S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
మన పార్లమెంటు సమావేశాలు నానాటికీ మొక్కుబడి వ్యవహారంలా మారుతున్నాయనడానికి వర్షాకాల సమావేశాలే ప్రబల నిదర్శనం. అధికార,ప్రతిపక్షాలు ఎప్పటి మాదిరిగానే పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యలను చర్చించడానికి ఏ మాత్రం దృష్టి సారించడం లేదు.
భారత్ సహా మిగిలిన ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంచుకోకపోతే చైనాకే నష్టం వాటిల్లుతుంది. ‘డోక్లామ్’ గొడవ మూలంగా రెండు పెద్ద దేశాలైన భారత్, చైనాల మధ్య యుద్ధం అనివార్యం అయినపుడు- మన దేశం కంటే చైనాకే అధిక నష్టం కలుగుతుంది. దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల జనాభా ఉన్న భారత్, చైనాలు యుద్ధానికి దిగటం ఏ రకంగా చూసినా మంచిది కాదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ అధినాయకులు అధికారం కోసం తమ మూల సిద్ధాంతాలను సైతం పక్కన పెడుతున్నారా? జమ్ము-కశ్మీర్, గుజరాత్, బిహార్ వంటి రా ష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే బిజెపి నాయకత్వానికి అధికారం తప్ప మరో అంశం పట్టటం లేదనే భావన కలుగుతోంది.
ప్రతిపక్షాల రాజకీయాల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నీరు కారిపోతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్షాలు అనుసరిస్తున్న ఏకపక్ష విధానం ఉభయ సభలను స్తంభింపజేస్తోంది. సమావేశాలను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.
దేశ సార్వభౌమాధికార పరిరక్షణలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించిన ప్రతిపక్షం దేశాభివృద్ధి విషయంలో కూడా కలసి రావాలి తప్ప- అడుగడుగునా అడ్డుపడటం మంచి విధానం కాదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏడాదికి మూడు సార్లు జరిగే పార్లమెంటు సమావేశాల్లో రెండో విడత జరిగేవి వర్షాకాల సమావేశాలు. బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఇవి కేవలం నెల రోజుల పాటే జరిగినా వీటికి ప్రాధాన్యత ఉంటుంది.
అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అక్రమాలకు భరతవాక్యం పలికితే తప్ప దేశంలో విలయ తాం డవం చేస్తున్న అవినీతిని అదుపు చేయటం సాధ్యం కాదు. రాజకీయ నాయకులకు అధికారులు తోడు కావటంతో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. నేటి పాలనావ్యవస్థలో ‘కంచే చేను మేస్తున్న దృశ్యాలు’ అడుగడుగునా కనిపిస్తున్నాయి.
కమ్యూనిస్టు చైనా సామ్రాజ్యవాదం పొరుగు దేశాలకు ముఖ్యంగా భారత దేశానికి తలనొప్పిగా తయారైంది. 1962 యుద్ధంలో నేర్పిన గుణ పాఠాన్ని ఎలా మరిచిపోతారంటూ దాదాగిరి చేస్తోంది. అవసరమైతే మరోసారి బుద్ది చెబుతామంటూ దౌర్యన్యానికి దిగుతోంది. మితిమీరిన ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తున్న చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.
బిహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా తప్పు చేశారని అనలేము కానీ అద్వానీ లాంటి సీనియర్ నాయకుడి గురించి ఆలోచించకుండా తప్పు చేశారని చెప్పకతప్పదు. భాజపా కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం విజతతో కూడిన నిర్ణయం అయ్యేది.
దేశంలో ప్రజాస్వామ్యం స్థిరంగా ఉండాలంటే జా తీయ, రాష్ట్రాల స్థాయిలో అధికార పక్షానికి దీటైన ప్ర తిపక్షం ఉండటం ఎంతో అవసరం. బలమైన విపక్షం లేకపోతే అధికార పక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలు, సిద్ధాంతాలను కాలరాస్తుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను కట్టడి చేసేందుకు అవసరమైన ప్రతిపక్షం క్రమంగా కనుమరుగైపోతోంది.
నూతన రాష్టప్రతి ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య సమరానికి దారి తీయడం మంచిది కాదు. దేశ ప్రథమ పౌరుడిని నిర్ణయించడంలో అధికార, విపక్ష పార్టీలు పరస్పర సహకారంతో పని చేస్తే బాగుండేది. కానీ ఇపుడు అలా జరగటం లేదు. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24వ తేదీతో ముగుస్తుంది. జూలై 20న కొత్త రాష్టప్రతి ఎవరనేది తేలిపోతుంది.