S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/02/2018 - 05:49

డెహ్రాడూన్, సెప్టెంబర్ 1: మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముందుకు వచ్చారు. ఈ వివరాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల సీఎం రావత్ ముంబాయికి వెళ్లినప్పుడు సంజయ్‌దత్‌ను కలిశారు.

09/02/2018 - 05:47

కొలంబో, సెప్టెంబర్ 1: శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాజకీయ స్వయం ప్రతిపత్తి దిశగా చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. లంకలో స్థిరపడిన తమిళులకు రక్షణ లేదని, హత్యలు, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఎల్‌టీటీఈ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. తమిళులకు ప్రత్యేక దేశం అవసరమన్న డిమాండ్‌తో ప్రభాకరన్ ఎల్‌టీటీఈని ఒక పోరాట సంస్థగా మార్చేశాడు.

09/01/2018 - 06:26

ఖాట్మాండు, ఆగస్టు 31: ఇక్కడ జరుగుతున్న బిమ్స్‌టెక్ నాలుగో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ థాయిలాండ్, మయన్మార్, భూటాన్ దేశాలకు చెందిన నేతలతో శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘్థయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఒ-చాతో ఈ రోజు నేను చర్చలు జరిపా.. ఇరుదేశాల మధ్య సంబంధాల మెరుగుతో పాటు ఇరుదేశాల పౌరులకు ఉపయోగపడే అనేక అంశాలను మేమిద్దరం చర్చించుకున్నాం’ అని మోదీ ట్వీట్ చేశారు.

09/01/2018 - 06:06

ఖాట్మండు, ఆగస్టు 31: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలు సమష్టిగా పోరాడాలని , ప్రమాదకరంగా తయారైన ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను గుర్తించి జవాబుదారీ చేయాలని బంగాళాఖాతం తీరంలో ఉన్న దేశాల కూటమి (బిమ్స్‌టెక్) పిలుపునిచ్చింది. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు భంగం కలిగించే ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు పరస్పర సహకారం అందించుకోవాలని ఈ కూటమి నిర్ణయించింది.

08/31/2018 - 05:47

వాషింగ్టన్, ఆగస్టు 30: ఉగ్రవాద సంస్థలకు నిలయంగా ఉన్న పాకిస్తాన్‌కు భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు వీలుగా అవకాశం ఇస్తున్నట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. పాక్ కొత్త అధ్యక్షుడిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ వైఖరి, వేసే అడుగులను పరిశీలించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింద.

08/31/2018 - 04:48

ఖాట్మాండు, ఆగస్టు 30: ప్రపంచంలో వేళ్లూనుకుపోయిన ఉగ్రవాదం, డ్రగ్స్ సరఫరా వంటి అతిపెద్ద సమస్యలను నిర్మూలించడానికి ఇతరదేశాలతో కలిసి పనిచేయడానికి తామెప్పుడూ సిద్ధమేనని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇక్కడ భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ భాగస్వాములుగా ఉన్న బిఐఎంఎస్‌టెక్ (బిమ్స్‌టెక్) నాలుగో శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/31/2018 - 04:51

జకార్తా, ఆగస్టు 30: అంతర్జాతీయ అథ్లెటిక్స్ రంగంలో అంతంత మాత్రంగా ఉండే భారత్ ఆసియా క్రీడల్లో సత్తా చాటుతున్నది. గురువారం అథ్లెటిక్స్‌లోనే రెండు స్వర్ణాలను దక్కించుకోవడం విశేషం. పురుషుల 1,500 మీటర్లపరుగులో జిన్సన్ జాన్సన్ స్వర్ణాన్ని సాధించాడు. మహిళల 4న400 మీటర్ల రిలే జట్టు కూడా భారత్ ఖాతాలో ఒక స్వర్ణాన్ని చేర్చింది.

08/29/2018 - 23:46

హాంగ్‌కాంగ్, ఆగస్టు 29: భార్యను కిరాతకంగా చంపేసిన ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ను హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో చెయింగ్ కీ ఛుంగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. భార్యను చంపేసి మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో కుక్కేసి తన ఆఫీసులోనే ఉంచాడు. విద్యుత్ వైరు మెడకు బిగించి అంత్యత పాశవికంగా భార్యను చంపేశాడని పోలీసులు వెల్లడించారు.

08/29/2018 - 23:37

ఖాట్మాండూ, ఆగస్టు 29: ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, స్నేహ సంబంధాల వల్లనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన బంగాళాఖాతం తీరంలో ఉన్న బంగ్లాదేశ్, ఇండియా, మియాన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ దేశాల (బీమ్‌స్టెక్) సదస్సు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

08/28/2018 - 22:23

బీజింగ్, ఆగస్టు 28: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా నలుగుతున్న బంగ్లాదేశ్ రోహింగ్యాల సమస్యకు రాజకీయ వేదికపై చర్చలే సరైన పరిష్కారమని చైనా అభిప్రాయపడుతోంది. అయితే, ఈ సమస్యపై ఏకపక్ష ఆరోపణలు చేయడం, ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలు ఏమాత్రం పనిచేయవని చైనా పేర్కొంది.

Pages