S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

10/29/2019 - 00:12

మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు మరోసారి ఊహించిన దానికి విరుద్ధంగా తమదైన తీర్పు ఇవ్వటం ద్వారా రాజకీయ నాయకులకు గుణపాఠం నేర్పించారు. జాతీయ వాదంతోపాటు ఆర్థిక అంశాలు, ప్రాంతీయ సమస్యలు, కుల రాజకీయాలకు పెద్ద పీట వేశారు. బి.జె.పికి మరోసారి అధికారం ఇచ్చినట్లే ఇచ్చి మెజారిటీ తగ్గించటం ద్వారా బాధ్యతలను విస్మరిస్తే ఓడించి తీరుతామనేది స్పష్టం చేశారు.

10/22/2019 - 01:38

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళి, ప్రజల స్పందనను పరిశీలిస్తే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు విజయం సాధించబోతున్నారనేది సులువుగా చెప్పవ చ్చు. పోలింగ్ ముగియడంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలపైనే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా, దాని మిత్రపక్షాలు ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలతోపాటు స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం గురించి ప్రస్తావించడం తెలిసిందే.

10/15/2019 - 00:06

భారత్‌కు పాకిస్తాన్ కంటే చైనా నుండి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. చైనా మన ప్రథమ శత్రువు అని గుర్తించాలని రక్షణశాఖ మాజీ మంత్రి దివంగత జార్జి ఫెర్నాండెజ్ అప్పట్లో హెచ్చరించేవారు. ఆయన అనాలోచితంగా ఈ హెచ్చరిక చేశారని మనం భావించరాదు. ‘హిందీ- చీనీ భారుూ భారుూ’ అంటూ మాయమాటలు చెప్పి, మనం ఆదమరిచి ఉన్న సమయంలో అకస్మాత్తుగా దాడి చేసి అక్సాయిచిన్ ప్రాంతాన్ని కబళించిన దేశం చైనా అని మనం ఎప్పటికీ మరిచిపోరాదు.

10/08/2019 - 02:00

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తన నిర్ణయానికి కట్టుబడితే నవంబర్ 17 తేదీ నాడు చారిత్రక పరంగా దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుండి, వివాదాల పరంగా గత నూటా డెబ్బై సంవత్సరాలు, కోర్టుల పరంగా గత డెబ్బై సంవత్సరాల నుండి కొనసాగుతున్న రామజన్మ భూమి, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదానికి ఒక పరిష్కారం లభించవచ్చు.

10/01/2019 - 00:07

భారత దేశం శాంతి సౌభాగ్యాలను కోరుకుంటుంటే అందుకు విరుద్ధంగా పాకిస్తాన్ మాత్రం రక్తపాతం, అణు విధ్వంసం తప్పదంటూ చిందులు వేస్తోంది. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత వారం ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగాలు ఇందుకు నిదర్శనం. మోదీ తనకు ఇచ్చిన పదిహేను నిమిషాల సమయంలో చేసిన ప్రసంగం వివిధ దేశాధినేతలను ఎంతగానో ఆకట్టుకున్నది.

09/24/2019 - 03:30

భిన్నత్వంలో ఏకత్వం భారత దేశం ప్రత్యేకత. పలు భాషలు, సంస్కృతులు, విలువలకు నిలయం మన దేశం. అన్ని భాషలూ మనకు ముఖ్యమే. ఏ ప్రాంతం వారు ఏ భాష మాట్లాడినా వారందరినీ అనుసంధానం చేసేందుకు జాతీయ స్థాయిలో ఒక భాష ఎంతో అవసరం. అనుసంధాన భాషను తప్పనిసరి కాకుండా ఐచ్ఛికం చేయడం ద్వారా భిన్న భాషల మధ్య ఐక్యతను సాధించి తద్వారా భారతీయతను మరింత పటిష్టం చేసుకోవచ్చు.

09/17/2019 - 02:29

నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక- వంద రోజుల పాలనలో ఆశించిన దానికంటే ఎక్కువే పని చేసింది. ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ చట్టం చేయడం, జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన 370వ అధికరణాన్ని రద్దు చేయడం వంటివి మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలు.

09/10/2019 - 02:21

బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుండి మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన బెంగాలీ, రొహింగియా ముస్లింలను గుర్తించడంలో జాతీయ పౌర జాబితా (నేషనల్ రిజిష్టర్ ఫర్ సిటిజన్స్) ఘోరంగా విఫలమైంది. ఈ జాబితా ఎంత గొప్ప గా పని చేసిందంటే- స్థానిక హిందువులపై ‘అక్రమ వలసదారుల’ని ముద్ర వేసి, ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలను మాత్రం భారత పౌరులుగా గుర్తించింది.

08/27/2019 - 01:46

జమ్మూ కశ్మీర్‌ను జాతీయ జీవన స్రవంతిలో కలిపి నాలుగు వారాలు కావస్తోంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడి ప్రజలు ఎలాంటి కోపతాపాలకు గురికాకుండా- హింసకు తావివ్వకపోవటం అభినందనీయం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో జమ్ము, లద్దాక్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

08/20/2019 - 03:47

గత్యంతరం లేని పరిస్థితిలో సోనియా గాంధీ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టవలసి వచ్చింది. రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం ఫలితంగా క్లిష్టదశకు చేరుకున్న కాంగ్రెస్‌ను- అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా కాపాడగలుగుతారా? రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ దాదాపునిర్వీర్యమైపోయిన దీనస్థితిలో- అధ్యక్షుడే లేకుండా ఒకటిన్నర నెలలు స్తబ్దత కొనసాగడం ఆ పార్టీ నాయకులను మరింతగా నీరసపరచింది.

Pages