S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
మతిలేని అల్లర్లు, ఆందోళనలు మరోసారి భగ్గుమన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని మైనార్టీలకు గాని, ఇతరులకు గాని ఏ మాత్రం సంబంధం లేనిది. దేశ పౌరులెవరిపై దీని ప్రభావం ఉండదని పదేపదే ప్రధాని, హోంమంత్రి చెప్పినా, సముదాయించినా పట్టించుకోకుండా చదివేస్తే ఉన్న మతిపోయిన చందంగా వ్యవహరిస్తే ఎలా?...
నిజాం నిరంకుశ పాలన నుండి 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనా, 1953లో మద్రాసు నుండి ఆంధ్రరాష్ట్రం విడివడినా, ఉమ్మడి రాష్ట్రంలోని సమస్త వనరులు తరలించబడతాయన్న తెలంగాణ ప్రాంతీయుల అభిప్రాయాలను కాలరాచిన ఫలితంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి స్వార్థ రాజకీయ పాలకుల కారణంగా తెలంగాణకు అడుగడుగునా, అన్ని రంగాలలో తీరని అన్యాయమే జరిగింది.
నవ్యాంధ్రప్రదేశ్లో ఓ చారిత్రాత్మకరోజు. అనుకోకుండా ప్రజలందర్నీ ఒక్కసారి ఉలికిపడేటట్లు చేసిన రోజు. ‘3 రాజధానులు! అమరావతిలో చట్టసభలు, విశాఖలో సచివాలయం, కర్నూల్లో హైకోర్టు’- అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్. సాయంత్రం సభ ముగుస్తుందనంగా ఒక్కసారిగా జగన్ ఈ బాంబు పేల్చారు. కొందరిని విచారంలోను మరికొంతమందిని ఆనందంలోను ముంచేసిన నిర్ణయం అది. ఓ విధంగా ఓ ప్రాంతానికి ఇది నచ్చని, మింగుడు పడని అంశం.
హై దరాబాద్ నగరం దూసుకుపోతోంది. అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ నగరంగా అవతరిస్తోంది. మహార్దశ అంటే ఇదే!... త్వరలో ప్రపంచస్థాయి వైమానిక విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు కానున్నదని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు- ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన అమెరికా ఉప సహాయ మంత్రి జోయల్ స్టార్ ముందు పేర్కొన్నారు.
ఇప్పుడు దేశంలో చెలరేగుతున్న పరిస్థితులు అత్యంత భయానకంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. మనసున్న వారికి కనులు చెమరిస్తాయి. హృదయం దైన్యంతో కరిగిపోతుంది. పత్రికలకు ఏమి చేటుకాలం వచ్చిందో జ్వాలాభీలమైన దృశ్యాలు చూపుతూ ప్రతిపక్ష పార్టీలు చేస్తే సిగ్గూ యెగ్గూ లేని రాజకీయమ్మన్యులు బరితెగించి వదరే శాంతియుత ప్రదర్శనలపై పోలీసు జులం, అధికార బలం అనే ప్రకటనలు ప్రచురిస్తున్నాయి?!
దేశ విభజన కాలం నుండి మన నేతలు ఇస్తున్న హామీలకు కార్యరూపం దాల్చుతూ భారత పార్లమెంట్ పౌరసత్వ సేవరణ చట్టాన్ని తీసుకు వస్తే దేశంలో పలు చోట్ల జరుగుతున్న నిరసనలు, అవి హింసారూపం దాల్చడం కేవలం సంకుచిత రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే అని భావించవలసి వస్తుంది. ఈ చట్టాన్ని చదివిన ఎవ్వరికైనా దీని ప్రభావం భారత పౌరులు ఎవ్వరిపై పడబోదని స్పష్టం అవుతున్నా ఎందుకు ఇంతగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారో అర్ధం కాదు.
మోదీజీ ప్రభుత్వంలో బిల్లులు చట్టసభల్లో శరవేగంతో ఆమోదం పొందుతున్నాయి. తాజాగా పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యాంగం అవహేళనకు గురి అయిందని కాంగ్రెస్ పార్టీ రంకెలు వేస్తున్నది.