S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/15/2019 - 01:45

వ్యాపారాలు వేరు, విద్య మరియు వైద్యం వేరు. కానీ నేడు ఈ రెండు దేశంలోనేకాక రాష్ట్రాలలో కూడా మంచి లాభాలను అర్జించే ఆర్థిక వనరులు. మరి ముఖ్యంగా విద్య. తల్లిదండ్రులు వారి పిల్లలను డాక్టరో, ఇంజనీరో చేయాలనే సంకల్పమే కార్పొరేట్ సంస్థలకు వరంగా మారింది. కార్పొరేట్ క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు ఓ ఆదివారం ఉండదు, ఓ పండగ ఉండదు. క్రీడలుండవు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవు. ప్రతిక్షణం చదువే.

03/10/2019 - 02:34

సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం, దేశవాళీ విత్తనాల సంరక్షణ.. ఈ అంశాల ప్రాతిపదికగా వ్యవసాయ రంగంలో కృషిచేస్తున్న వారిని భారత ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మశ్రీ’ పురస్కారాలకు ఎంపిక చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ రంగానికి చెందిన 10 మందికి పైగా ప్రముఖులు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

03/08/2019 - 22:00

నిజానికి రెండు కాళ్లే ఉంటాయి.. అబద్ధానికి ఆరుకాళ్లు ఉంటాయి.. అని అంటారు పెద్దలు. నిజం నెమ్మదిగానూ, తిన్నగానూ నడిస్తే- అబద్ధం అంగవంగలతో వంకర టింకరగా నడుస్తుందని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం, అందులో వివిధ రాజకీయ పక్షాల కుతంత్రం చూస్తుంటే పెద్దలు చెప్పిన ఈ మాటలే గుర్తుకొస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఎలా జరిగిందో.. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో సీమాంధ్ర ప్రజలందరికీ తెలుసు.

03/07/2019 - 01:36

సామాన్య మానవుడి జీవితం ఎక్కడ చూసినా దుర్భరంగానే వుంది. అసలు విషయం వదిలి కొసరు విషయాల మీద ‘వాగ్యుద్ధం’ ఎక్కువై పోయింది. ఎల్.ఒ.సి. దగ్గర టెన్షన్ల సంగతి ఏమో గానీ, రాజకీయ పార్టీల మధ్య భయంకరమైన కక్షలూ, కావేషాలు పెరిగిపోతున్న దశలో సగటు మనిషి కంటినిండా నిద్రపోలేకపోతున్నాడు. పోనీ, ‘సినిమాలు చూద్దామా?’ అంటే బయోపిక్చర్ల సంకుల సమరం సాగుతోంది.

03/06/2019 - 02:08

ప్రజాగాయకుడిగా ప్రసిద్ధి చెందిన గద్దర్ ఇపుడు కొత్త అవతారం ఎత్తారు. ఆయనకు ‘గద్దెల’(పీఠం)పై మోహం తగ్గలేదు. దాంతో ఆయన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్ ఫోరం’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. దానికి కన్వీనర్‌గా ఆయనే వ్యవహరిస్తున్నారు. గత 45 సంవత్సరాలలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. బాపూజీ బుర్రకథ దళం, జన నాట్యమండలి, తెలంగాణ ప్రజాఫ్రంట్... ఇలా ఎన్నో వేదికలు- పీఠాలను ఆయన ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.

03/03/2019 - 00:16

రేపు ‘మహర్షి’ జయంతి సందర్భంగా...
*
భారత స్వాతంత్య్ర పోరాట సమరయోధులు, త్యాగధనులు ఎందరో కనుమరుగైపోయారు. దేశం విస్మరించిన దేశభక్తుల జాబితా ఎంచలేనిది. వీరందరిలో బులుసు సాంబమూర్తి వంటి మహోన్నత వ్యక్తి జాడ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

03/01/2019 - 22:05

పుల్వామా వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో మన సాయుధులు 40 మంది చనిపోవడంతో మొత్తం దేశ ప్రజలు తీవ్రమైన ఆగ్రహనికి, ఉద్విక్తకు గురికాగా, 12 రోజుల తర్వాత మన వాయుసేన సరిహద్దు దాటి పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలో గల ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని విధ్వంసం చేసి, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైష్ కు చావు దెబ్బకొట్టారు.

02/28/2019 - 01:27

ఆధునిక కాలంలో జరిగిన పలు ఆవిష్కరణలకు అసలు మూలాలు భారతీయ శాస్త్రాలలోనే ఉన్నాయని కొందరు నమ్ముతూ ప్రచారం చేస్తున్నారు. మన పూర్వీకులకు ఏమీ తెలియదని ఎవరూ చెప్పడం లేదు. ప్రాచీన భారతీయులు ఖగోళ, గణిత శాస్త్రంలో కొంత ప్రగతిని సాధించిన మాట వాస్తవమే. ఆధునిక శాస్తవ్రేత్తలు ధృవీకరించక ముందే మనం ధ్యానం, యోగాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకొనే ప్రయత్నం చేశాం.

02/27/2019 - 04:00

విశాఖ రైల్వే జోన్ ఆంధ్రుల హక్కు. దశాబ్దాల కల. జోన్ ఏర్పాటు కేవలం ఉత్రరాంధ్ర ప్రజల డిమాండ్ మాత్రమే కాదు.. 5 కోట్ల ఆంధ్రుల అభీష్టం. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం భర్తీలో భాగంగా చేసిన చట్టంలో, ఇచ్చిన హామీలలో ఒకటి రైల్వే జోన్ ఏర్పాటు.

02/26/2019 - 04:43

కొన్ని ఒడిదుడుకులు వున్నప్పటికీ ఇండియా జాతీయ ఆదాయ పెరుగుదల నిలకడగా, సంతృప్తికర స్థాయిలో వుందనవచ్చు. దేశాభివృద్ధికి స్పష్టమైన సూచి మానవాభివృద్ధే. వెనుకబడిన కొన్ని ఆఫ్రికా దేశాలకన్నా విద్య, వైద్యరంగాల్లో ఇండియా దిగువనే వుండటం విచారకరం. ఉప ఖండంలోని పొరుగు పేద దేశాలు కూడా మనకన్నా మానవాభివృద్ధిలో ముందున్నాయి.

Pages