S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

12/01/2019 - 22:20

జాతీయ స్థాయిలో చూస్తే భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. వరసగా రెండుసార్లు (2014, 2019) లోక్‌సభ ఎన్నికల్లో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో ప్రజా మోదం పొందింది. సంఖ్యా బలాన్ని గణనీయంగా పెంచుకుంది.ఒకప్పుడు కేవలం రెండు స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ ఇప్పడు 303 స్థానాలకు చేరుకుంది.

12/01/2019 - 04:47

భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే నిరంకుశమైన పాలనకు వ్యతిరేకంగా, ప్రజా స్వామ్య పునరుద్ధరణ కోసం ఎమర్జెన్సీ సమ యంలో జరిగిన పోరాటం అతిపెద్ద ప్రజా ఉద్యమం. ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేసి, పత్రికా స్వాతంత్య్రాన్ని హరించివేసి, ప్రతిపక్ష నాయకులను జైళ్లకు పరిమితం చేసి, తన పదవిని కాపాడుకోవడం కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దారుణమైన అణచివేత పద్ధతులకు పాల్పడ్డారు.

11/29/2019 - 01:31

ట్రినిటాడ్ దేశపు పార్లమెంటు సభ్యుడు శంభునాథ కపిల్‌దేవ్ ఓసారి భారతదేశ పర్యటనకు వచ్చాడు. వాళ్ల దేశంలో హిందువులకు ఎన్నో సమస్యలు ఉండేవి. ముఖ్యంగా ట్రినిటాడ్‌లో షోడశ కర్మలు చేసుకోవాలన్నా అక్కడి హిందువులకు చర్చి మాత్రమే దిక్కవుతుందని శంభునాథ బాధపడి దానికి పరిష్కారం కోసం ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్‌గా వున్న గురూజీని కలుసుకోవాలనుకొన్నాడు.

11/28/2019 - 01:56

మహారాష్టల్రో తాజా రాజకీయాలు మహాభారత యుద్ధాన్ని తలపించాయి. అధికార దాహంతో మిత్రధర్మాన్ని తుంగలోకి తొక్కి ఆజన్మ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి శివసేన పార్టీ అధికారంలోకి వస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాటకు నిదర్శనంగా, అధికార పీఠం కోసం సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలతో కలసి వెళ్లడం తప్పేమీ కాదని శివసేన భావించింది.

11/27/2019 - 00:56

క్రికెట్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో అవసరమైన పరుగులు చేసి జట్టును గెలుపుబాట పట్టించినట్టు- భారత సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా తనదైన ముద్ర వేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ సంచలనాత్మక తీర్పులతో దేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారు. సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే బాధ్యతలు స్వీకరించారు.

11/24/2019 - 02:05

‘భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ నశించిపోయింది’- అంటూ మన దేశంలో అభ్యుదయ రచయితలు, అపర మేధావులుగా చలామణి అవుతున్నవారు తెగ గగ్గోలు పెడుతుండడం మనకు తెలిసిందే. అక్కడికి భావప్రకటన స్వేచ్ఛ అనేది తమ గుత్తసొత్తు అయినట్లు వీరు వీరంగాలు వేస్తుంటారు.

11/21/2019 - 01:29

అయోధ్యలోని ‘రామజన్మభూమి వివాదం’పై న్యా య పోరాటం ఇంకా పూర్తి కాలేదు. ఈనెల 9న సుప్రీం కోర్టు ధర్మాసనం చారిత్రక తీర్పు ఇస్తూ ఈ వివాదానికి న్యాయపరంగా ముగింపు పలికినా, రివ్యూ పిటీషన్లకు కక్షిదారులు సిద్ధమవుతున్నారు. తీర్పు వెలువడిన రోజున దేశమంతా ప్రశాంతంగా ఉంది. హిందువులు, ముస్లింలు సహా అన్నివర్గాల వారూ తీర్పును ఆహ్వానించారు. సుప్రీం తీర్పుపై కొన్ని వర్గాలకు అసంతృప్తి ఉండడంలో తప్పేమీలేదు.

11/20/2019 - 02:13

విశిష్టమైన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నెల 26వ తేదీ నాటికి 70 వసంతాలు పూర్తవుతున్నాయి. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ, విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగానికి ఉన్న ఘనకీర్తి అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఖ్యాతి చెందిన భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని , తమకు నచ్చిన నేతనే ఎన్నుకునే మహద్భాగ్యం ఈ రాజ్యాంగంతోనే వచ్చింది.

11/18/2019 - 22:00

నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా అందు బాటులోకి వస్తున్న సోషల్ మీడియా సమాచార వ్యాప్తిలో ఎంత కీలకంగా మారుతున్నదో, అంతగా దుర్వినియోగం అవుతున్నది. అసత్యాలను, అపోహలను, అతిశయాలను విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకు వెళ్లడం కోసం సోషల్ మీడియాను బలమైన సాధనంగా వాడుకోవడం నేడు అంతటా పరిపాటిగా మారింది.

11/17/2019 - 04:11

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 31న జీవో 2430 పేరున ఒక జీవో జారీ చేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని కొన్ని పత్రికలు ఎడిటోరియల్స్ రాస్తే, ఈ జీవోతో మీడియాను అణగద్రొక్కాలనుకోవడం పిచ్చి చర్య, ఇది జాతీయ సమస్య అని ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు సెలవిచ్చారు. కలాలకు సంకెళ్లా? అంటూ కొందరు జర్నలిస్టు మిత్రులు ర్యాలీలు, ధర్నాలు ఇవికాక దిల్లీ వరకు పోరాటాలు చేస్తున్నారు.

Pages