S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/22/2018 - 05:09

ఐక్యరాజ్యసమితి: వచ్చే వారం జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సిరియా, యెమెన్‌లో అల్లకల్లోలంతో పాటు పర్యావరణం-వాతావరణ మార్పులు, వివిధ దేశాల్లో చోటు చేసుకుంటున్న శాంతి సాధనకు తీసుకుంటున్న చర్యలపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.

09/21/2018 - 23:52

సెయింట్ పీటర్స్‌బర్గ్, సెప్టెంబర్ 21: సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించే విషయంలో ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉద్ఘాటించారు. చట్టాల కంటే కూడా సమాజంలో మార్పు తేవడానికి మనుషుల ఆలోచనల్లో పరివర్తన రావడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

09/21/2018 - 02:15

నాగా ( ఫిలిప్పైన్స్), సెప్టెంబర్ 20: ఫిలిప్పైన్స్‌లోని మధ్య ప్రాంతంలో పర్వతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 18 మంది సజీవంగా సమాధి అయ్యారు. పర్వతప్రాంతంలోని రెండుగ్రామాల్లో 30 ఇళ్లపై కొండ చరియలు విరిగిపడడంతో విషాద ఘటన చోటుచేసుకుంది. సెబూ ప్రొవిన్స్‌లోని నాగా సిటీకి సమీపంలో జరిగిన ఈ ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలను చేపట్టారు.

09/21/2018 - 02:08

వాషింగ్టన్, సెప్టెంబర్ 20: ఉగ్రవాదం పీచమణచడంలో భారత్ సంయమనంతో వ్యవహరిస్తూనే సరిహద్దు చొరబాట్లను అణచివేసే తీరును అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్నాయని అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన కంట్రీ రిపోర్ట్ ఆన్ టెర్రరిజం నివేదికలో పేర్కొంది.

09/21/2018 - 02:06

టోక్యో, సెప్టెంబర్ 20: జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని షింజో అబే ఘన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో తిరిగి గెలిచిన అబే మీడియాతో మాట్లాడుతూ ‘దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలూ పరిష్కరించేందుకే నాకీ అవకాశం దక్కింది’అని ప్రకటించారు.

09/21/2018 - 01:28

ప్యాంగ్‌యాంగ్, సెప్టెంబర్ 20: దశాబ్ధాల తరబడి శత్రుత్వంతో మెలిగిన ఉభయ కొరియా దేశా లు శాంతి దిశగా పయనిస్తున్నాయి. గురువారం ఉత్తరకొరియా, చైనా సరిహద్దులోని వాల్కనో పర్వత ప్రాంతంలో ఇరు దేశాధినేతలు కలుసుకుని కరచాలనం చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ప్రత్యేక విమానాల్లో వౌంట్ పేక్టూకు చేరుకున్నారు.

09/20/2018 - 02:44

మబండకా, సెప్టెంబర్ 19: ఉత్తర డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగోలోని కాంగో నది ఉపనది మొంగల నదిలో ఒక పడవ బోల్తాపడి కనీసం 27 మంది నీట మునిగి చనిపోయారని స్థానిక అధికారి ఒకరు బుధవారం తెలిపారు. పడవలోని మిగతా వారు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

09/20/2018 - 02:30

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: అవినీతి ఆరోపణలపై శిక్షపడి జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్, అతని కుటుంబ సభ్యులకు పాకిస్తాన్ ఉన్నత న్యాయస్థానం గొప్ప ఊరట కలిగించింది. కింద కోర్టు విధించిన శిక్షను బుధవారం రద్దు చేస్తూ వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది.

09/20/2018 - 02:13

లండన్, సెప్టెంబర్ 19: ఓ మోడల్ దంపతులపై రష్యా ప్రభుత్వం విషప్రయోగం చేసిందన్న వార్తలు మరోసారి బ్రిటన్‌లో కలకలం రేపాయి. రష్యా అధ్యక్షడు పుతిన్ తమ హత్యకు కుట్రపన్నారని మోడల్ ఆరోపించింది. ఈ ఏడాది మార్చిలో రష్యా మాజీ ఏజెంట్ సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యూలియా ప్రణాంతమైన ‘నొవిఛోక్’ తీసుకుని అపస్మారక స్థితిలో కనిపించారు.

09/18/2018 - 02:06

వాలెట్టా, సెప్టెంబర్ 17: భారత్-మాల్టాలు కీలకమైన మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నౌకా వాణిజ్యానికి సంబంధించి, ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. దీనికి సంబధించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాల్టా అధ్యక్షురాలు మారియా లూసే కొలెయిరో పెర్కా మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాలు మూడు ఎంఓయూలపై సంతకాలు చేశాయి. మారిటైమ్ కో-ఆపరేషన్, టూరిజం, డిప్లోమాటిక్ స్టడీస్‌పై ఈ ఒప్పందాలు జరిగాయి.

Pages