S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ధర్మసందేహాలు
* మనం ఇప్పుడు కలియుగంలో వున్నాం కదా! ఇది ఎన్నవ మహాయాగంలోని కలియుగం. మనం చెప్పుకునే రామకృష్ణాద్యవతారాలు ఎప్పటివి? అలాంటి అవతారాలు మళ్ళీమళ్ళీ వస్తునే వుంటాయా?
- పి.హనుమాన్ ప్రసాద్, విజయవాడ
* రావణ సంహారం తరువాత, కుశలవులకు పట్ట్భాషేకం చేసినాక, శ్రీరాముడు అవతారం చాలించాడని విన్నాను. అప్పటికి ఆయన వయస్సు ఎంత వుండవచ్చు?
- కె.యల్.శివాజీరావు, హైద్రాబాద్
* వివిధ దేవతా సహస్ర నామాలకు సామూహిక పారాయణలు జరుగుతున్నా గాయత్రీ సహస్రానికి అలా ఎవరూ చేయటం లేదు ఎందువల్ల?
పద్మ, హైదరాబాదు
గాయత్రీ మంత్ర విషయంలో సాధకులకు గౌతమ మహర్షి శాపం వుంది. అందువల్ల సాధకులు గాయత్రీ దేవిని తరచుగా మరచిపోతూ వుంటారు. ఆ శాప ప్రభావంవల్లనే ఆ సహస్రనామ పారాయణాదులు గూడా విరళంగా జరుగుతున్నాయి.
ఖ అనేక కుటుంబాలల్లో పెద్దలు సద్వర్తనులే అయినా పిల్లలు వారి బాటలోనడవకుండా మనస్తాపం కలిగిస్తున్నారు దానికికారణమేమి?
పి.వి. నరసింహారావు, రాజమండ్రి
* సంధ్యావందనంలో తన చుట్టూ తాను తిరుగుతూ చదువుకునే నమో వాక్యాలలో వచ్చే ‘‘కామోకార్షీత్’’, ‘మన్యురకార్షీత్’ (నమో నమః) అనే పదాల అర్థము ఏమిటి ?
- ఈశ్వరరెడ్డి, హైదరాబాదు
* తెల్ల జిల్లేడు ప్రాశస్త్యమేమి? -యమ్.యన్.సత్యనారాయణ
* నేటి కలియుగంలో మానవుడు పాటించాల్సిన కనీస ధర్మాలు ఏవి? (కె.శ్రీనివాసులు, హైదరాబాద్)
ఈ విషయాన్ని భారతంలో వ్యాసభగవానుడే వివరించాడు. ఇతరులు ఏమి చేస్తే మన మనస్సుకు అప్రియం కలుగుతుందో అలాంటి పనిని మనం ఇతరులపట్ల చేయరాదు. దీనిని ప్రధాన సూచికగా స్వీకరిస్తూ ఎవరెవరి వర్ణాశ్రమాలకు విహితమైన ధర్మాలను చేతనైన మేరకు ఆచరించుకుంటు జీవించడమే ఉత్తమ మార్గం.
* నిత్యానుష్ఠానంలో ప్రతి మంత్రానికీ అంగన్యాస కరన్యాసాలు విడివిడిగా చేసి తీరాలా?
- బి.రాజేశ్వరమూర్తి, మచిలీపట్నం
- కుప్పా వేంకట కృష్ణమూర్తి
* శ్రీరామ మంత్రాన్ని జపించేటప్పుడు ఓంకార పూర్వకంగా జపించవచ్చునా?
అలా ఉపదేశం ఉంటే అలాగే జపించవచ్చు.
* జపం చేసేటప్పుడు వేళ్ల కణుపులతో సంఖ్యామానం చేయవలెనా? లేక వేళ్లతో చేయవలెనా?
- కె.వి.ప్రసాదరావు, కందుకూరు
* ధృతరాష్ట్రునికి రాజ్యపాలన హక్కులేదు గదా! అతనికే లేనప్పుడు, అతని కుమారుడు దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఎలా దానం చేశాడు? దానిని పెద్దలు ఎలా ఆమోదించారు?
- రత్నంరాజు, హైదరాబాదు