S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/26/2017 - 07:25

భారత జాతి కంటె లేదా హైందవ జాతి కంటె అమెరికా జాతి ప్రాచీనమైనదన్నది జరిగిన ప్రచారం. ఈ ప్రచారానికి ప్రాతిపదిక బ్రిటన్ దురాక్రమణదారులు మనకు ప్రసాదించి వెళ్లిన విజ్ఞాన వారసత్వం. క్రీస్తుశకం 1970వ దశకం చివరిలో జేమ్స్ అర్ల్ కార్టర్ అనే అమెరికా అధ్యక్షుడు మన దేశానికి వచ్చి వెళ్లాడు. అప్పుడు మన ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి.

01/25/2017 - 01:52

లంచం తీసుకుంటూ పట్టుబడిన నిజామాబాద్ ఇంజనీర్ సిహెచ్.వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సహజంగానే సంచలనాన్ని సృష్టించింది. రాష్ట్ర విభజన తర్వాత ఒక ఉద్యోగి ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఇదే మొదటిసారి. హైదరాబాద్ నివాసి అయిన వెంకటేశ్వర్లు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంజనీరు.

01/24/2017 - 05:37

‘అన్నీ మంచి శకునములే- కన్యాలాభ హేతువులే’ అని మాయాబజార్ సినిమాలో ఒక పాట ఉంది. ఇలాగే ఇప్పుడు మన దేశానికి ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థ కాస్త కుదుటపడుతుండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ క్రమంగా చైనా వ్యూహంలో చిక్కుకుంటోంది. ఇది ఒక రకంగా భారత్‌కు మేలు జరిగే పరిణామమే.

01/23/2017 - 00:46

‘ఏ జాతి పక్షి ఆ జాతి సమూహంతోనే ఎగురుతుంద’నేది ఓ ఆంగ్ల సామెత. బుద్ధిజీవులైన మానవులకు కూడా ఈ సూత్రీకరణే బాగా అలవడింది. ఒకప్పుడు దేశాల సౌభ్రాతృ త్వం చుట్టూ తిరిగే రాజకీయాలు, త్యాగ నిరతిని, ప్రాణ త్యా గాన్ని ఆభరణాలుగా భావించే ఈ ప్రాపంచిక రాజకీయాలు సమీకరణలను మార్చుకోవడం గత రెండు దశాబ్దాలకు పైగా శీఘ్రతరమైంది.

01/22/2017 - 06:57

‘మీరే చెప్పండి. మేం మనుషులకు కాపలా కా యాలా? విగ్రహాలు, ఫ్లెక్సీలకు కాపలాకాయలా? వీటిని ఎవరో ధ్వంసం చేస్తే- ఇంకెవరో రోడ్లమీదకు రావడం, దానికి మమ్మల్ని నిందించడం ఏమిటి? ఈ కొత్త రాష్ట్రం ఎటు పోతోంది? విగ్రహాలు, ఫ్లెక్సీల వివాదాలతో కాలం వెళ్లదీస్తే నవ్యాంధ్రలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? తమిళనాడును చూడండి.

01/21/2017 - 01:47

విశ్వపటంపై భారత్‌కు సమున్నత స్థానం కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో మరొక భాగం ఇటీవలే ముగిసిన ‘రైజినా డైలాగ్’. వివిధ దేశాల రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు సేకరించి, వాటిని విజయవంతంగా అమలుచేసే బాధ్యతను మనదేశం తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నది. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి వేదికను వాడుకోవడం, అవసరమైతే తగిన వేదికలను రూపొందించుకుంటూ భారత దౌత్యనీతి ముందుకు సాగుతోంది.

01/20/2017 - 01:48

గత ఏడాది మే 17న కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ మహిళా విధానం’ ముసాయిదాను విడుదల చేసింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత వచ్చిన విధానపత్రం అది. ‘జాతీయ, అంతర్జాతీయ నేపథ్యాలలో అనూహ్య మార్పులు వస్తున్న సమయంలో మహిళలు నిర్వహించగల పాత్రను దృష్టిలో వుంచుకుని ఈ విధాన పత్రం రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరిగిన మాట వాస్తవం.

01/19/2017 - 05:27

నేతాజీ సుభాస్‌చంద్రబోసు మన దేశపు తొలి ప్రధానమం త్రి... ఈ వాస్తవాన్ని మన చరిత్ర చాటుతోంది. కానీ, ఆధికారికంగా మాత్రం ‘నేతాజీ’ ఇప్పటికీ ప్రథమ ప్రభుత్వ సారథిగా గుర్తింపును పొందడం లేదు. ఎందుకంటె క్రీస్తుశకం 1947 ఆగస్టు 15 వరకు మన దేశంపై పెత్తనం చెలాయించి వెళ్లిన బ్రిటన్ దురాక్రమణదారులు ‘సుభాస్ చంద్రవసు’ను మన దేశపు ప్రధానిగా గుర్తించలేదు. ‘వసు’ అన్న పదాన్ని వంగదేశీయులు ‘బొసు’ అని పలుకుతారు.

01/18/2017 - 00:44

బిజెపి వారు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ పిలుపునిచ్చారు మొదట. ఆ తర్వాత బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ‘ఆర్‌ఎస్‌ఎస్ ముక్త్భారత్’ అని నినాదం వినిపించారు. ఇదంతా జరిగి కొంతకాలమైనా, ఇపుడీ ప్రస్తావన ఎందుకంటే- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరొక వైపు నితీశ్‌కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాస్త ‘మచ్చిక’ అనదగ్గ రీతిలో వ్యవహరిస్తున్నారు.

01/17/2017 - 01:34

మీకీసంగతి తెలుసా?

Pages