S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

04/29/2017 - 00:53

ఓ అమాయక భర్త, అందమైన భార్య- ఆ దంపతుల మధ్యలో ఓ కొంటె మనిషి చేరడం, వారిమధ్య అల్లరి చే యడం, ఆ అమాయకుడి భార్యను లేవదీసుకుపోవడం- మధ్య మధ్యలో లేడీ యాంకర్‌పై జోకులు- దానికి ఆమె మెలికలు తిరిగిపోతూ వెకిలితనపు చేష్టలు..

04/28/2017 - 00:33

హైదరాబాద్ నగరంలో హౌస్‌నెంబర్ ఆధారంగా అడ్రస్ కనుక్కోవడం అంత సులువుకాదు. ఉదాహరణకు సీతాఫల్‌మండిలోని ఒక అపార్టుమెంట్ ఇంటినెంబర్ 12-10- 335-7/1/ఎ/బి అని ఉంది. నగరంలో ఏళ్ల తరబడి నివసిస్తున్నవారికైనా ఇంత సంక్లిష్టంగా ఉన్న నెంబరుతో ఇంటిని గుర్తుపట్టడం సులువేం కాదు. ఇక బయటి ప్రాంతాలనుంచి వచ్చేవారికి ఇది పెద్దసమస్యే.

04/26/2017 - 05:52

రాష్ట్ర విభజన తరువాత అంటే 2014 జూన్ 2వ తేదీ తరువాత రిటైరైన టీచర్లకు పదవ పిఆర్‌సికి సంబంధించిన గ్రాట్యుటీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో, అసలు ఇస్తారో ఇవ్వరో తెలియదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్నామని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. అలాంటప్పుడు గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలికదా.

04/25/2017 - 07:08

మెజారిటీ హిందువుల మనోభావాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వాలు మైనారిటీలపై ప్రేమ ఒలకబోస్తున్నాయి. వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ప్రభుత్వం, అధికారులు హిందూ ఆలయాలు, పీఠాల భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. వక్ఫ్ భూములను సంబంధిత బోర్డులకు అప్పగించి ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం హిందూ ధార్మిక సంస్థలపై మాత్రం శీతకన్ను వేస్తోంది.

04/24/2017 - 04:06

ఈ సంవత్సరం దేశంలో వర్షపాతం బాగానే ఉంటుందని వాతావరణ శాఖ భావిస్తోంది. అన్ని దక్షిణాది రాష్ట్రాలు మూడేళ్లుగా వర్షాభావంతో ఇక్కట్లు పడుతున్నాయి. కరువు తాండవిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో మంచి వర్షపాతం ఉండబోతుందన్న వార్త తీపి కబురే. నదీ జలాల్ని సక్రమంగా వాడుకొనే దీర్ఘకాలిక ప్రణాళికలతోపాటు ప్రస్తుతం ఉన్న నీటిని, రాబోయే వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలు ఇప్పుడే ఊపందుకోవాలి.

04/22/2017 - 01:20

రోజురోజుకూ భూతాపం పెరిగిపోతోంది
మండే ఎండలకు బండైనా కరిగిపోతోంది
భూగర్భంలోని నీరంతా ఇంకిపోతోంది
చెట్లను నరికేసి, చెరువుల్ని మింగేసి,
పొగల్ని చిమ్మేస్తే ఏమవుతుంది?
మనం చేసిన పాపానికి ఫలితం
ఇదికాక మరేమవుతుంది?

04/21/2017 - 01:23

ముస్లింలు, క్రైస్తవులు తమ మతాన్ని ఎవరైనా విమర్శిస్తే ప్రత్యక్ష చర్యలకు దిగి సత్తా చూపుతారు. కానీ హిందువులు అలా కాదు. తమ మతం గురించి ఏమీ తెలియకపోయినా సొంత మతంపైనే విమర్శలు చేస్తుంటారు. హిందువులకు హిందువులే శత్రువులుగా మారుతూ తమను తామే బలహీనపరచుకుంటున్నారు.

04/20/2017 - 02:15

‘బిజెపికి బొంద పెడతా’నని తెరాస నేత అన్నట్టు టీవీ వార్త! బొంద పెట్టడానికి అది ఒక కుటుంబపు పార్టీ కాదు. ఛత్రపతి శివాజీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ‘నా తండ్రిని, అన్నని- నీళ్లు తప్ప అన్నీ ఇచ్చి- పీకలు కోసి చంపాను. శివాజీ చనిపోయాక అతని కొడుకు శంభాజీని పట్టుకోగలిగాను కానీ శివాజీకి బొంద పెట్టలేకపోయాను. నేను అసమర్ధుడ్ని, నీచుణ్ణి’ అని ఏడుస్తూ ఔరంగజేబు కన్ను మూసాడు. ఆ శివాజీ వారసులే ఈ బిజెపి వారు.

04/19/2017 - 08:12

ప్రతి ఒక్కరికీ జనరిక్ మందులను తక్కువ ధరలో అందించాలనే ఆలోచన అభినందనీయం. ఈ జెనెరిక్ మందుల వ్యాపారం అభివృద్ధి చేసే ప్రయత్నంలో బ్రాండెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీల ఆగ్రహవేశాలను ప్రభుత్వం మూటకట్టుకోవలసి వచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. కేవలం జెనెరిక్ మందులకే బ్రాండ్ అంబాసిడర్‌లాగ ప్రభుత్వం పనిచేస్తే మిగతా మందుల కంపెనీలు అమ్మకాల పరిస్థితి ఏమిటి?

04/18/2017 - 08:50

ఎన్నికల హామీలకు, మేనిఫెస్టోలకు ఆయా రాజకీయ పార్టీలు జవాబుదారీ కావాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడడం సహేతుకం. రాజకీయ పార్టీల నాయకత్వాలు నైతిక వర్తనం కన్నా, ఎన్నికల్లో లాభం వైపు మొగ్గుచూపడం అనివార్యమైపోయింది. భారతంలో ధర్మరాజు అవసరానికి ‘అశ్వత్థామ హతః’ అంటూ గట్టిగా పలికి ‘కుంజరః’ అని గొణిగి తన పని తాను సాధించుకొన్నాడు.

Pages