S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
తరగతి గది నాలుగుగోడల మధ్యన సంభాషణేనా? నాలుగు గోడలను పెకలించి సమాజంతో సంధానం చేయటమా? అనే సవాలును ఎదుర్కొంటున్నది జ్ఞానం. జ్ఞానం కోసమే అని కొందరనేవారు. కానీ నేడు జ్ఞానం సమాజం కోసమనే భావన ప్రపంచమంతటా విస్తరించింది. అదే కోణంలో చర్చించబడుతున్నది. చదువు పూర్తయిన తర్వాత ఆ చదువు వాడకం గురించి ఆలోచించటం వెనుకటి పద్ధతి.
కేంద్రంలో తన పలుకుబడి దెబ్బతినకుండా చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజకీయాలను నడుపుతుంటారు. 1995లో చంద్రబాబునాయుడు రాష్ట్రం లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూనే వచ్చారు. 1996లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ ఏర్పడిన సందర్భంగా కాంగ్రెస్-బి.జె.పి.ల ప్రత్యామ్నాయంగా యునైటెడ్ ఫ్రంట్ రూపొందడంతో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు.
ఆర్థికాభివృద్ధితోపాటు సాంఘిక న్యాయం సాధించాలని మన ప్రణాళికలు ఆశించాయి. అయితే, ఈ దిశగా ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. ఈ రెండు లక్ష్యాల సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించవలసి వుంది. ఈ కారణం గానే 1969లో 14 వాణిజ్య బ్యాంకులు, 1980లో మరో ఆరు బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. ఇందువల్ల గ్రామ ప్రాంతాలలో బ్యాంకు శాఖల సంఖ్య బాగా పెరిగింది. 1969లో మొత్తం శాఖలలో గ్రామీణ శాఖల శాతం 22 మాత్రమే.
ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన కులాలు (బీసీ)లో కొన్నింటికి రిజర్వేషన్ ఫలాలు అందడంలో ఆర్థికంగానూ, ఉద్యోగపరంగానూ బయటపడ్డాయి. మరికొన్ని కులాలు ఇంకా వెనుక బాటలోనే ఉన్నాయి. ఎప్పటికపుడు కొత్తకులాలు జాబితాలోకి చేరుతుండటంతో బీసీ జాబితా చాంతాడంత రూపుదిద్దుకొంది. ఉత్తరాంధ్రలో వ్యాపారమే ప్రధాన వృత్తిగా నడిపే వైశ్యకులాల్ని బీసీ జాబితాలో చేర్చారు.
ఎంతో కాలం శ్రమకోర్చి, త్యాగాలుచేసి, లాఠీ దెబ్బలు తిని, జైళ్ళపాలై స్వాతంత్య్రం సాధించుకున్నామని సగర్వంగా చెప్పుకుంటున్న సమరయోధులైన వయోవృద్ధులు ప్రస్తుత దేశ పరిస్థితి చూసి మేము ఆశించిన భారత్ స్వరూపం ఇదేనా అని విలవిల్లాడుతున్నారు.
అల్ఖైదా తర్వాత ప్రపంచం ముందు పెద్ద ఉగ్రవాద ముప్పుగా పరిణమించిన ఇస్లామిక్ స్టేట్పై రష్యా వైమానిక దాడులు ప్రారంభించడం అమెరికా, ఇతర ఐరోపా దేశాల కపట నాటకాలను బహిర్గతం చేస్తున్నది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అసాధ్యులని, వారిని కట్టడి చేయడం అసాధ్యం అనే రీతిలో కొంతకాలంగా ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం ఈ దేశాలు చేస్తున్నాయి.
ఘటనలు వాస్తవాలు కనుక వాటిని వక్రీకరించకూడదనేది పత్రికా రచయితలకుండాల్సిన ప్రధాన లక్షణం. కానీ దానిపై అభిప్రాయాలను మాత్రం ఎవరిష్టమైన రీతిలో వారు వ్యక్తం చేసుకోవచ్చు. ఉదాహరణకు రోడ్డుపై శవం ఉంది. దానిపై గాయాలు కూడ ఉన్నాయి. ఇక్కడ శవం ఉండటం వాస్తవం. అది ఆత్మహత్య, హత్య, వాహనం ఢీకొనడం వల్లనా అనేవి పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. కానీ దర్యాప్తులో మాత్రం నిజం తేలుతుంది.
తాగునీరు కరువైతే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. పేద ప్రజలు పనికి వెళ్ళలేరు. వైద్యపు ఖర్చులు పెరిగి అప్పులపాలవుతారు. అయినా ఈ రంగంలో మన దేశ ప్రగతి అంతంత మాత్రంగానే వుంది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2012లో ప్రపంచంలో 78.3 కోట్ల ప్రజలకు త్రాగునీరు అందుబాటులో లేదు. అయితే కొన్ని లెక్కల ప్రకారం, ప్రపంచంలో 300 కోట్ల ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు లభించడం లేదు.
మన దేశంలో వేదకాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అందుకే మన పెద్దలు ‘‘స్ర్తిలు ఎక్కడ పూజించబడతారో- అక్కడ దేవతలు ఉంటారు’’ అని చెప్పారు. అనంతరం మారిన పరిస్థితులలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం ఏర్పడింది. మధ్యయుగం నాటికి మహిళలను వంటింటి కుందేళ్ళుగా, కేవలం సంతానాభివృద్ధికి, తమకు శారీరక సుఖాల్ని అందచేసే ఆటబొమ్మలుగా మార్చివేశారు. మహిళలపై అడుగడుగునా ఆంక్షలు విధించారు.
మన దేశంలో మోన్శాంటో విత్తనాలు బి.టి.విత్తనాలు వలె విద్యారంగంలో కూడా పాశ్చాత్య దేశాల దిగుమతి విద్యావిధానాన్ని ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టం ద్వారా నెత్తికెత్తుకున్నారు. అప్పటి మానవ వనరుల అభివృద్ధిశాఖామాత్యులు అమాంతం విదేశీ విద్యావిధానాన్ని, భారతీయ విద్యావిధానంపై రుద్దటానికి చేసిన ప్రయత్నమే ఈ వికృతమైన చట్ట రూపం. ఈ చట్టంలో లోపాలు గురించిన చర్చించిన నాధుడే లేడు.