ఇంకో రోజు.. సమోష్ణ శీతల మండలంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు, వరదలు , చలి.. ఇదంతా ఒక ఎత్తయితే మరో పక్క- భరించలేని శబ్ద,నీటి,వాయు కాలుష్యాలను రోజూ చూస్తూనే ఉన్నా ఎవరికీ పట్టని వైనం.

06/11/2018 - 23:41

మావోయిస్టుల్లో ‘అసహనం’ తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. సిద్ధాంతాల ఆధారంగానే తాము పోరాటాలు చేస్తున్నామని చెప్పుకునే మావోలు ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారు. చాలాకాలంగా పాలకుల అసహనం గురించి మావోలు భూనబోనాంతరాలు దద్దరిల్లేలా ప్రచారం చేశారు. కాని ఎవరు అసహనంతో రగిలిపోతున్నారో మహారాష్టల్రో తాజాగా బహిర్గతమైంది. మావోల గత చరిత్ర చూస్తే కుట్రలు వారి నైజమని తెలుస్తుంది.

06/10/2018 - 00:24

దాతృత్వ నినాదం మరోసారి మార్మోగింది. తాజా గా మాజీ ఎంపీ నందన్ నీలేకని, ఆయన భార్య రోహిణీ నీలేకని తమ సంపదలో సగభాగాన్ని ‘గివింగ్ ప్లెడ్జ్’కు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. వీరితోపాటు భారత సంతతికి చెందిన మరో ముగ్గురు కుబేరులు ఇదే మాదిరి తమ సమ్మతిని ప్రకటించారు. ఇది ఈనాటి కొందరు సంపన్నుల ఆలోచనా సరళికి అద్దం పడుతోంది.

06/09/2018 - 00:04

చండీగఢ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు సరిహద్దు భద్రతా దళం మాజీ డిఐజి కేసీ పథి జమ్మూ కాశ్మీర్ మాజీ డిఎస్పీ మొహమ్మద్ అష్రాఫ్ మీర్ సహా ఐదు గురికి ఓ సెక్స్ కుంభకోణంలో పదేళ్ళపాటు జైలు శిక్ష విధించింది. 2006లో జమ్మూ కాశ్మీర్‌లో ఈ సెక్స్ కుంభకోణం సంచలనం సృష్టించింది. మైనర్ బాలికలను ప్రలోభాలకు గురిచేసి పడుపు వృత్తిలోకి దించుతున్నట్టు రెండు సీడీలు పోలీస్‌లకు చిక్కడంతో ఈ కుంభకోణం బైట పడింది.

Pages