S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/07/2016 - 06:29

కొత్తగా టీచరైన కాలంలో పాఠం చెప్పేటప్పుడు నా ఉపోద్ఘాతమంతా కూడా లెక్కల గురించి గొప్పతనం చెప్పడమే చేశాను. లెక్కలు మనిషి యొక్క అద్భుతమైన ఆవిష్కరణలో ఎంత కీలకమైన పాత్ర వహించాయో చెప్పటం, పిల్లల యొక్క అటెన్షన్ పెంచటం. లెక్కలు నేర్చుకోవటం ఆషామాషీ కాదు. ఎంతో కష్టపడితే అర్థమవుతుందని చెప్పటం నా తొలి ఉపాధ్యాయ రంగంలో వేసిన అడుగులవి. కానీ నాకు ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే?

04/06/2016 - 07:07

అసదుద్దీన్ ఒవైసీ ఏదో అన్నాడని దానిమీద ఇంత రభస అవసరమా? - ఆయన మానాన దాన్ని వదిలేసి ఉంటే ఇంత ప్రాముఖ్యం లభించేది కాదు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకుని ఉండేవారుకాదు. రజాకార్ల కాలంలో రాష్ట్ర ప్రధానిగా పనిచేసిన మీర్ లాయక్ అలీ పోలీసుచర్య తర్వాత గృహ నిర్బంధంనుంచి తప్పించుకుని పాకిస్తాన్ పారిపోయాడు. ఈ సంగతి విన్న సర్దార్‌పటేల్ దీన్ని ఏదో రోజుజరిగే వ్యవహారంగా తీసుకొని ఏ చర్యాతీసుకోలేదు.

04/06/2016 - 07:06

ప్రతి మనిషి నిత్యజీవితంలో ఉదయం లేవగానే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంలోకి కూరగాయల అవసరం ఎంతో ఉంటుంది. అలాంటి కూరగాయల్ని పండించే రైతులు నేడు విలవిలలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు కూరగాయల్ని పండించి ప్రస్తుతం ఎంతో నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలోని రైతులు క్వింటాళ్ళకు క్వింటాళ్ళు తగిన ధర లేక తెంపి పారబోస్తున్నారు.

04/04/2016 - 23:26

భారత ప్రజలకు లభించిన ‘అన్మోల్ రతన్’ (అమూల్యరత్నం) అని కితాబు పొందిన ప్రజాసేవకుడు, బాబూ జగ్జీవన్ రామ్. పండిట్ నెహ్రూ నుంచి కార్యదక్షుడిగా మన్ననలను పొంది, అగ్రశ్రేణి నాయకుల్లో ఒకడుగా, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోను, నవభారత నిర్మాణంలో ఉదాత్తమైన పాత్ర నిర్వహించిన జగ్జీవన్ రామ్, 1908, ఏప్రిల్ 5న బిహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా, చాంద్వా గ్రామంలో బసంతీదేవి, శోభిరామ్ దంపతులకు జన్మించారు.

04/04/2016 - 06:28

దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఒకరు. ఆమె కేవలం ఒక రాజకీయ నాయకురాలిగానే ప్రజలందరికీ తెలుసు. అయితే ఆమె బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె మంచి చిత్రకారిణి. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఇటు తృణమూల్ కాం గ్రెస్ అధినేత్రిగా ఆమె ఊపిరి సలపనంతగా పనులతో ఉన్నప్పటికీ, చిత్రాలు గీయడానికి కొంత సమయం కేటాయిస్తారు. ఆమెకు మంచి డిజైనర్‌గా కూడా గుర్తింపు ఉంది.

04/02/2016 - 02:37

వాదానికి ప్రతి వాదముంది, బాణానికి బాణముంది అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు చట్టసభల్లో నేడు ప్రజాస్వామిక విధానాలకు, ప్రజాశ్రేయస్సుకు చేయాల్సిన సంస్కరణలను పక్కనపెట్టి ప్రజాప్రతినిధులు వాదోపవాదాలకు చట్టసభలను వేదికగా చేసుకోవడం దురదృష్టకరం. వాదోపవాదాలే కాదు పార్టీల ఆపై వ్యక్తిగత సమస్యల్ని తెరపైకి తెచ్చి ఘర్షణాయుత వాతావరణాన్ని సృష్టించడం మరింత దారుణం.

04/01/2016 - 00:12

మనం జీవిస్తున్న భూమీద మనుషులతోపాటుగా అనేక యితర ప్రాణులు వున్నాయి. అయితే అన్నిటికన్న మానవ జీవితం ఉత్కృష్టమైందని చెప్పుకుంటాం. అటువంటి మానవ సమాజం అనేక రుగ్మతల కారణంగా మానవ జాతికున్న విలువలు కరిగి పోవడాన్ని చూస్తున్నాం. ఒక వ్యక్తి రుగ్మతతో బాధపడితే వ్యక్తిగతవౌతుంది. అదే కొంతమంది బాధపడితే అది సామా జికం అవుతుంది.

04/01/2016 - 00:10

ఈమధ్య తెలుగువారికి తమ మాతృభాషపై మక్కువ పెరిగింది. తమ మాతృభాష కనుమరుగైపోతుందేమోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడక్కడ తెలుగు మాతృభాష దినోత్సవాలను కూడా జరుపుకోవడం జరుగుతున్నది. ప్రపంచ తెలుగు భాష మహాసభలు కూడా జరుపుతున్నారు.

03/31/2016 - 00:10

భారత్‌లో పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పథకం ఆనాటి ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు మైనార్టీ ప్రభుత్వం మనుగడకోసం అనేక చిన్న పార్టీలను కూడగట్టుకొనే విధానంలో భాగంగా ఎంపీ ల్యాడ్స్ పుట్టుకొచ్చింది. ఈ పథకాన్ని చూసి అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల అభివృద్ధికోసం తమకూ ఇలాంటి నిధి కావాలన్నారు. ఫలితంగా ఎంపీ ల్యాడ్స్ తరహా పథకం రాష్ట్రాలకు కూడా విస్తరించింది.

03/31/2016 - 00:16

బోధన గలగల ప్రవహించే నది మాదిరిగా మారుతూ ఉంటుంది. అట్లా మారే బోధనే నికరంగా, సందర్భోచితంగా ఉంటుంది. పారిశ్రామికయుగం కన్నా ముందు మనం వ్యవసాయ రంగంలో ఉంటాము. కాబట్టి ఆ యుగం లక్షణాలు బోధనపైన కూడా సహజంగానే పడింది. వ్యవసాయంలో నారు పోయటం, నాటేయటం, కలుపులు తీయటం, దుక్కిదున్నటం, పంట నూర్చటం వీటిన్నింటి ప్రభావం తరగతి గదిలో బోధనపైన కూడా పడ్డది. కాబట్టే మనం ఆ యుగంలో అక్షరంనుంచి పదం.

Pages