S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/02/2020 - 01:03

ఈ మధ్య బెంగుళూరులో ఉన్న మా అమ్మాయి తన కొడుకుతో కలిసి రు.10వేల టిక్కెట్లు కొని దర్శనమునకు తిరుమల వెడితే, రూపాయి ఖర్చు పెట్టని ఒక నేత మరియు 10 మందిని వీరితో పంపించారు. వీరికి సరిఅయిన దర్శనము లభించలేదు. 10వేల రూపాయలు పోసి కొన్నవారికి అల్పదర్శనం, ఫ్రీగా వచ్చిన వారికి పెద్దపీటా? ఇదెక్కడి న్యాయం. అసలు ఈ ప్రముఖులు అన్నవాళ్ళు తిరుమల వస్తే పేపరువారు, టీ.వీల వారు ఎందుకింత ప్రాముఖ్యం ఇస్తారు.

01/01/2020 - 02:04

ఈ సంవత్సరం ఆద్యంతం భారతీయ ఓటరు ఇచ్చిన ప్రతి తీర్పులోను ఓ ప్రజాస్వామ్య పాఠం వుంది. అలాగే అప్రజాస్వామ్య శక్తులకు ఒక మంచి గుణపాఠమే చెప్పి ఓటరా మజాకా అనేలా చేసారు. అయిటే ఓటరు దేవుడు ఒక మంచి సందేశాన్ని ఈ సందర్భంగా ఇచ్చాడు. ‘పదవులు శాశ్వతం కాదు, ప్రోటోకాల్ భాజాభజంత్రీలు శాశ్వతం కాదు, గెలుపు ఓటములు శాశ్వతం కాదు, కాని మన దేశం శాశ్వతం, ఓటరుగా నేను శాశ్వతం’.

12/29/2019 - 02:14

విలాసం అనగా చిరునామా. ఆంధ్రుల రాజధాని విలాసమేమిటో ఇంకా సందిగ్ధంలోనే ఉంది. రాజధాని స్థానంలో బహువచనం వాడాల్సి రావొచ్చు.. రాజధానులంటూ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచనలకై ఏర్పాటుచేసిన జీ.ఎన్.రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో అంశాలు, వివిధ పత్రికలు రిపోర్ట్ చేసినవి. స్థూలంగా చూస్తే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌ని పోలి వున్నాయి. శ్రీకృష్ణ కమిటీ సూచనల్ని బలపర్చేవిగా ఉన్నాయి.

12/26/2019 - 04:39

మూడు రాజధానుల ముచ్చటైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని చూడాలనుకొంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి. ఒక వినూత్నమైన ఆలోచన. ఆంధ్ర మహావిష్ణువు పాలనలో మన రాష్ట్రం ఒకప్పుడు మూడువైపులా మూడు శైవక్షేత్రాల (లింగాల) నడుమ రాజ్యంగా విస్తరించి త్రిలింగ రాజ్యంగా పేరొందింది. కోస్తాలో ద్రాక్షారామం, సీమలో శ్రీశైలం, ప్రస్తుత తెలంగాణాలో కాళేశ్వరం అవి.

12/23/2019 - 22:03

దేశం ముందు పెను సవాళ్లున్నాయి. అందులో మొదటిది ఆర్థికంగా దివాళా దిశగా దేశం దిగజారుతూ పోవడం. కనుక ఆర్థికస్థితి చక్కబరచడం ప్రభుత్వానికి తొలి ప్రాధమ్యం కావాలి. ఒక రకంగా చూస్తే అదే ఏకైక ప్రాధమ్యం కావాలి కూడా. ఆ స్థాయిలో ఫోకస్ అవసరమున్న తీవ్రమైన అంశం ఇదే.

12/22/2019 - 02:14

భారతదేశంలో సుమారు నూట ముప్పై కోట్ల మంది భారతీయుల్లో కోట్లాది మందికి నివాసానికి స్థలాలు, ఇళ్ళు లేక అనేక అవస్థలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ భూములు, పంట భూములు, అటవీ భూములు, చెరువులు విస్తీర్ణం కుదించి (ఆక్రమణలకు గురై) బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినా కోట్లాది మందికి గూడు లేక అలమటిస్తున్నారు.

12/20/2019 - 05:45

కేంద్రం తాజాగా తెచ్చిన పౌరసత్వ చట్టంతో భారతీయ పౌరులెవరికీ నష్టం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినా ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో హింసాకాండ కొనసాగుతోంది. పాక్, బంగ్లా, అఫ్ఘన్ దేశాల్లో బలవంతపు మత మార్పిడిలు, కిడ్నాపుల వంటి వేధింపులు తట్టుకోలేక డిసెంబర్ 2014 లోపు వచ్చిన కొన్ని వేల మంది ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వటంతో స్థానిక ప్రజల్లో అభద్రతాభావం ఇంకా పెరిగిపోయింది.

12/15/2019 - 02:31

సీనియర్ నటుడు, ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత, కాలమిస్ట్, వక్త గొల్లపూడి మారుతీరావు అస్తమయం అటు సినిమా, టీవీ ఇటు నాటక, పత్రికా ప్రపంచానికి ఎనలేని తీరని లోటు. ముఖ్యంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గొల్లపూడి డాక్టర్ చక్రవర్తి (1969) సినిమాతో రచయితగా సినిమా పరిశ్రమకు పరిచయమై తదనంతరకాలంలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, ఎక్కుతూ అనేక పేరుమోసిన నవలలు, రచనలకు అంకురార్పణ గావించిన మేధో సంపన్నుడు.

12/12/2019 - 04:28

నాగరిక సమాజం ఏర్పడాలంటే అది న్యాయ మార్గం ద్వారానే సాధ్యం. ఆలస్యం అమృతం విషం- అన్న సూక్తి న్యాయానికి చక్కగా అన్వయం అవుతుంది. ఆలస్యంగా న్యాయం అందితే అది- న్యాయం నిరాకరించబడినట్టే. అందుకనే పటిష్టమైన న్యాయవ్యవస్థను ఏర్పరచుకోవడం సమసమాజ స్థాపనకి మొదటిమెట్టు. అవసరమైన చట్టాలూ వాటిని నిష్పాక్షికంగా అమలు చేసే యంత్రాంగం, బాధ్యత కలిగిన పౌర సమాజం సత్వర న్యాయం దిశగా సమాజం నడవడానికి కీలకం.

12/10/2019 - 23:36

‘దిశ’ హంతకులను పోలీస్ కస్టడీకి ఇస్తున్నారని తెలియగానే - ప్రజల్లో చాలామంది ‘పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తారనే’ ఆలోచనకు వచ్చారు. అలా అనుకున్నట్టుగానే నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల చర్యకు తెలంగాణ సమాజమే కాకుండా యావత్ భారత దేశం హర్షం వ్యక్తం చేస్తున్నది.

Pages