S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/30/2018 - 00:19

కాకినాడ శ్రీపీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద ఇటీవల మాట్లాడుతూ ప్రముఖ చలనచిత్ర నటుడు కమలహాసన్ దేశద్రోహి అన్నారు. హిందువులు ఉగ్రవాదులు అంటూ కమలహాసన్ కొద్ది రోజుల క్రితం చెన్నైలో వ్యాఖ్యానించాడు. ఆ సందర్భంగా శ్రీపీఠం అధిపతి ఇలా అన్నారు. ఈ ప్రకటనలు చూశాక ఉగ్రవాదం అంటే ఏమిటి? నిజంగా హిందువులు ఉగ్రవాదులా? అని నిష్పాక్షికంగా ఆలోచించవలసిన అవసరం ఉంది.

01/29/2018 - 01:20

అప్పటిదాకా ఆ నదిని ఈదుకుంటూ దాటేవారు కొందరైతే, ఈత రానివారిని నాటు తెప్పలపై చేరవేసేవారు మరికొందరు. అభివృద్ధి అనే ఓ ఎజెండాకింద అక్కడ ఓ బ్రిడ్జిని నిర్మించారు. దానికై అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ ఋణానికి, అక్కడి ఉత్పత్తి శక్తులకు, సాధనాలకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఇరుపక్కల జనాలు పాలుపంచుకోలేదు. శ్రమ చేయలేదు. ఊహించని కల మాత్రం సాకారమైంది.

01/28/2018 - 00:38

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మరో నాలుగు నెలల్లో నాలుగేళ్లు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరు అయినప్పటికీ, ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా తమ గత అనుబంధాలను మర్చిపోరు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు, వారి స్వభావం, పార్టీల భవిష్యత్తు, రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల గురించి ఎల్లప్పుడూ చర్చించుకుంటారు.

01/27/2018 - 00:08

ఎన్నికలలో అపూర్వ విజయాలు సాధించి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వారికి గెలిచిన ప్రజాప్రతినిధులను సంతృప్తిపరచి, వారు తమతోనే ఉండేటట్లుచేసుకోవడం నేడు క్లిష్టతరం అవుతున్నది. పార్టీ ఫిరాయింపు చట్టం ఉన్నప్పటికీ అమలులో అది నిర్వీర్యమైపోతున్నది. ఢిల్లీలో కూడా అదే జరిగింది.

01/26/2018 - 01:45

"We the people of India having solemnly resolved to constitute India into a Sovereign Socialist Secular Democratic Republic and secure to all its citizens"

01/24/2018 - 22:18

మన రాజ్యంగ వ్యవస్థ చరిత్ర బ్రిటన్ దురాక్రమణదారులు రూపొందించిన ‘రౌలట్’ రెగ్యులేటరీ’ చట్టాలతో మొదలౌతోందన్న కృత్రిమ పాఠాలను మన విద్యాలయంలో బోధించడం కొనసాగుతున్న భావదాస్యానికి సాక్ష్యం! ఇంటిలో తిష్టవేసి ఇంటిని కొల్లగొట్టిన ‘దొంగలు’ ప్రచారం చేసిన అబద్ధాలను దొంగలు వెళ్లిపోయిన తరువాత కూడా ఇంటిలోనివారు నమ్ముతుండడం ఈ భావదాస్యానికి చిహ్నం!

01/24/2018 - 01:19

అనేక మలుపులు తర్వాత జస్టిస్ లోయ అనుమానాస్పద మరణంపై సుప్రీంకోర్టు పునః విచారణ ప్రారంభించింది. దేశంలో దిగ్గజాలైన న్యాయవాదులు సుప్రీంకోర్టు హాలులో వాద ప్రతివాదుల తరఫున హాజరయ్యారు. హరీష్ సాల్వే, దుష్యంత్ దవే, ముకుల్ రోహత్గీ, ఇందిరాజైసింగ్ తమ వాదనలు ప్రారంభించారు. బాంబే లాయర్ల సంఘం తరఫున దవే హాజరయ్యారు.

01/23/2018 - 00:44

చరిత్రలో చాలా ప్రశ్నలకు సమాధానం దొరకటంలేదు. అందుకు కారణం మన అధ్యయన లోపం కాదు. చరిత్ర నిర్మాణమే అలా జరిగింది. ఇంతకూ చరిత్ర అంటే ఏమిటి? కొందరు సాహసోపేతమైన వ్యక్తులు కాలంపై అద్దిన పాదముద్రలు. ఈ సాహసవీరులు సత్పురుషులు కావాలనే సిద్ధాంతం ఏమీ లేదు. కాని రామచరిత్ర నిర్మాతలవుతారు. అయోధ్యలో రాముడు చరిత్రను నిర్మించినట్లే లంకలో రావణుడు- ఆధునిక రావణుడు వేలుపిళ్లై ప్రభాకరన్ చరిత్రను నిర్మించారు.

01/22/2018 - 00:58

చారిత్రక సత్యాలకు శాస్ర్తియత తులనాత్మకంగా చెప్పడం ఎంత కష్టమో, అవి పచ్చి అబద్ధాలని చెప్పడం అంతకన్నా కష్టం! సైన్సు ఎంతగా పురోగతిని సాధించినా, మానవాళి కల్యాణానికి ఎంత దోహదపడినా, నాడు నేడు మతమే మారణకాండకు కారణమవుతున్నది. పాలకపక్షాలకు ఇదో వజ్రాయుధంలా పనిచేస్తున్నది. రాజ్యాంగం పీఠికలోని మతరహిత (secular) విషయంగా కాంగ్రెసు నర్మగర్భితంగా వ్యవహరిస్తే, బిజెపి మాటల యుద్ధానే్న సాగిస్తున్నది.

01/21/2018 - 00:30

గంగిరెద్దులు, హరిదాసులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, మృష్టాన్న భోజనాలు, బోగి మంటలు, పేక, బ్రాకెట్ ఆటలు, కొత్త సినిమాల విడుదల, అల్లుళ్లు బంధువుల రాకతో సంక్రాంతి ఈ యేడు కూడా చాలా భేషుగ్గా జరిగి ఎక్కడి వాళ్లు అక్కడికి తిరుగుముఖం పట్టారు. మరి రైతన్నల మాటేమిటి? ఏమంటాడు డూడూ బసవన్న?

Pages