S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/02/2018 - 05:50

కొలంబో: శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రనీల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తప్పించడంతో నిరసనలు మిన్నంటాయి. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి సుప్తచేతనావస్థలో ఉంచారు. దీంతో విక్రమసింఘే పార్టీతోపాటు పలు రాజకీయ పక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగాయి.

10/31/2018 - 22:37

బీజింగ్, అక్టోబర్ 31: చైనాలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో 8400 నుంచి 7800 సంవత్సరాల క్రితం నాటి 16 గ్రామాల్లో ఆ నాటి శిథిలమైన ఇండ్లు, మానవులు ఉపయోగించిన వస్తువులు బయల్పడ్డాయి. ఈ వివరాలను చైనా మీడియా వెల్లడించింది. ఉత్తర చైనాలో మంగోలియా స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఈ ప్రాచీన అవశేషాలు కనుగొన్నారు. చైనాలోని యుమిన్ నాగరికతకు సంబంధించిన శిథిలాలను 2014లో చేపట్టిన తవ్వకాల్లో తొలిసారిగా కనుగొన్నారు.

10/30/2018 - 04:27

టోక్యో, అక్టోబర్ 29: విస్తృత పరివర్తనా పథంలో భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా భారత్ ఎదుగగలదన్న నమ్మకాన్ని అంతర్జాతీయ ఏజెన్సీలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.

10/30/2018 - 04:25

టోక్యో, అక్టోబర్ 29: భారత్‌లో అందుబాటులో ఉన్న వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని జపాన్ వ్యాపార, వాణిజ్య వేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ అన్ని విధాలుగా సానుకూల అవకాశాలను కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

10/30/2018 - 05:43

ఢాకా: మరో అవినీతి కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు ఏడుసంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒక చారిటబుల్ ట్రస్టు నుంచి తన భర్త పేరున మిలియన్ డాలర్లు వసూలు చేశారన్న ఆరోపణ రుజువు కావడంతో ఆమెకు కోర్టు ఈ శిక్ష విధించింది. ఇప్పటికే అస్వస్థతతో బాధపడుతున్న ఆమెకు అవినీతి కేసులో శిక్ష పడటం ఈ ఏడేళ్లలో ఇది రెండోసారి.

10/30/2018 - 04:17

కొలంబో, అక్టోబర్ 29: ఓ పక్క దేశ ప్రధానిగా తన నియామక వ్యవహారం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్స సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏ క్షణంలోనైనా పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. లంక పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

10/30/2018 - 04:17

కొలంబో, అక్టోబర్ 29: శ్రీలంక పార్లమెంట్‌లో ఇప్పటికీ తనకు మెజారిటీ ఉందని, ఇటీవల అధ్యక్షుడి చేతిలో తొలగింపునకు గురైన ప్రధాని రానిల్ విక్రమ్ సింఘే అన్నారు. ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయెన్స్ (యూపీఎఫ్‌ఏ) విక్రమ్‌సింఘే నేతృత్వంలోని యూఎన్‌పి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంలో మైనారిటీలో పడింది.

10/30/2018 - 04:12

టోక్యో, అక్టోబర్ 29: ముంబయి పటాన్‌కోట్ ఉగ్రదాడులకు పాల్పడ్డ వారిని తగిన విధంగా దండించాలని భారత్, జపాన్‌లు పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేశాయి. శిఖరాగ్ర భేటీలో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు ఉగ్రవాద కార్యకలాపాలను గర్హించారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిని ప్రతిఘటించాల్సిందేనని పిలుపునిచ్చారు.

10/30/2018 - 00:51

జకార్తా, అక్టోబర్ 29: ఇండోనేసియాలో సోమవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 189 మంది దుర్మరణం చెందారు. జకార్తా నుంచి బెలిటంగ్ టూరిస్టు కేంద్రానికి బయలు దేరిన బోయింగ్-737 మాక్స్ విమానం 13 నిముషాల్లోనే రాడార్ పరిధి నుంచి అదృశ్యమై జావా సముద్రంలో కుప్పకూలిపోవడంతో ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భారత పైలటే దీన్ని నడుపుతున్నట్టుగా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

10/29/2018 - 03:35

యమనాషి (జపాన్), అక్టోబర్ 28: భారత్, జపాన్ మధ్య స్నేహ సంబంధాలు చారిత్రాత్మకమైనవని, ఇరుదేశాలు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో పరస్పర సహకారంతో ముందడుగు వేస్తాయని జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇక్కడకు చేరుకున్నప్పుడు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వౌండ్ ఫూజీలోని అందమైన రిసార్ట్‌లో మోదీ బస చేశారు.

Pages