S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

06/04/2019 - 22:12

దాదాపు 133 ఏళ్ల క్రితం స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ మనుగడ ఇపుడు ప్రశ్నార్థకమైంది. వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఘో రంగా ఓడిపోవటం, తాజా ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యం, ఆశించిన స్థాయిలో ప్రియాంకా గాంధీ ప్రభావం చూపలేక పోవడం వంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ భవితవ్యం గందరగోళంలో పడింది.

05/21/2019 - 02:51

పదిహేడవ లోకసభ ఎన్నికల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఎల్ల్లుండి అంటే 23వ తేదీ ఏం జరగబోతోంది? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా, ఎగ్జిట్ పోల్స్ ఎంతో విశ్వాసంతో చెబుతున్నట్లు బి.జె.పికి మరోసారి భారీ మెజారిటీ లభించి ఎన్.డి.ఏ ఆధికారంలోకి రాబోతోందా? నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతారా?

05/14/2019 - 01:57

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే విపక్ష శిబిరంలో ప్రధాని అభ్యర్థి ఎవరన్న అంశంపై రాజకీయం ఊపందుకుంది. ఆఖరి విడత పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని అభ్యర్థిత్వంపై విపక్ష పార్టీల్లో తెరవెనక చర్చలు ప్రారంభమయ్యాయి. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకి లోక్‌సభలో మెజారిటీ రాదన్న నమ్మకంతో ప్రతిపక్షాలు ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పటికే దృష్టి సారించాయి.

05/07/2019 - 01:25

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్ష నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకునేందుకు ఇస్తున్నంత ప్రాధాన్యం తమ విధానాలను వివరిస్తూ ప్రజల విశ్వాసం పొందేందుకు ఇవ్వడం లేదు. దాదాపుఅన్ని రాజకీయ పార్టీలకు చెందిన చిన్నాపెద్దా నాయకులంతా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. ప్రత్యర్థులను అవహేళనకు గురిచేస్తూ, ఓట్లు దండుకునేందుకు ఎంతకైనా దిజగారుతున్నారు.

04/30/2019 - 01:25

ప్రస్తుత సార్వత్రిక సమరంలో విపక్షం వెనుకబడిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు గట్టి పోటీ ఇవ్వడంలో ప్రతిపక్షం విఫలమవుతున్న తీరు గోచరిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టేందుకు వీలులేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ప్రకటన ప్రతిపక్షంలో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతోంది.

04/23/2019 - 02:17

ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోతే తప్ప ఈ దేశం బాగుపడదంటూ కొందరు విపక్ష నేతలు చేస్తున్న వాదనలో ఎలాంటి పస లేదు. మోదీ రెండోసారి ప్రధాని పదవి చేపడితే దేశం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్న వాదనలు లేకపోలేదు. రాజకీయపరమైన స్థిరత్వం ఆయనతోనే సాధ్యమన్న పరిస్థితి కనిపిస్తోంది. కలగూరగంప లాంటి విపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజకీయ అస్థిరత్వం నెలకొంటుంది.

04/16/2019 - 05:20

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు అందజేస్తున్న పారిశ్రామికవేత్తల వివరాలను ప్రజల ముందు పెట్టవలసిందే. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇస్తున్న పారిశ్రామికవేత్తలు, సంస్థల వివరాలు ప్రజలు ముఖ్యంగా ఓటర్లకు అవసరం లేదంటూ బి.జె.పి అధినాయకత్వం చేస్తున్న వాదన ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల మూలంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది.

04/09/2019 - 04:28

ఎన్నికల సమయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రజల ముందు పెట్టే మేనిఫెస్టోలు నానాటికీ ప్రహసనంలా మారుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలు ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు దండుకునేందుకు చేసే మోసపూరిత ఎత్తుగడగా తయారయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చే హామీలు చాలావరకూ ఆచరణకు నోచుకోవటం లేదు. మేనిఫెస్టోల పేరిట ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ అధికారంలోకి వచ్చాక మన నేతలు హామీలను విస్మరిస్తున్నారు.

04/02/2019 - 03:10

ఎన్నికలు సమీపించినపుడు మాత్రమే రైతులకు రుణమాఫీ, పెన్షన్లు, ఇతర రాయితీ పథకాలను ప్రకటించటం, వాటిని ఆగమేఘాలపై అమలు చేయడం మన పాలకులకు పరిపాటిగా మారింది. బీదరికాన్ని తొలగిస్తాం, రైతులను ఆదుకొంటామని నేతలు ఇస్తున్న హామీలు కేవలం నినాదాలుగా మారుతున్నాయి. నిజంగా రైతులను ఆదుకోవాలని, బీదరికాన్ని తొలగించాలనే లక్ష్యం, చిత్తశుద్ధి, పట్టుదల, నిజాయితీ మన రాజకీయ నాయకుల్లో లేదు.

03/19/2019 - 01:13

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుత ప్రభుత్వ పని తీరును సమీక్షించటంతోపాటు, తాము అధికారంలోకి వస్తే అద్భుతాలు సాధిస్తామని చెబుతున్న నేతల గురించి లోతుగా ఆలోచించి ఓటర్లు తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఐదేళ్ల క్రితం దేశాన్ని నడిపించే బాధ్యతను స్వీకరించిన నాయకులు ఏ మేరకు హామీలను నెరవేర్చారు? దేశాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు?

Pages