S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/25/2018 - 02:57

న్యూఢిల్లీ/లండన్, ఆగస్టు 24: భారత్‌ను బీజేపీ, ఆరెస్సెస్ శక్తులు విభజిస్తున్నాయని, దేశ సమైక్యతకు, సమగ్రతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. బీజేపీ మతం ప్రాతిపదికన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

08/25/2018 - 02:50

న్యూయార్క్, ఆగస్టు 24: ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెచ్1బీ వీసాలపై తలాతోక లేకుండా అనుసరిస్తున్న విధానాల వల్ల అమెరికా ఆర్థిక రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని అమెరికా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై ఇష్టం వచ్చిన రీతిలో ప్రకటనలు చేయడం వల్ల అమెరికాకు చెందిన ఐటి కంపెనీల విధానాలు అస్థిరత్వానికి లోనవుతున్నాయి.

08/24/2018 - 02:28

కైరో/వాషింగ్టన్, ఆగస్టు 23: అందరూ చనిపోయాడని భావిస్తున్న ఐఎస్‌ఐఎస్ (ఐసిస్) చీఫ్ అబు బకర్ అల్-బగ్దాదీ తను అనుచరులకు సందేశాన్నిచ్చే ఆడియో టేప్ ఒకటి బుధవారం విడుదలైంది. 55 నిమిషాల నిడివిగల ఈ టేప్‌ను ఐసిస్ అధికారిక మీడియా అల్-్ఫర్ఖాన్ విడుదల చేసింది. గత ఏడాది మేలో సిరియా నగరం రక్కాలో రష్యా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో అల్-బగ్దాదీ మరణించాడని అందరూ భావించారు.

08/24/2018 - 02:23

ఇస్లామాబాద్, ఆగస్టు 23: భారత నౌక దళమాజీ అధికారి కులభూషణ్ జాదవ్ పాక్ గడ్డపై గూఢాచర్యానికి పాల్పడ్డారని చెప్పేందుకు గట్టి ఆధారాలు ఉన్నాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చెప్పారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్‌పైన అభియోగాలపై విచారణ జరుగుతోందన్నారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్ కోర్టు జాదవ్‌పై వచ్చిన అభియోగాలను విచారించి మరణశిక్షను ఖరారు చేసింది.

08/24/2018 - 01:40

వాషింగ్టన్, ఆగస్టు 23: తనను అమెరికా కాంగ్రెస్ అభిశంసిస్తూ తీర్మానం ప్రవేశపెడితే స్టాక్‌మార్కెట్ కుప్పకూలుతుందని, అమెరికన్లు పేదలుగా మారుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హౌస్ ఆఫ్ రిప్రంజెంటీవ్‌స్‌లో ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉంది. అభిశంసన తీర్మానం చేయాలా వద్ద అనే విషయమై ఇక్కడే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

08/23/2018 - 06:22

లండన్, ఆగస్టు 22: బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విధానానికి భారతీయులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. బ్రిటన్‌ను విండ్రష్ ఇమ్మిగ్రేషన్ స్కాం కుదిపేస్తోంది. బ్రిటన్ పాలనలో ఉన్న దేశాల మధ్య సమన్వయం, అభివృద్ధి సాధనకు కామన్‌వెల్త్ నేషన్స్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఆ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు బ్రిటన్‌కు వెళ్లి స్థిరపడే సంప్రదాయం ఉండేది.

08/23/2018 - 05:57

బీజింగ్, ఆగస్టు 22: భారత్, పాకిస్తాన్ దేశాల ద్వైపాక్షిక మైత్రీ సంబంధాలు బలపడే దిశగా నిర్మాణాత్మక కృషి జరుపుతామని చైనా విదేశంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాన్ని రెండు దేశాల ప్రధాన మంత్రులు వ్యక్తం చేయడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు.

08/23/2018 - 05:56

వాషింగ్టన్, ఆగస్టు 22: కేరళలో జల విధ్వంసం, వరదల బీభత్సంపై అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాటిలైట్ డేటాను సేకరించింది. వీడియో ద్వారా సేకరించిన దృశ్యాలను శాటిలైట్ డేటాలో నిక్షిప్తం చేశారు. కేరళలో నమోదైన వర్షపాతం, వరద నీటి ప్రవాహం వివరాలను కూడా సేకరించారు. కేరళలో ఈ ఏడాది కనీవినీ ఎరుగని విధంగా వరదలు సంభవించాయి. నైరుతి రుత పవనాల రెండు దశల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కేరళ జలమయమైంది.

08/23/2018 - 05:02

పాలెంబాగ్, ఆగస్టు 22: ఆసియా గేమ్స్ స్వర్ణ పతకాల సాధనలో భారత్ మరో మెట్టెక్కింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో రహి సర్నోబాట్ స్వర్ణం సాధించడమే కాదు, షూటింగ్‌లో స్వర్ణం అందుకున్న తొలి భారత మహిళగానూ రికార్డుకెక్కింది. ఫైనల్స్‌లో ఫిలిప్పైన్స్ షూటర్ నఫాస్వన్ యాంగ్‌పైబూన్‌తో రసవత్తరంగా సాగిన పోరులో కొల్హాపూర్ డిప్యూటీ కలెక్టర్ రహిదే చివరకు పైచేయి అయ్యింది.

08/22/2018 - 01:40

వాషింగ్టన్, ఆగస్టు 21: చంద్రుడిపైన మంచు రూపంలో గడ్డకట్టిన జలనిధి ఉందని శాస్తవ్రేత్తలు నిర్ధారించారు. చంద్రుడిపై అత్యంత శీతల ప్రాంతాల్లో మంచు గడ్డలు ఉన్నాయి. చంద్రయాన్-1 అంతరిక్ష నౌక ద్వారా సేకరించిన వివరాల్లో ఈ విశేషాలను కనుగొన్నారు. చంద్రయాన్-1ను భారత్ పదేళ్ల క్రితం ప్రయోగించగా, కొంత డాటాను పంపించింది.

Pages